<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-6773585286935486845</id><updated>2012-01-26T09:25:28.458-08:00</updated><category term='AJ sandarbham 09 January 2011'/><category term='AJ Sandarbham 28 August 2011'/><category term='Sandarbham 14 Nov 2010 General Politics'/><category term='AJ Sandarbham 01 Jan 2012'/><category term='sandarbham 21 Nov 2010'/><category term='AJ sandarbham 13 June 2010'/><category term='AJ Editorial 2 march 2010'/><category term='AJ Sandarbham 05 June 2011'/><category term='Aj Editorial 15 Dec 2009'/><category term='AJ Articles 19Oct2011'/><category term='AJ Sandarbham 07 Aug 2011'/><category term='AJ Editorial 13 March 2010'/><category term='Dhanurmaasam'/><category term='Sandarbham AJ  04 July  2010'/><category term='AJ Sandarbham 24 July 2010'/><category term='Travelogue AJ Sunday 23 Jan 2011'/><category term='AJ Sandarbham 13 Feb 2011'/><category term='AJ Sandarbham 23 Oct 2011'/><category term='general'/><category term='AJ Sandarbham  25 Septmeber 2011'/><category term='AJ Sandarbham 21 Aug 2011'/><category term='AJ Sandarbham 01 May 2011'/><category term='AJ Sandarbham 06 Mar 2011'/><category term='AJ Sandarbham 22 Jan 2012'/><category term='AJ Sandarbham 09 Oct 2011'/><category term='Aj Sandarbham 13 March 2011'/><category term='AJ Editorial 06 Oct 2010'/><category term='AJ Editorial 20 May 2010'/><category term='AJ Sandarbham 4 Oct 2010   Communalism'/><category term='AJ Sandarbham24 Oct 2010   Telangana'/><category term='AJ Sandarbham 11April 2010 Greenhunt'/><category term='AJ Sandarbham 16May 2010'/><category term='AJ Editorial 25 June 2010'/><category term='AJ Sandarbham 20 June 2010 Trafficking'/><category term='AJ Sandarbham 18 Dec 2011'/><category term='AJ Sandarbham 30 Oct 2011'/><category term='AJ Sandarbham 26 June 2011'/><category term='AJ Sandarbham  12 December 2010'/><category term='AJ Sandarbham 22 May 2011'/><category term='AJ Sandarbham 11 July 2010'/><category term='AJ Sandarbham 2 January 2011'/><category term='AJ Sandarbham 15 Jan 2012'/><category term='AJ Sandarbham 10 April 2011'/><category term='AJ Sandarbham 12 June 2011'/><category term='AJ Sandarbham 20 Mar 2011'/><category term='AJ Sandarbham 30 Jan 2011'/><category term='AJ Sandarbham 03 July  2011'/><category term='AJ Sandarbham 03 Apr 2011'/><category term='AJ Sandarbham 06 Nov 2011'/><category term='AJ Editorial 30 April 2010'/><category term='AJ Sandarbham 18 July 2010'/><category term='AJ Sandarbham  25 July 2010'/><category term='AJ Editorial 03 Sept 2011'/><category term='Travelogue AJ Sunday 15 May 2011'/><category term='AJ Sandarbham 6 June 2010'/><category term='AJ Sandarbham 28 Nov 2010'/><category term='AJ Sandarbham 14 Aug 2011'/><category term='AJ Editorial 08 Oct 2010'/><category term='AJ Sandarbham 1 Aug 2010   Telangana'/><category term='AJ Sandarbham 20 Nov 2011'/><category term='AJ Sandarbham  11 Septmeber 2011'/><category term='AJ Editorial 02 Jul 2011'/><category term='AJ sandarbham 31 Jan 2010'/><category term='AJ Sandarbham 26 Sept 2010   Telangana'/><category term='AJ Sandarbham 02 Oct 2011'/><category term='AJ Editorial 01 Jul 2011'/><category term='AJ Editorial 25 Aug 2010'/><category term='AJ Sandarbham 07 Nov 2010'/><category term='AJ Sandarbham 29 May 2011'/><category term='AJ Sandarbham 31July 2011'/><category term='AJ Sandarbham 21 Feb 2010   Telangana'/><category term='AJ Sandarbham 18April 2010 Greenhunt'/><category term='AJ Sandarbham 27 Feb 2011'/><category term='AJ Sandarbham 15 Aug 2010'/><category term='AJ Sandarbham 19 June 2011'/><category term='AJ Editorial 6 July 2010'/><category term='AJ Editorial 25 March 2010'/><category term='AJ Editorial 28 Oct 2010 Telugu Culture'/><category term='AJ Sandarbham 17 Apr 2011'/><category term='AJ Sandarbham 10 October 2010   Telangana'/><category term='AJ Editorial 24 Dec 2009'/><category term='Aj Sandarbham 15 May 2011'/><category term='AJ Sandarbham 27 Mar 2010'/><category term='AJ Sandarbham 10 July 2011'/><category term='Sahityam Criticism History_of_Literature'/><category term='AJ Sandarbham 7 March 2010'/><category term='AJ Sandarbham 4 Apri; 2010'/><category term='AJ Sandarbham 22 Aug 2010   Telangana'/><category term='AJ Sandarbham 20 Feb 2011'/><category term='AJ Sandarbham 11 Dec 2011'/><category term='columns singlecolumn AJ old'/><category term='AJ Sandarbham 7 Feb 2020'/><category term='AJ Sandarbham 30 May 2010'/><category term='AJ Sandarbham 08 Jan 2012'/><category term='AJ Sandarbham 23May  2010'/><category term='AJ Sandarbham 13 Nov 2011'/><title type='text'>సంభాషణ</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default?start-index=101&amp;max-results=100'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>109</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-6720332513095205886</id><published>2012-01-25T07:47:00.000-08:00</published><updated>2012-01-25T07:47:13.126-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 22 Jan 2012'/><title type='text'>భీషణ ప్రతిజ్ఞల భూకంపాలెక్కడ?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; లేస్తే మనిషిని కాదు- అని శపథాలు చేసి, లేవకుండా చతికిలపడి కూర్చుంటే  ఏమిటర్థం? జనవరి 18 తరువాత తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేస్తాం,  భూకంపం పుట్టిస్తాం అని పెద్దమాటలు చెప్పిన పెద్దలు, ఇప్పుడు ఒక దీర్ఘకాలిక  నత్తనడక కార్యక్రమాన్ని ప్రకటిస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రత్యేక  రాష్ట్ర సాధన మాట పక్కనబెట్టి 2014 ఎన్నికల గురించి మాత్రమే చర్చిస్తే, ఉప  ఎన్నికలకో స్థానిక ఎన్నికలకో పనికివచ్చే ప్రణాళికను రూపొందిస్తే సాధారణ  తెలంగాణవాది ఏ నిర్ధారణకు వస్తారు? రెండు సంవత్సరాల నుంచి అనుక్షణం  ఉద్వేగంతో, ఉత్కంఠతో, తపనతో రగిలిపోయిన ఒక సామాన్య ఉద్యమకార్యకర్త  మనోభావాలు ఈ తాజా నిర్ణయాల వల్ల ఎట్లా ప్రభావితమవుతాయి? &lt;br /&gt;&lt;br /&gt;జనవరి 20, 21 తేదీల్లో జరిగిన తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి  (పొలిటికల్ జెఎసి) సమావేశంలో జరిగిన నిర్ణయాలు చూస్తే, తెలంగాణ సాధన  ప్రస్తుతం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. 2014 మీద  ఆశపెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ, ఆ ఏడాది ప్రత్యేక రాష్ట్రం  సిద్ధిస్తుందనికాక, ఎన్నికలలో గొప్ప విజయాలు సాధించడం మీదనే అసలు ఆశ.  కాబట్టి, రానున్న రోజుల్లో మృదువైన, సాధారణమైన ఉద్యమకార్యక్రమాలు మాత్రమే  సాగుతాయి. ఏప్రిల్ తరువాత మాత్రమే మళ్లీ విజృంభిస్తారట.  ఈ లోగా మండలస్థాయి సదస్సులు, ప్రచార కార్యక్రమాలు చేపడతారట. విద్యార్థులకు  పరీక్షల సందర్భంగా ఎటువంటి సమస్యలూ రాకుండా, లక్ష ఉద్యోగాల సాధనలో  నిరుద్యోగులకు కష్టం కలగకుండా, సాధారణ జనజీవనం స్తంభించిపోకుండా,  ప్రభుత్వపాలనలో కిరణ్‌కుమార్‌రెడ్డికి, యాత్రల నిర్వహణలో చంద్రబాబుకు,  జగన్మోహన్‌రెడ్డికి, వీలయితే చిరంజీవికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా  జాగ్రత్తగా పోరాటానికి రూపకల్పన చేస్తున్నట్టు కనిపిస్తున్నది. &lt;br /&gt;&lt;br /&gt;మంచిదే. స్వయంపాలనతో మరింత అభివృద్ధి సాధ్యమన్న దృష్టితో ఉద్యమాలు  చేస్తున్నవారు, ఆ క్రమంలో అభివృద్ధికి, భావితరాల పురోగతికి ఆటంకం కలిగే  పద్ధతిలో వ్యవహరించకుండా సాధ్యమైనంత జాగ్రత్త పాటించాలి. శాంతియుతంగా,  రాజకీయమైన ఒత్తిడిని తీవ్రతరం చేసే పోరాటరూపాలను ఎంచుకోవాలి. పరిపక్వత,  నిగ్రహం&lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; కలిగిన ఉద్యమాలు నైతికమైన ప్రభావం వేయగలుగుతాయి. తెలంగాణ ఉద్యమం అటువంటి గమనాన్ని ఎంచుకుంటే, ప్రత్యేక రాష్ట్రాన్ని  వ్యతిరేకించేవారు కూడా తమ ధోరణిని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.  కాబట్టి, జెఎసి వారు తమ ఉద్యమాన్ని సమీక్షించుకుని,  సంస్కరించుకోవాలనుకుంటే అందులో తప్పుపట్టవలసినదేమీ లేదు. కాకపోతే, వారికి ఈ  ఎరుక ఏ నేపథ్యంలో కలిగింది, ఏ ప్రయోజనాల కోసం కలిగింది అని చర్చించక  తప్పదు. &lt;br /&gt;&lt;br /&gt;1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విద్యార్థియువజనులు  ప్రారంభించినప్పటికీ, మర్రిచెన్నారెడ్డి దాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని,  1971 ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించి, ఆ వెంటనే తెలంగాణ ప్రజాసమితిని  కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేశారు. ద్రోహమో మోసమో రాజీయో కానీ, అంతా కలిపి  మూడునాలుగేళ్లలో విషయం తేలిపోయింది. ఆంధ్ర ప్రాంతంలో జైఆంధ్ర ఉద్యమం  వచ్చేనాటికి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం గురించిన తీవ్రతే లేకుండా  పోయింది. కానీ, ప్రస్తుత తెలంగాణ ఉద్యమం మొలకెత్తి పదిహేనేళ్లు గడచిపోయాయి.  తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్) ఆవిర్భవించి పదేళ్లు దాటిపోయాయి.  పరిష్కారానికి ఇంకా ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. రెండు సాధారణ  ఎన్నికలను, అనేక స్థానిక ఎన్నికలను టిఆర్ఎస్ ఎదుర్కొన్నది. ఆ పార్టీ నేత  కెసిఆర్ తలపెట్టిన నిరాహారదీక్ష అనేక మలుపుల అనంతరం ఉధృత ఉద్యమానికి  దారితీసి, 2009 డిసెంబర్ 9 ప్రకటనకు దారితీసింది. దానికి సీమాంధ్ర  ప్రాంతాలలో వ్యక్తమయిన వ్యతిరేకత, వివిధ రాజకీయపక్షాల మాటమార్పిడి వల్ల  తెలంగాణలో ఉద్యమం చిన్న విరామాలతో అయినప్పటికీ నిలకడగా, తీవ్రంగా  కొనసాగింది. సకలజనుల సమ్మెతో పతాక స్థాయికి వెళ్లిన ఉద్యమం- సమ్మె విరమణ అనంతరం  చప్పపడిపోయింది. ఆవేదన పడడానికి, ఆశాభంగం చెందడానికి కూడా ఆస్కారం లేని ఒక  నీరస వాతావరణం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం సాధ్యాసాధ్యాల గురించిన వేదాంత  ధోరణి ఒకటి తెలంగాణ వాదులను ఆవరించింది. ఆ సందర్భంలో టిఆర్ఎస్, జెఎసి  నాయకత్వాలు- జనవరి 18 తరువాత తడాఖా చూపిస్తామన్న ప్రకటనతో తమ ఉనికిని  నిరూపించుకునే ప్రయత్నాలు చేశాయి. &amp;nbsp; ఏవో గొప్ప నిర్ణయాలు జరిగిపోతాయని ఆశపెట్టుకునే పరిస్థితి లేదు కానీ, ఏం  జరుగుతుందో చూద్దామన్న ఆసక్తి మాత్రం తెలంగాణవారిలో మిగిలింది. ఒక నిర్వేద  వాతావరణం కొనసాగుతూనే ఉన్నది కాబట్టి, జెఎసి తాజా నిర్ణయాలు వారిని కొత్తగా  నిరుత్సాహపరిచేదేమీ లేకపోవచ్చు. నిస్సహాయమైన పెదవి విరుపు తప్ప వారి  నుంచి ఎటువంటి స్పందనా ఉండకపోవచ్చు. ఆశ లేనిచోట నిరాశకు కూడా తావు ఉండదని  కొత్తగా చెప్పుకోనక్కరలేదు కదా? &lt;br /&gt;&lt;br /&gt;తాత్కాలిక ఉద్యమాలు కాదు, దీర్ఘకాలిక ఉద్యమాలు నిర్వహించాలి, జెఎసిని మరింత  బలోపేతం చేయాలి, భాగస్వామ్యపక్షాలను జెఎసి వెనకేసుకురావాలి- వంటి రకరకాల  వ్యాఖ్యలు కెసిఆర్ జెఎసి సమావేశంలో చేశారు. జెఎసి కానీ, అందులో ప్రధాన  పక్షమైన టిఆర్ఎస్ కానీ ఉద్యమవైఫల్యాల గురించి చేసుకున్న ఆత్మవిమర్శ ఏదీ ఆ  సమావేశంలో వినిపించలేదు. ఉద్యమంలో ప్రధానపాత్ర నిర్వహించిన విద్యార్థులు  సకలజనులసమ్మె నాటి నుంచి కార్యాచరణ నుంచి ఎడంగా ఉండడం గమనించవచ్చు. ఉద్యమభారాన్నంతా తమ భుజాల మీద వేసుకున్న ఉద్యోగవర్గాలు- సమ్మెవిరమణ నాటి  ఒప్పందాల అమలు గురించి ఆందోళన చెందవలసిన స్థితికి వెళ్లారు. కెసిఆర్‌ను,  జెఎసిని విమర్శించే ఇతర ఉద్యమసంఘాలు, నేతలు కూడా జడత్వంలోకి వెళ్లిపోయారు.  తిరిగి ఉద్యమాన్ని సజీవస్థితిలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యం ఎవరిలోనూ  కనిపించడం లేదు.  ఆర్మూర్‌లో జగన్‌కు నిరసన తెలపడానికి ప్రయత్నించిన న్యూడెమొక్రసీ, ఇప్పుడు  పోరుయాత్ర నిర్వహిస్తున్న బిజెపి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు కానీ,  టిఆర్ఎస్‌లో అయితే చలనమే లేదు. కొత్తగా ప్రకటించిన కార్యాచరణ నీరసంలో  ఉన్నవారిని నిద్రపుచ్చేతీరులోనే ఉంది తప్ప, కుదిపివేసే తీరులో లేదు.  కావాలనుకున్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఉద్యమాన్ని నిద్రలేపి, ఉధృతం  చేయవచ్చుననే మొండిధైర్యమేదో కెసిఆర్‌లో, జెఎసి నేతల్లో ఉన్నట్టుంది. కానీ,  అన్ని సమయాలూ తమవి కావని, అవకాశాలు పునరావృతం కావడం అరుదని వారికి ఎవరు  చెప్పాలి? &lt;br /&gt;&lt;br /&gt;కాంగ్రెస్‌పార్టీతో విమర్శనాత్మక స్నేహం, తెలుగుదేశం పార్టీతో రాజకీయవైరం,  జగన్‌పార్టీపై అనుమానాస్పద వైఖరి- ఇదీ టిఆర్ఎస్ అనుసరిస్తున్న పంథా. ఆ  పార్టీ రాజకీయ అవసరాలను తీసిపారేయలేము. కానీ, ఉద్యమపార్టీకి ఉద్యమలక్ష్యాలే  ప్రధానంగా ఉండాలి. 2014 దాకా ఉద్యమాన్ని కొనవూపిరితో ఉంచి, దాని నుంచి  మూడో పర్యాయం కూడా రాజకీయ లాభం పొందాలని కాంగ్రెస్ భావిస్తున్నది.&amp;nbsp; లేకపోతే, సమస్యను తేల్చిపారేయాలనుకుంటే, ఇప్పటి కంటె అనువైన సమయమూ  వాతావరణమూ కాంగ్రెస్‌కు దొరకవు. కానీ, ఎన్నికల దాకా ఈ అస్త్రాన్ని  దాచుకోవాలని అనుకుంటోంది. టిఆర్ఎస్ కూడా దానికి సహకరిస్తోంది. ఎన్నికల  ముందే వైఖరి ప్రకటించి కాంగ్రెస్ ముందుకు వెడుతుందా, వాగ్దానంగా  ఉపయోగించుకుంటుందా తెలియదు. ఈ లోగా, ఉత్తరాది ఎన్నికల్లో పరిస్థితి  వికటించి, జాతీయస్థాయిలో ప్రమాదం ఎదురయ్యే పక్షంలో- కాంగ్రెస్ తెలంగాణ  గురించి ఆలోచించే పరిస్థితిలోనే ఉండకపోవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;బంద్‌లూ రాస్తారోకోలూ రైల్‌రోకోలూ చేసి ఉద్రిక్త పరిస్థితులు  సృష్టించాలని, దాడులూ ధ్వంసాలతో బీభత్సం చేయాలని తెలంగాణవాదులెవరూ  కోరుకోవడం లేదు. వారు కోరుకుంటున్నదల్లా, స్పందించే నాయకత్వం. చుక్కెదురు  అయినప్పుడల్లా కోపగృహంలోకో అజ్ఞాతంలోకో వెళ్లి మొహం చాటేసే నాయకత్వం కాదు.  ఇదీ పరిస్థితి, దీన్ని ఇట్లా ఎదుర్కోవాలనుకుంటున్నాము, ఫలానా సమయంలో ఫలానా  రీతిలో మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తాము- అని ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని  నచ్చచెప్పే పారదర్శకత నాయకత్వంలో ఉండాలి.  రకరకాల విమర్శలూ అభియోగాలూ నిందలూ నాయకత్వం మీద వస్తున్నప్పుడు, వాటి  గురించి వివరణలు ఇవ్వాలి. ఖండనలు ఇవ్వాలి. ఒక వ్యవస్థితమైన యంత్రాంగంగా  టిఆర్ఎస్ రోజువారీ సంఘటనలపై స్పందించాలి, పార్టీని బలోపేతం చేయాలంటే జెఎసి  పూనుకోవడం కాదు, జెఎసిని భాగస్వామ్యపక్షాలే పటిష్టం చేయాలి. అవసరమైన  స్వతంత్రతను జెఎసి నాయకత్వానికి ఇవ్వాలి. సెంటిమెంటు మీద పార్టీని  నెట్టుకుంటూ రావడం కాకుండా, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణాన్ని ఏర్పరచాలి.  ఉద్యమపార్టీ అయిన టిఆర్ఎస్‌కు ప్రధానంగా నాయకులూ, అభిమానులూ తప్ప,  చెప్పుకోదగ్గ కార్యకర్తల బలం లేదన్నది వాస్తవం. ఉద్యమంలో విరామం  లభించినప్పుడు, దాన్ని పార్టీనిర్మాణానికి వినియోగించుకోవడం వివేకవంతుల  లక్షణం. &lt;br /&gt;&lt;br /&gt;వైఫల్యం వల్ల అంతరాయం ఏర్పడినప్పుడు- ఐకమత్యం సడలుతుంది. రానున్న రోజుల్లో  తెలంగాణ ఉద్యమంలో అంతర్గత కలహాలు పెచ్చుమీరే అవకాశం ఉంది. బలహీనపడినప్పుడు  ప్రత్యర్థుల దాడులు తీవ్రమవుతాయి. మబ్బుల్లో నీళ్లకోసం పరిగెత్తినట్టుగా  2014 మీద గురిపెట్టుకుంటే, ఈ లోగా అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-6720332513095205886?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/6720332513095205886/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post_25.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/6720332513095205886'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/6720332513095205886'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post_25.html' title='భీషణ ప్రతిజ్ఞల భూకంపాలెక్కడ?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-8902270453072310790</id><published>2012-01-19T03:42:00.000-08:00</published><updated>2012-01-19T03:42:41.576-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 15 Jan 2012'/><title type='text'>మిన్ను విరిగి మీద పడుతున్నది, చూస్తున్నామా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;    &lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; ఒకప్పుడు తెల్లవారుజాము హైదరాబాద్ ఆకాశమంటే ఎండాకాలమైనా సరే మంచుముసుగు  కప్పుకునే ఉండేది. రాజధానిని రెండుగా చీల్చే మూసీదారి పక్కగా వెడితే,  అంగుళం దూరంలో కూడా ఏమున్నదో పొద్దుటిపూట కనిపించేది కాదు. అన్ని రుతువులూ  ఆహ్లాదంగా ఉండే ఆ రోజుల్లో సలసలకాగే ఎండాకాలం మాటే లేదు, మాటవరసకు మే  మాసంలో మాత్రం కొంచెం ఉక్కపోసేది. &lt;br /&gt;&lt;br /&gt;బాగున్నవాటిని పాడుచేయడమే మనుషులం చేసే పని. ఏ కొండకోనల్లోనో ఏ దేవుణ్ణో  కనుక్కోవడం, ఆ చోటు అపవిత్రం అయిపోయేదాకా కిక్కిరిసిపోవడం, పర్వతసానువుల్లో  చల్లదనపు చలివేంద్రాలను కనిపెట్టడం, అక్కడ ఉక్కపోతను ప్రతిష్ఠించేదాకా  పర్యాటకం చేయడం- ఇదీ మనుషుల అలవాటు. ఎవరెస్టుదారినే ప్లాస్టిక్ చెత్తతో  నింపేవారికి, పర్యావరణ ద్వీపాలను కాపాడుకోవడం ఎట్లా తెలుస్తుంది? పేదవారి  ఊటీగా, ఆరోగ్యానికి ఆలవాలంగా, ఆహ్లాదమే నిత్యరుతువుగా ఉండిన హైదరాబాద్ కూడా  అట్లాగే ధ్వంసమయిపోయింది. ఒడిపట్టనంత జనసమ్మర్దం, పచ్చదనాన్ని కబళించే  కాంక్రీట్ విప్లవం నగరంలో రుతువుల గతినే మార్చివేశాయి. &lt;br /&gt;&lt;br /&gt;తెల్లటి మేలిముసుగు కప్పుకుని చేతులు పైకి సాచి అనంతశూన్యాన్ని  అందుకుంటున్నట్టు కనిపించే చార్మినార్ ఇప్పుడు హేమంతంలో సైతం మాసిన  వెలిసిపోయిన కట్టడంలాగానే కనిపిస్తుంది. అల్లంతదూరం నుంచి చూస్తే, మసకమసకగా  బాలాహిస్సార్ అంచులు మాత్రమే లీలగా కనిపించే గోలకొండ- ఒకనాడు దక్షిణాదిని  ఏలిన సామ్రాజ్యపు రాజధాని- ఇప్పుడు ముప్పేటగా ముట్టడించిన భవనసైన్యం ముందు  మరుగుజ్జు &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;అనిపిస్తుంది. చరిత్ర వద్దనుకున్న మనిషి, ఎండావానల వైవిధ్యాన్నీ  వద్దనుకున్నాడు, ఉద్యానవనాల వైభవాన్నీ కాదనుకున్నాడు. సిమెంటు కట్టడాలు,  సైబర్ స్వప్నాలు, ఫైబర్ వ్యక్తిత్వాలు- హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా  మార్చివేశాయి. &lt;br /&gt;&lt;br /&gt;ఈ ఏడాది ఎందుకో నగరానికి చలి జ్ఞాపకం వచ్చింది. ఇంతటి చలిసంక్రాంతి వచ్చి  చాలా ఏళ్లయింది. ఇంత దట్టమైన పొగమంచులో ఊరు బద్ధకంగా తెల్లవారడం కూడా ఈ  మధ్య ఎప్పుడూ లేదు. ఈ చలి రుతుసహజమైనది కాకపోవచ్చు, ఏ వైపరీత్యమో  ఆకసాన్నావరించిన ఏ అల్పపీడనమో కావచ్చు. కానీ, మళ్లీ ఒక పురాశీతలస్మృతి  నగరాన్నావహించింది. ధనుర్మాసపు చీకటి ఉదయాలూ హేమంతపు చలిమంటలూ అన్నీ క్షీ  ణించిపోతుండవచ్చును కానీ, నగరం కడుపులో దాగిన సవాలక్ష పల్లెలు ఇంకా  సంక్రాంతిని మననం చేసుకుంటూనే ఉన్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;ఇరుకిరుకు సందులలో, బండలు పరచిన గల్లీలలో, సిమెంటు, తారు రోడ్లపైనా  ముగ్గులు ఏ మాత్రం తగ్గలేదు. ఏ పల్లెటూరినుంచో ఒక గంగిరెద్దు, ఒక హరిదాసు  పలకరిస్తూనే ఉన్నారు. డాబాల మీద పిల్లలు పోటీలు పడి పతంగులు క్రీడిస్తూనే  ఉన్నారు. ఒక పర్వదినం తన పుట్టుకనాటి పవిత్రతనూ, సందర్భాన్నీ కోల్పోయినా,  వేడుక మాత్రం అవశేషంగా కొనసాగుతూనే ఉన్నది.  మహానగరానికి సంక్రాంతి ఒకానొక పండుగ కావచ్చును కానీ, పల్లెలకు మాత్రం  దానితో పేగుబంధం. అక్కడా సందర్భం అంతరిస్తూనే ఉన్నది. పంటలు ఇంటికి  వచ్చేవేళన పండగ ఏర్పడి ఉండవచ్చును కానీ, ఇప్పుడు కాలంతో పాటు పంటకాలాలూ  మారిపోయాయి. అప్పులతోనే పుట్టి, అప్పులతోనే ముగుస్తున్న సేద్యం ఇప్పుడు  ఫలసాయాన్ని బండ్లమీద ఇండ్లకు తరలించడం ఎక్కడ? ఆహారపంటలే కరువవుతున్న మెట్ట  ప్రాంతాల్లో ఇళ్లకు తరలేది ఏ ధాన్యం? గొబ్బిళ్లు పెట్టడానికి పేడ కూడా  కరువవుతున్న రోజులివి.  బండ్లు లేవు, బండ్లను లాగే ఎడ్లూ లేవు. గొడ్డుచాకిరీ చేసే దున్న పోతులూ  లేవు. పాలిచ్చే పాడిపశువులకు మాత్రం బతుకు మిగిలింది, కృత్రిమ  గర్భోత్పత్తీ, హార్మోన్ ఇంజెక్షన్లూ, రసాయన ఆహారమూ తిని ఆవులూ గేదెలూ ఇచ్చే  పాలు ఇప్పుడొక వాణిజ్య ఉత్పత్తి. గోవధ నిషేధించాలని ఆరాటపడే వాళ్లు,  సంకరమైపోతున్న భారతీయ గోసంతతి గురించి, అంతరించిపోతున్న దేశీయ పశుజాతుల  గురించి, రైతు ఇళ్ల నుంచి నిష్క్రమిస్తున్న గొడ్డూగోదా గురించీ ఎందుకు  పట్టించుకోరో అర్థం కాదు. &lt;br /&gt;&lt;br /&gt;సంక్రాంతి పండగ ప్రత్యేకమైనది. దసరాదీపావళి వంటి పండగలకు కూడా మతప్రమేయం  లేని సాంస్కృతిక మూలాలు కానీ, నైసర్గికమైన కారణాలు ఉండవచ్చును కానీ, మనం  చెప్పుకునేవి మాత్రం పురాణ సందర్భాలే. సంక్రాంతి పూర్తి లౌకిక పర్వదినం.  సూర్యుడు ధనుస్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రమణం.  సౌరమానంలో రాశుల సంక్రమణానికి పవిత్రత ఉంటుంది. మకరరాశిలోకి ప్రవేశించిన  సూర్యుడు ఇకపై తూర్పుదిశన ఉత్తరపు మూలగా పయనిస్తాడు. దాన్నే ఉత్తరాయణం  అంటారు. ఉత్తరాయణంలో కన్నుమూస్తే ఉత్తమగతులు దొరుకుతాయని నమ్మేవారు ప్రాణాలు  బిగపట్టుకుని సంక్రాంతిదాకా ఎదురుచూస్తారు. శీతాకాలపు నడిసమయంలో వచ్చే ఈ  పర్వదినం- పంటలు చేతికివచ్చి గ్రామీణులు వేడుక చేసుకునే రోజు. రేగిపళ్లు,  నువ్వులు, బియ్యంపిండితో చేసిన పిండివంటలు - ఈ పర్వదినానికి ప్రత్యేకం.  సంక్రాంతి వెళ్లిన మరునాడు మాంసాహారపు పండుగ. జనం ప్రకృతినీ తమ కష్టఫలాన్నీ  ఉత్సవీకరించుకునే సందర్భం సంక్రాంతి. &lt;br /&gt;&lt;br /&gt;ప్రపంచానికి ఇప్పుడు ప్రమాదం స్వార్థపరుడైన మనుషుల నుంచి, వారిచేతుల్లో  ప్రకృతికి జరుగుతున్న అపచారం నుంచి. మానవ ప్రస్థానంలో పాత ఆచారాలు,  పద్ధతులు మారడం సహజమే కావచ్చును కానీ, మార్పు మానవీయంగా జరగాలి. నేడు  వ్యవసాయంలో వస్తున్న మార్పులు, పర్యావరణానికి జరుగుతున్న అపకారాలు-  మనుషులకు మేలు చేసేవి కావు. ప్లాస్టిక్ గాలిపటాలతో, మట్టి గొబ్బెమ్మలతో,  గ్రాఫిక్స్ గంగిరెద్దులతో చేసే పర్వదినాలు అభివృద్ధికి కాక, పతనానికే  చిహ్నాలు. &lt;br /&gt;&lt;br /&gt;అక్కడెక్కడో వాయు ఆవరణం పొలిమేరల్లో ఓజోన్ పొర ఛిద్రమవుతున్నదంటే  కలవరపడుతున్నాం. కానీ, చూడగలిగితే మన కళ్లముందే అనేక అపశకునాలు! ఒకప్పుడు  పల్లెలను పట్నాలను చల్లగా చూసిన ప్రకృతి, ఇప్పుడు మన ఆకాశాల మీది  మంచుపొరలను తొలగిస్తున్నదంటే అంతకు మించిన ప్రమాదసూచిక ఏమి కావాలి? ఒక్క  పశువూ లేని పల్లెలు పెరుగుతున్నాయంటే అంతకు మించిన హెచ్చరిక ఏమి కావాలి?  సాయంత్రాలు తలెత్తిచూస్తే పలకరించే కొంగలబారులు పలచబారడం, ఊరపిచ్చుక  చచ్చిపోవడం మనకేమీ బోధించడం లేదా? &lt;br /&gt;&lt;br /&gt;తలచుకుంటే తిరిగి మళ్లీ మనం శీతాకాలాన్ని బతికించుకోగలం. మకరసంక్రాంతిని ప్రాకృతికమైన పండుగగా జరుపుకోగలం. &lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-8902270453072310790?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/8902270453072310790/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post_19.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/8902270453072310790'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/8902270453072310790'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post_19.html' title='మిన్ను విరిగి మీద పడుతున్నది, చూస్తున్నామా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4164320670693790735</id><published>2012-01-10T05:16:00.000-08:00</published><updated>2012-01-10T05:16:34.204-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 08 Jan 2012'/><title type='text'>సిద్ధాంతం లేకనే ఈ సంకటం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;    &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;  ప్రతి ఆశయానికీ దాని హేతుబద్ధతను వివరించే ఒక సిద్ధాంతముంటుంది. ఆశయసాధన  కోసం చేయవలసిన ప్రయాణం మీద ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం స్థూల  కార్యాచరణ ప్రణాళికను ఆశయసంస్థలు రూపొందించుకుంటాయి. దాన్ని వ్యూహమని  అనవచ్చు. ఆ ప్రణాళిక ప్రాతిపదికగా చేసుకుని, ఆయా సందర్భాలలో ఇవ్వవలసిన  స్పందనలను, తాత్కాలిక చర్యలను ఆ సంస్థలు రూపొందించుకుంటాయి.  వాటిని ఎత్తుగడలని అంటుంటారు. ఒక సిద్ధాంతమంటూ లేకుండా, ఎటువంటి భూమికాలేని  కార్యాచరణపద్ధతులను అనుసరిస్తూ, ఆశయాలపై వాటి సాధకులకు ఉన్న ఉద్వేగాలమీదనే  ఆధారపడుతూ నడిచే సంస్థలకు దీర్ఘకాలిక కార్యాచరణలో కానీ, నిర్దిష్ట  సందర్భాలలో కానీ అనేక సంకటాలు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. &lt;br /&gt;&lt;br /&gt;తెలుగుదేశం పార్టీ విషయంలో తెలంగాణ రాష్ట్రసమితి, అది భాగస్వామిగా ఉన్న  సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి)కి అటువంటి సంకటమే తరచు ఎదురవుతున్నది.  శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో చేసిన పర్యటన సందర్భంలో  అయితే, పరాజయమే సిద్ధించింది. తెలంగాణ ఆశయానికి అవలంబకులుగా ఉన్నవారందరికీ  శుక్రవారం నాటి సంఘటనలు మనోబలాన్ని దెబ్బతీశాయి, నిస్ప­ృహలోకి తోసేశాయి.  సకలజనుల సమ్మె ముగిసిన నాటి నుంచి గూడుకట్టి ఉన్న నిరాశ పలచబడకుండానే,  గోరుచుట్టుపై రోకటిపోట్ల వలె వరంగల్ పరిణామాలు జరిగాయి. &lt;br /&gt;&lt;br /&gt;తెలుగుదేశంపార్టీ విధానాలు, దాని నాయకత్వానికి ఉన్న ప్రాదేశిక, సామాజిక  స్వభావం- వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని, దాని మీద ఒక సైద్ధాంతిక  వైఖరిని తెలంగాణ రాష్ట్రసమితి రూపొందించుకోవలసి ఉండింది. తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రసాధనకు కానీ, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు గానీ తెలుగుదేశం పార్టీ  అవరోధం&lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; అని భావిస్తే, ఆ పార్టీని దూరంగా ఉంచాలన్న విధానాన్నీ  అనుసరించవచ్చు. కానీ, టిఆర్ఎస్ అటువంటి సైద్ధాంతిక వైఖరులకు వ్యతిరేకం. &lt;br /&gt;సిద్ధాంతాల గొడవ వద్దని, భౌగోళికమయిన తెలంగాణ ఒక్కటే ఆశయమని,  లాబీయింగ్‌ద్వారా, ఎన్నికల ద్వారా రాజకీయమైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక  రాష్ట్రాన్ని సాధించాలని టిఆర్ఎస్ నాయకత్వం నమ్ముతూ వచ్చింది. వాటిని కూడా  ఒక సిద్ధాంతంగా పరిగణించవచ్చునేమో తెలియదు కానీ, ఎన్నికల రాజకీయాలకు  అవసరమైన కుప్పిగంతులకు ఆస్కారం మిగుల్చుకోవడం మాత్రమే టిఆర్ఎస్ ఉద్దేశ్యం.  మహాకూటమి పేరుతో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న  తరువాత, ఆ పార్టీని వెలివేయాలన్న వైఖరికి నైతిక సమర్థన ఎట్లా  సాధ్యమవుతుంది? &lt;br /&gt;&lt;br /&gt;డిసెంబర్9 తరువాత చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చిందని, రెండుకళ్ల  సిద్ధాంతాన్ని స్వీకరించాడని అభ్యంతరం ఉంటే కనుక- ఆ వెంటనే ఏర్పడిన  జెఎసిల్లో కొంతకాలమైనా తెలంగాణ తెలుగుదేశం వారితో కలిసి ఎందుకు  పనిచేసినట్టు? సరే, తెలంగాణ టిడిపి వారిని చంద్రబాబే నియంత్రిస్తున్నాడని  అనుకుని, వారిపై రాజకీయ నిషేధం విధించి ఉంటే కనుక, సకలజనుల సమ్మె తరువాత ఆ  నిషేధాన్ని ఎందుకు సడలించినట్టు? ఎనిమిదిజిల్లాల్లో అనుమతించిన పర్యటనను  వరంగల్ జిల్లాలో మాత్రం ఎందుకు ప్రతిఘటించినట్టు? సైద్ధాంతికంగా ఈ  కప్పదాట్లను సమర్థించుకోగలిగితే, ఆ విషయం తెలంగాణవాదులకు వివరించగలగాలి.  సమర్థించగలిగే సిద్ధాంతం ఏమీ లేదు కనుకనే, నిందలు దూషణలతోనే  జనాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం సాగింది. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ టిడిపిని కూడా సిద్ధాంతరాహిత్యమే నడిపిస్తున్నది. సకలజనుల సమ్మె  తరువాత తెలంగాణ ఉద్యమనాయకత్వం మీద ఏర్పడిన అసంతృప్తి వాతావరణాన్ని టిడిపి  ఎట్లా ఉపయోగించుకున్నది? నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే ఉద్దేశ్యమే  ఉంటే, పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకుని పోరాటం చేయవలసింది. &lt;br /&gt;తమతో పనిచేయడానికి అభ్యంతరంలేని శక్తులు తెలంగాణలో అనేకం ఉన్నాయి. వారితో  కలసి సరికొత్త కార్యాచరణను చేపట్టి ఉండవలసింది. అట్లా చేయకుండా, టిఆర్ఎస్,  జెఎసి బలహీనపడిన సందర్భాన్ని టిడిపి అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించడానికి  ఉపయోగించుకున్నది. తాము స్వయంగా ఉద్యమించాలన్నది మరచిపోయి, కెసిఆర్  అజ్ఞాతంలో ఉన్నాడనో, ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడనో నిందించడం మొదలుపెట్టింది.  కెసిఆర్ తాతముత్తాతల మూలాల్ని ముందుకు తెచ్చింది.  ఆత్మహత్యలన్నీ కెసిఆర్ చేసిన హత్యలనే అభియోగం మోపింది. రైతు సమస్యల మీద  ఉద్యమించే హక్కు తమ పార్టీకి ఉన్నదనే ప్రాతిపదికమీదనే నిలబడి ఉన్నా, దానికి  తగిన ఆమోదం లభించి ఉండేది. తాము తెలంగాణలో సంచరిస్తున్నాము కాబట్టి,  టిఆర్ఎస్ బలహీనపడిందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టింది. రానున్న ఉప  ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో, తెలంగాణలో అవరోధాలు ఎదుర్కొంటున్న పార్టీకి  కొత్త జీవం కల్పించడానికో ఇదంతా చేసి ఉండవచ్చు. అనువుగా దొరికిన  వాతావరణంలో అత్యుత్సాహం ప్రద ర్శించిందా, రేప్పొద్దున టీడీపీకి నిజంగానే  అనుకూల ఫలితాలు వస్తాయా- అన్నవి చర్చనీయాంశాలు. &lt;br /&gt;&lt;br /&gt;ఒకటో రెండో స్థానాల్లో బలం ఉన్న జగన్‌పార్టీయే తెలంగాణలో ఉనికి కోసం  ప్రయత్నిస్తుంటే, తెలుగుదేశం పార్టీ చూస్తూ చూస్తూ తెలంగాణలో పునాదిని  వదులుకోదు. రాష్ట్రం ఒకటిగా ఉన్నా, విభజన చెందినా తెలుగుదేశం పార్టీకి  తెలంగాణ కీలకమయిన రాజకీయ క్షేత్రం. బలమైన ప్రజాపునాది, కష్టపడగలిగిన  కార్యకర్తల బలం, పద్ధతి ప్రకారం పనిచేసే యంత్రాంగం ఉన్న పార్టీ తెలుగుదేశం.  తెలంగాణలో తమ పార్టీకి చికిత్స అవసరమనే వారి అవగాహనలో తప్పుపట్టవలసింది  ఏమీ లేదు.  కానీ, తెలంగాణ రాష్ట్రసమితికి గురిపెట్టడం ద్వారా వారి బలం పెరుగుతుందా  అన్నది ప్రశ్న. టిఆర్ఎస్‌నాయకత్వం మీద, ముఖ్యంగా కెసిఆర్ మీద ఎన్ని  విమర్శలైనా చేయవచ్చు, చాలా విమర్శలకు ఆయన అర్హుడు కూడా కావచ్చు. కానీ,  తెలంగాణ ఉద్యమానికి ఆయన ప్రస్తుతమైతే తిరుగులేనినాయకుడని అంగీకరించక  తప్పదు. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి ఏకైక ప్రాంతీయ నాయకుడిగా ఆయనకే  గుర్తింపు ఉన్నదనీ ఒప్పుకోవాలి. పదే పదే నిందించినప్పుడు, నిజాంనే  సమర్థించే ధోరణి తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమయింది.  అస్తిత్వ ఉద్యమాల స్వభావం అది. అటువంటప్పుడు, కెసిఆర్‌ను ఒక హద్దు దాటి  విమర్శిస్తే, అది తెలంగాణ పైనే విమర్శగా, తెలంగాణకు నాయకత్వం లేకుండా  చేయాలనే ప్రయత్నంగా కనిపించకుండా ఉంటుందా? తెలంగాణలో ఉద్యమశ్రేణుల్లో  అత్యధికులకు కెసిఆర్ మీద ఏవో ఫిర్యాదులున్నాయి. కానీ, ఆ ఫిర్యాదుల ఉద్దేశం,  లోపాలను సవరించుకుని కెసిఆర్ వ్యవహరించాలనే తప్ప, అతన్ని తప్పించి  ఉద్యమాన్ని నాయకత్వరహితం చేయాలని కాదు. కెసిఆర్ తప్ప మరెవరూ  ఉద్యమనాయకత్వానికి యోగ్యులు లేరని కాదు. కానీ, యోగ్యత వేరు, జనామోదాన్ని  పొందే నాయకత్వ లక్షణాలు వేరు. ఆ విషయం అనేక సందర్భాల్లో రుజువయింది. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడానా, వ్యవహరించానా అని బహిరంగసభలో  చంద్రబాబు ప్రశ్నించారు. దానికి తెలంగాణవాదుల సమాధానాలు వేరే ఉంటాయి కానీ,  వరంగల్లు జిల్లాలో పోరాటాలకు పేరుగన్న పాలకుర్తి ప్రాంతంలోకి  వెడుతున్నప్పుడు, ఆయన తన వెంట కోడెల శివప్రసాదరావు, కరణం బలరామమూర్తి వంటి  సమైక్యవాదులను ఎందుకు తీసుకువెళ్లినట్టు? పాలకుర్తిసభలో పసుపు జెండాలు  పట్టుకున్నవారిని మాత్రం ఆ చర్య ఆనందపరుస్తుందా? ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటును వ్యతిరేకించి, సీమాంధ్రప్రాంతంలో ఉద్యమాలు నడిపినవారు కూడా  తెలంగాణలో నిరసనలకు అతీతంగా సంచరించగలగడం- తెలంగాణ టీడీపీకి మాత్రం ఏమి  గౌరవం? శుక్రవారం నాడు జరిగిన లాఠీచార్జిలు కానీ, పోలీసుబలగాల ప్రదర్శన  కానీ, తెలంగాణ టీడీపీ నాయకులకు ఇబ్బందికలిగించే సన్నివేశాలే కదా? &lt;br /&gt;&lt;br /&gt;టిఆర్ఎస్‌కు అయినా, టీడీపీకి అయినా ఎన్నికల వ్యూహాలే తప్ప, ఉద్యమవ్యూహాలు  ఏమీ లేవు. ఎన్ని సార్లు ఎన్నికలు వస్తే, టీఆర్ఎస్‌కు అంత సంతోషం. ఎన్నికల  ద్వారా అందలాలు ఎక్కాలని వామపక్షాలు ప్రయత్నించి, తిరిగి తిరిగి మొదటి  గడికే చేరుకోవడం తెలియనిదేముంది? వామపక్షాలు సంకోచించే అవకాశవాద స్నేహాలకు  కూడా కెసిఆర్ సాహసించగలరు కాబట్టి, అప్పుడప్పుడు కొన్ని విజయాలు సాధ్యం  కావచ్చును కానీ, అది అంతిమ ఫలితాన్ని మాత్రం ఇవ్వదు.  ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లలో కూర్చుని కోరినప్పుడు వీధుల్లోకి వచ్చే  తంతును ప్రజలు మాత్రం ఎంతకాలం సాగిస్తారు? జనంలో ఒకసారి నిర్లిప్తత  ఆవరిస్తే, వరంగల్‌లో జరిగిందే తెలంగాణ అంతటా జరుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే,  తెలంగాణ ఉద్యమనాయకత్వాన్ని విమర్శించేవారిలో తెలుగుదేశమే కాక తక్కిన  పక్షాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. కెసిఆర్ విశ్రమిస్తే, వారేమి  చేస్తున్నట్టు? కెసిఆర్ తప్ప తెలంగాణ ఉద్యమంలో సమర్థత ఉన్న మరో నేత లేడని  వారే అంగీకరిస్తున్నారా? ఆ ఎరుకే కలిగితే, ఎందుకు ఈ తీవ్రవిమర్శలు?నేను  రంగంలో లేకపోతే ఏమి జరుగుతుందో చూడండి అని కెసిఆరే ప్రస్తుత పరిస్థితిని  అనుమతించారా? కావచ్చునుకూడా. &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4164320670693790735?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4164320670693790735/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post_10.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4164320670693790735'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4164320670693790735'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post_10.html' title='సిద్ధాంతం లేకనే ఈ సంకటం'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-7604623609155088754</id><published>2012-01-05T07:31:00.000-08:00</published><updated>2012-01-05T07:31:53.256-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 01 Jan 2012'/><title type='text'>కొంచెం తగ్గించుకుందామా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;&lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; 'ప్రపంచమంతటినుంచీ బంగారపు నదులు అక్కడికే ప్రవహిస్తాయి. వాటితో పాటు చావు  కూడా. ఆత్మలేని అటువంటి చోటును మనమెక్కడా చూడం. మూడు దాటి అంకెలు  లెక్కపెట్టలేనివారు, ఆరుగురికి మించి గుమిగూడలేని గుంపులు అక్కడ నిలబడి  సైన్స్ గురించి, ప్రస్తుత కాలం గురించి నిందాపూర్వకంగా  ఉపన్యాసాలిస్తుంటారు.  ఈ వాల్‌స్ట్రీట్ మూకలన్నీ ప్రపంచమంతా ఇట్లాగే ఎప్పటికీ ఉండిపోతుందని  నమ్ముతుంటారు, ఈ మహాయంత్రం శాశ్వతంగా నడిచేట్లు చేయడం తమ బాధ్యత  అనుకుంటుంటారు' ఈ మాటలన్నది స్పానిష్ కవి, రచయిత లోర్కా. అతన్ని 1934లోనే  స్పానిష్ మృత్యుదళాలు చంపేశాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల కిందనే లోర్కా  వాల్‌స్ట్రీట్ గుట్టును విప్పిచెప్పాడు. అప్పటికి ప్రచ్ఛన్నయుద్ధం కాదు  కదా, రెండో ప్రపంచయుద్ధం కూడా మొదలుకానేలేదు. ప్రపంచీకరణ పేరుతో లోకం  ఒంటిధ్రువంమీద నిలబడి గిరగిరా పశ్చిమాభిముఖంగా పరిభ్రమించడానికి ఇంకా  ఆరుదశాబ్దాలు గడవాల్సి ఉంది. &lt;br /&gt;&lt;br /&gt;వాల్‌స్ట్రీట్ ఒక ప్రతీక. పర్యాయపదం. ధనస్వామ్య కేంద్రాలన్నీ  వాల్‌స్ట్రీట్‌లే. ఆత్మలేని నిర్జీవస్థలాలే. వీటికి దయాదాక్షిణ్యం  కరుణాప్రేమా వంటి సాత్విక ఉద్వేగాలేమీ ఉండవు కానీ, నరకలోకపు ద్వారాలని  గీతాకారుడు చెప్పిన కామక్రోధలోభాలు పుష్కలంగా ఉంటాయి. మనిషి అంతిమంగా  ఎదుర్కొనవలసిన శత్రువు మానవప్రలోభమేనని యుగయుగాలుగా ప్రవక్తలు, దైవదూతలు,  సంస్కర్తలు చెబుతూనే ఉన్నారు. మనుగడ అవసరాలకు మించి కూడగట్టుకోవద్దని,  జీవితంతో ప్రలోభం లేని అనుబంధం సాధించమని గౌతమ బుద్ధుడు చెప్పాడు.  ధనకాంక్షే అన్ని అనర్థాలకు మూలమని జీసస్ భావించాడు. సంపాదనని  పెంచుకున్నవాడి కంటె పంచుకున్నవాడే &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ఉత్తముడని మహ్మద్ ప్రవక్త ప్రకటించాడు.  మనిషి అవసరాలకు తగ్గంత మాత్రమే ప్రకృతి ఇవ్వగలదు తప్ప, మనిషి దురాశకు  తగ్గంత కాదని మహాత్ముడు చెప్పాడు. 'అతి సంచయేచ్ఛ తగదు' అని వేల యేండ్లనాడే  పంచతంత్రకారుడు హెచ్చరించాడు. కానీ, ఆధునిక ధనస్వామ్య ప్రవక్తలు మాత్రం  ప్రలోభమే, స్వార్థమే, అత్యాశే అభివృద్ధి నడిపించే చోదకవిలువలని,  స్టాక్‌మార్కెట్‌ను మించిన దేవాలయం లేదని ప్రవచిస్తుంటారు. &lt;br /&gt;&lt;br /&gt;నూతన ఆర్థిక విధానాలు ప్రపంచాన్ని కమ్ముకుంటున్న రోజుల్లోనే, రానున్న రోజుల  వైభవాన్ని గురించి మధ్యతరగతి జీవులు కలలు కంటున్న కాలంలోనే, సమాజంలో  అంతరాలు, అంతస్థుల అగాధాలు పెరిగిపోతాయని హెచ్చరికలు రాకపోలేదు. పునాదులు  గట్టిగా లేకుండానే కట్టే భవనాలు కుంగిపోక తప్పదని, స్టెరాయిడ్స్‌దట్టించిన  స్టాక్‌సూచికలు ఎప్పుడో పుట్టిముంచుతాయని హితోక్తులు వినపడకపోలేదు. &lt;br /&gt;&lt;br /&gt;స్వేచ్ఛావాణిజ్యం సంరంభంలో ఉవ్వెత్తున ఎగిసి వెలిగే నవసంపన్నతలను,  ఆవురావురుమంటూ ఆదిమమైన ఆకలితో ఎగబడుతున్న ఔత్సాహిక పారిశ్రామికతను చూసి  వైభవోజ్జ్వల మహాయుగం వచ్చేసిందన్న భ్రమలో పడి భవిష్యత్ చిత్రపటానికి  కళ్లుమూసుకున్నాము. వల్లకాటి అధ్వాన్నయుగం సమీపించినప్పుడు కానీ, వాస్తవం  ఏమిటో అవగతం కాలేదు. పట్టిందల్లా బంగారం అవుతుందని అనుకున్నామే కానీ, అన్నం  కూడా స్వర్ణమై పోయి గ్రీక్ చక్రవర్తి మిడాస్ వలె ఆకలితో అలమటిస్తామని  గుర్తించలేదు.  2011 సంవత్సరానికి ఏ విశేషం ఉండినా లేకున్నా, ఒక విషయంలో మాత్రం విశిష్టత  సంపాదించుకుంది. ఆబగా, ఆత్రంగా, నిర్విచక్షణగా, అవినీతిగా సమకూర్చుకునే  లోభమే ఈ నాటి అసలు విలన్ అని ప్రపంచం స్పష్టంగా గుర్తించిన సంవత్సరం 2011.  మల్లెల విప్లవాలు, ఫేస్‌బుక్ రివల్యూషన్స్, చివరగా ఆక్యుపై వాల్‌స్ట్రీట్  ఉద్యమం కార్పొరేట్ స్వార్థానికి, లోభానికి గురిపెట్టిన ఉద్యమాలు.  అవినీతితో బలిసిన పాలకులను దించేదాకా నడిరోడ్డుమీద బైఠాయించిన  ఈజిప్షియన్లు ప్రపంచానికి కొత్త కార్చిచ్చును బహూకరించారు. 'మేమే ఉన్నాం 99  శాతం' 'ఈ వీధులు మావి, మేం ఆక్రమిస్తాం', 'ప్రజలంటే కార్పొరేట్లు కాదు',  'మా ఉనికిని గుర్తించండి లేదా మా ప్రతిఘటనను రుచిచూడండి'- నినాదాలు  ధనస్వామ్య కుంభస్థలాలపై పతాకాలుగా రెపరెపలాడాయి. &lt;br /&gt;&lt;br /&gt;అయితే, ఉద్యమాలందున ప్రజా ఉద్యమాలు వేరయా అని గుర్తించాలి. ఈజిప్ట్ ఎమెన్  లాంటి దేశాల్లో వ్యక్తమైన ప్రజాగ్రహం న్యాయమైనది, సహజమైనది. లిబియా,  సిరియా వంటి చోట్ల జరిగిన, జరుగుతున్న ఉద్యమాలకు ప్రాతిపదిక అసలే లేదనలేము  కానీ, అక్కడ ఎగదోసిందీ, ఎగదోస్తున్నదీ ప్రపంచ ప్రభువులు. అక్కడి  జనాగ్రహానికి ఆజ్యం పోసింది సంపన్నదేశాల చమురు దాహం.  సైన్యాన్ని పంపకుండానే ప్రజల సాయంతో అనుకూల ప్రభుత్వాలను స్థాపించవచ్చునని  ప్రాయోజిత ఉద్యమాలు నిరూపించాయి. ఆర్థికదాహం సరిహద్దులను దాటి సైనికభాషలో  మాట్లాడినప్పుడు అవి యుద్ధంగా పరిణమిస్తాయి. అయితే, ఎంతగా  బాహ్యప్రేరణలున్నప్పటికీ, జనం పెద్దసంఖ్యలో పాల్గొన్న పోరాటాలలో ఏదో ఒక  సానుకూల అంశ ఉండితీరుతుంది. ఆప్ఘనిస్థాన్‌లో అది అమెరికాకు ఇప్పుడు అనుభవం  అవుతూనే ఉన్నది. రేపు ఇరాక్‌లో, లిబియాలో కూడా అనుభవానికి వస్తుంది. &lt;br /&gt;&lt;br /&gt;భారతదేశంలో కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా కటకటాల పాలు కావడం  దేశరాజకీయాలను వచ్చేఎన్నికల దాకా ఏ అంశం ప్రధానంగా ప్రభావితం చేయనున్నదో  సూచించింది. అదే అవినీతి. అవినీతి అనగానే అదేదో నైతిక ప్రవర్తనకు  సంబంధించిన అంశంగా ధ్వనిస్తుంది కానీ, అందులో ప్రజాధనం, ప్రజల సమష్టి  ప్రయోజనాలు, వ్యవస్థ విశ్వసనీయత ముడిపడి ఉన్నాయి.  సామూహికమైన వనరులను ప్రైవేటు కార్పొరేట్లకు అతి చవకగా కట్టబెట్టి, అందుకు  ప్రతిఫలంగా ధనరూపంలోనో, మరే ఇతర మార్గంలోనో ప్రయోజనం పొందడం నూతన ఆర్థిక  వ్యవస్థలన్నిటిలో పెద్ద జాడ్యంగా తయారయింది. పాత సోషలిస్టు దేశాల నుంచి 'నవ  ప్రజాస్వామిక దేశాలు'గా పరివర్తన చెందుతున్న సమాజాల్లో, ప్రైవేటీకరణ బాటలో  వేగంగా పరుగులు తీస్తున్న చైనా వంటి దేశాల్లో కూడా ఇదే వ్యాధి  ప్రబలిపోయింది. ప్రజల కనీసావసరాలకు, పాలకుల పారిశ్రామికుల ప్రలోభావసరాలకు  మధ్య జరుగుతున్న పోరాటాలే నేడు ప్రపంచమంతా. &lt;br /&gt;&lt;br /&gt;ఇక, నైతికతకు, ప్రజాప్రయోజనాలకు పెద్ద విలువ ఇవ్వని భారత రాజకీయనాయకులకు  అయితే, సంస్కరణలు సొంత లాభం చూసుకోవడానికి వనరులుగా మారిపోయాయి. పరిశ్రమలకు  ప్రోత్సాహం పేరిట, అభివృద్ధి కార్యక్రమాల పేరిట- వనరుల పందేరానికి  ప్రభుత్వనేతలకు ఉండే అధికారాలు - ఎంతటి అవినీతి సామ్రాజ్యాన్ని  సృష్టిస్తుందో, అది పాలకపార్టీలకే ఎంతటి తలనెప్పిగా మారుతుందో  ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవహారాలు నిరూపిస్తున్నాయి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి  హయాంలో జరిగిన అవినీతి పైనే గత ఏడాదిగా రాష్ట్రంలో రాజకీయచర్చలు, ప్రభుత్వ  చర్యలు కేంద్రీకృతమై ఉన్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;2011 సంవత్సరమంతా జన లోక్‌పాల్ ఉద్యమం ప్రాధాన్యం పొందడానికి 2జి స్కామ్  ఒక్కటే కాక, మొత్తంగా దేశమంతటా అవినీతి అన్నదే ప్రధాన సమస్యగా సంఘటిత  అభిప్రాయ వర్గాల్లో స్థిరపడిపోవడం కూడా కారణం. సరే, అన్నా హజారే ఆ  ఉద్యమాన్ని నిర్వహించిన తీరు, అతని వ్యవహారసరళిలోని అవాస్తవిక ధోరణులు  పక్కన బెడితే, రాజకీయపక్షాలు ప్రదర్శించిన అవకాశవాదం, ప్రభుత్వం నుంచి  కనిపించిన దాటవేత వైఖరి- అవినీతి నుంచి వైదొలగడానికి వ్యవస్థలో  వ్యక్తమవుతున్న అనాసక్తిని సూచిస్తున్నాయి.  దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరుగుతున్నా, అదుపులేని ధరలు సామాన్యుల  జీవితాన్ని దుర్భరం చేస్తున్నా, మిరుమిట్లు గొలిపే శీఘ్రఅభివృద్ధికి  వేదికలుగా ఉన్న కొన్ని ప్రత్యేక రంగాల్లో మాంద్యం తిష్ఠవేసి కూర్చున్నా-  ఆర్థికవేత్తే నేతగా ఉన్న ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోవడానికి కారణం-  ఇంకా దోచుకోవలసినది మిగిలిఉన్నందున మార్పునకు సిద్ధపడని ప్రాబల్య ఆర్థిక,  రాజకీయ వర్గాలే. &lt;br /&gt;&lt;br /&gt;2012లో మార్పు వస్తుందా? అంగుళం మేర అయినా వస్తుందనడానికి ఆస్కారమూ లేదు,  ఆశా లేదు. కానీ, జనంలో అయినా మార్పు వస్తుందా? పరుగు ఆపాలని, నడక  మొదలుపెట్టాలని అర్థమవుతుందా? జూదాన్ని పక్కన బెట్టి, వ్యాపారం చేయాలని,  బంగారు బాతును చంపుకుని ఈ రోజే తినకూడదని తెలిసివస్తుందా? మదుపు ఒక్కటే  కాదు, పొదుపు కూడా అవసరమని, అవసరాలకు మించి కొంటూ ఉంటే మనల్ని మనం  అమ్ముకోవలసివస్తుందని ఎరుక కలుగుతుందా? నేతలను, దేశాధినేతలను, ప్రపంచ  ప్రభువులను వాళ్ల ఖర్మానికి వదిలేద్దాం. &lt;br /&gt;&lt;br /&gt;మనం కొంచెం కోర్కెలకు కత్తెర వేద్దామా? కడుపు నిండాక కూడా తింటూ ఉండడం  మానేద్దామా, ఫోన్లు స్విచాఫ్ చేసి మనుషులతో మాట్లాడదామా, ఔటర్ రింగ్‌రోడ్డు  మీద స్పీడ్ లిమిట్ పాటిద్దామా? యావ తగ్గించుకుని, దురాశను కట్టిపెట్టి,  కేలరీలు కరిగించి, షాపింగులను విరమించి- ఈ ఏడు కాస్త మితంగా, సంతోషంగా,  తృప్తిగా ఉందామా? &lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-7604623609155088754?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/7604623609155088754/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/7604623609155088754'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/7604623609155088754'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2012/01/blog-post.html' title='కొంచెం తగ్గించుకుందామా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4498760432013228041</id><published>2011-12-21T08:33:00.000-08:00</published><updated>2011-12-21T08:33:10.449-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 18 Dec 2011'/><title type='text'>వాణిజ్య తారలే భారతరత్నాలా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&amp;nbsp;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;జస్టిస్ మార్కండేయ కట్జు అంటే ముక్కుసూటితనానికి, కటువైన విమర్శలకు  మాత్రమే కాక, ఎన్నో ప్రగతిశీలమైన, సాహసోపేతమైన తీర్పులకు కూడా పేరుపొందిన  వారు. భారతీయ సమాజం పరివర్తనాదశ గురించి, అందులోని సమస్యల గురించి  ఆయనకున్న అవగాహన విశేషమైనది. ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్‌గా ఆయన మీడియా  లోపాల గురించి, స్వయంనియంత్రణ ఆవశ్యకత గురించి మాట్లాడినప్పుడు, ఆ మాటలతో  విభేదించేవారు సైతం ఆ అభిప్రాయాలను గౌరవిస్తూ మాట్లాడారు.  మీడియా ప్రాధాన్యాల గురించి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం జరగవలసినంత  చర్చ జరగలేదు. సీనియర్ సినీనటుడు దేవానంద్ మరణవార్తకు జాతీయ పత్రికలు  అవసరానికి మించి ప్రాధాన్యం ఇచ్చాయని, దేశంలో రైతుల ఆత్మహత్యలు పెద్ద  ఎత్తున జరుగుతుంటే, ప్రజాప్రాధాన్యం ఉన్న అనేక సమస్యలు ఉంటే వాటిని  పట్టించుకోకుండా, సెలబ్రిటీలవార్తల వైపు మొగ్గు చూపుతున్నాయని కట్జు  వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరీ కొత్తవి కాకపోవడం కూడా చర్చ  జరగకపోవడానికి కారణం కావచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ స్వయంగా అట్లా మాట్లాడడం మాత్రం కొత్త విషయమే.  అభివృద్ధి, గ్రామీణ వ్యవహారాల పాత్రికేయులు పి.సాయినాథ్ కూడా అటువంటి  అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశరాజధానిలో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్‌కు  హాజరైన పాత్రికేయుల సంఖ్యను, ఒరిస్సాలోని కలహండి దుర్భిక్షప్రాంత స్థితిని  రిపోర్టు చేయడానికి వెళ్లిన పాత్రికేయుల సంఖ్యను ఆయన పోల్చి మీడియా  ప్రాధాన్యాల గురించి నిశితమైన విమర్శ చేశారు.  మీడియా ఫలానా అంశం మీద తీసుకునే వైఖరి, ఫలానా రాజకీయపక్షం విషయంలో  అనుసరించే విధానం వివాదాస్పదం కావడం ఇటీవలి కాలంలో పెరిగింది. కానీ,  మొత్తంగా మీడియా సంఘటనలను, పరిణామాలను&lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; ప్రాధాన్యీకరించే ధోరణి గురించిన  విమర్శకు ఇప్పటికీ పెద్ద చెల్లుబాటు లేదు. కట్జు అటువంటి వ్యవస్థాగత వివక్ష  గురించి మాట్లాడారు. &lt;br /&gt;&lt;br /&gt;ఏవి ప్రధానమైన వార్తలో ఏవి కావో మీడియా స్వతంత్రంగా నిర్ణయించుకుంటుందని,  దాని ప్రాధాన్యాలు దానివి మాత్రమేనని అనుకోవడం పొరపాటు. ప్రజలలో  అభిప్రాయాలను కల్పించడంలో, స్థూలంగా ప్రధాన స్రవంతి అవగాహనలను కల్పించి,  స్థిరం చేసి, పునరుత్పత్తి చేయడంలో మీడియా పాత్ర ప్రధానమైనదనడంలో సందేహం  లేదు. కానీ, మీడియా విస్తరించిన తరువాత, తన పాఠకుల, ప్రేక్షకుల  సామాజికార్థిక తరగతులను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యాలను  నిర్వచించుకోవడం, సమాచారాన్ని మాత్రమే కాక తాను అనుకున్న పద్ధతిలో  వినోదాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. పత్రికలలో అయితే, పరిణామాలను అర్థం చేసుకోవడానికి వీలైన విశ్లేషణలకు కొంత  స్థలాన్ని కేటాయిస్తాయి, దృశ్యమాధ్యమాల్లో దానికి కూడా అవకాశాలు తక్కువ.  సామాజికమైన మార్పుల్లో తాను క్రియాశీలమైన పాత్రధారినని మీడియా ఇప్పుడు  అంతరాంతరాల్లో విశ్వసిస్తున్నదని నమ్మలేము. మీడియాసంస్థల వ్యాపార  ప్రయోజనాలు, స్పర్థలు, వాటి వాటి రాజకీయ ప్రాధాన్యాలు వాటి విధానాలపై  ప్రభావం చూపిస్తాయి. &lt;br /&gt;&lt;br /&gt;మొత్తంగా మీడియాకు శాస్త్రీయ దృష్టి ఉండదు కాబట్టి, సంఘటనలను వాటి క్రమంలో  కాక విడివిడిగా రిపోర్టు చేస్తాయి. వర్తమాన చరిత్రలో ప్రాధాన్యమున్న  పరిణామాలను సామాజిక పరిణామాలుగా కాక, వ్యక్తులు కేంద్రంగా జరిగే ఘటనలుగా  భావిస్తాయి. అందుకని, మీడియాకు వ్యక్తులు కావాలి, వార్తలలోని వ్యక్తులు,  పాఠకులకు, ప్రేక్షకులకు సుపరిచితులైన వ్యక్తులు, పాఠకుల, ప్రేక్షకుల  సాధారణస్థాయి అభిరుచులకు లక్ష్యంగా ఉండగలిగే వ్యక్తులు కావాలి. ఈ వ్యక్తులను మీడియా మాత్రమే సృష్టించదు. సమాజంలోని వాణిజ్య, వ్యాపార  వర్గాలకు, అధికాదాయ శిష్ట శ్రేణులకు ఈ వ్యక్తులు అవసరం. వారినే  సెలబ్రిటీలు, పేజ్ త్రీ మనుషులనీ అంటున్నాము. వీరు ప్రజల్లోని సగటు  సాంస్కృతిక అభిరుచులకు ఆలవాలంగా ఉంటారు. వీరు సినీహీరోలుగా, వ్యాపార  ప్రకటనల్లో మోడల్స్‌గా, విజయానికి మారుపేరైన క్రీడాకారులుగా,  సినీదర్శకులుగా, సంగీతకారులుగా, గాయనీగాయకులుగా సుప్రసిద్ధులైనవారు  ఎవరైనా కావచ్చు. వీరు వారి వారి వృత్తిజీవితాలలో ప్రతిభావంతులు అయి  ఉండవచ్చును. కానీ, వారి సామాజిక వ్యక్తిత్వాలు ప్రజలకు ఆసక్తిదాయకంగా  ఉంటాయి.  వారి వ్యక్తిగత జీవితం కూడా పెద్ద సమాచార వనరు అవుతుంది. రాజకీయనాయకులు,  ఉద్యమనేతలు, సామాజిక సేవకులు- ఆకర్షించలేని వర్గాలకు ఈ సెలబ్రిటీలు  మాట్లాడుకునే, కలగనే, అభిమానించే తారలు. దేవానంద్ కూడా అటువంటి ఒక తార.  కాకపోతే, వ్యాపారసంస్కృతి ప్రస్తుత స్థాయికి ఇంకా చేరని బ్లాక్ అండ్ వైట్  కాలపు తార. అతను ప్రాతినిధ్యం వహించిన సినీసంస్కృతితో ఏదో ఒక రూపంలో  అభిరుచిని పంచుకోవడం సగటుకు మిం చిన సంస్కారమున్న ప్రేక్షకులకు కూడా  సాధ్యం. దాదాపు తొంభై ఏళ్ల వయస్సు చేరినా, ఇంకా ఉత్సాహంతో కళారంగంలో  ఉన్నందుకు అతను వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. కట్జు చేసిన విమర్శకు  దేవానంద్ పూర్తిగా సరిఅయిన దృష్టాంతమని అనుకోలేము. &lt;br /&gt;&lt;br /&gt;ఒక తారకు ప్రాధాన్యమివ్వడం మీడియా తప్పైతే, ప్రభుత్వంతో సహా వ్యవస్థలన్నీ  కలిసి ఒక తారను సృష్టించినప్పుడు ఏమి చేయాలి? నెహ్రూ, అంబేద్కర్,  చక్రవర్తుల రాజగోపాలాచారి, సివిరామన్, ఇందిరాగాంధీ వంటి మహామహులు  స్వీకరించిన భారతరత్న గౌరవాన్ని క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇవ్వాలని  ప్రభుత్వమే నిబంధనలను సవరిస్తే, దాన్నెట్లా అర్థం చేసుకోవాలి? విశేష  గౌరవానికి, గుర్తింపునకు సచిన్ తప్పనిసరిగా అర్హుడే. కానీ, అతను భారతరత్నం  కాగలడా? &lt;br /&gt;&lt;br /&gt;ఒకనాడు జాతికి సేవ చేసిన వారికే భారతరత్న గుర్తింపు ఇవ్వాలన్న నిబంధన  ఉండగా, ఇప్పుడు దాన్ని ఏరంగంలో అయినా విశేష ప్రతిభ కనబరచినవారికి కూడా  ఇవ్వవచ్చునని సవరిస్తే జాతిరత్నాల స్థాయిని మనం పెంచుతున్నట్టా,  తగ్గిస్తున్నట్టా? సచిన్ క్రికెట్ క్రీడకు చెందినవాడు. అతనికి ఆ ఆటలో  అపారమైన ప్రతిభాపాటవాలున్నాయి, దేశం గర్వించదగ్గ క్రికెటర్ అతను, సందేహం  లేదు. కానీ, క్రికెట్ ఒక వ్యాపారక్రీడ. అది దేశంలోని ఆటలన్నిటినీ అణగదొక్కి  కార్పొరేట్ క్రీడగా తిష్ఠవేసుకుని కూర్చుంది. అందులో ప్రతిభకు విపరీతమైన  ధనప్రతిఫలం లభిస్తుంది. జాతీయ జట్టులోని క్రికెటర్లు కోటీశ్వరులుగా  మారిపోతారు. ఇప్పుడు ఐపిఎల్ వచ్చిన తరువాత ఈ క్రీడాకారులు వేలంలో అమ్ముడుపోయే సరుకులు.  వీరు తమ రికార్డుల కోసం తప్ప దేశం కోసం ఆడినట్టు భావించగలమా? దేశంలో క్రీడల  అభివృద్ధికి క్రికెటర్లు చేసిన దోహదం ఏమైనా ఉన్నదా? సచిన్, ధోనీ,  సెహ్వాగ్ వంటి వారి విజయాలు ప్రేక్షకులను క్రీడాకారులుగా మారుస్తున్నాయా?  జాతి ఆరోగ్యానికి, దారుఢ్యానికి దోహదం చేయవలసిన క్రీడారంగం ఇప్పుడు ఎటువంటి  దుస్థితిలో ఉన్నది? ఈ ప్రశ్నలన్నీ వస్తాయనే కాబోలు, సచిన్‌తో పాటు హాకీ  క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పేరుకూడా ప్రచారంలో పెడుతున్నారు. సచిన్‌కు  ఇవ్వడానికి దారి సుగమం చేయడానికి మొదట ధ్యాన్‌చంద్‌కు ఇచ్చినా ఇవ్వవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;ధనార్జన పెద్దగా లేని రంగాలలో అభిరుచితో ఆసక్తితో కృషిచేసి దేశానికి పేరు  తెచ్చినవారిని భారతరత్నతో అయినా సత్కరించవచ్చును. చనిపోయినవారికి  ఇవ్వకూడదని మొదటపెట్టుకున్న నిబంధన ప్రకారం మహాత్మాగాంధీకే భారతరత్న  ఇవ్వలేకపోయాము. బ్రతికి ఉన్నారోలేదో తెలియని సందిగ్ధ స్థితి కారణంగా  సుభాష్‌బోస్‌కు ప్రకటించిన భారతరత్నను వెనక్కి తీసుకున్నాము. చనిపోయి  మూడున్నర దశాబ్దాలు గడిస్తే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను భారతరత్నతో  సత్కరించుకోలేకపోయాము. దేశానికే తలమానికంగా ఒక వ్యక్తిని గుర్తించడం అంటే,  సామాన్యమైన విషయం కాదు. అది మనదేశం పాటిస్తున్న విలువలకు అనుగుణ్యమైన  ఎంపిక అయి ఉండాలి.&lt;br /&gt;&lt;div class="RunningText"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="RunningText"&gt;&amp;nbsp;ఇప్పుడు సెలబ్రిటీలను నిర్మించే వ్యవస్థలలో ప్రభుత్వం కూడా  చేరుతున్నదన్న మాట. వ్యసనమో అభిరుచో తెలియని స్థాయిలో వ్యాపించిన ఒక  క్రీడాభిమానాన్ని, దాని చుట్టూ ఉన్న అపారమైన మార్కెట్‌ను గుర్తించి  ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తున్నదన్న మాట. అంతర్జాతీయంగా మనకు స్వర్ణాలు  తెచ్చిపెట్టిన హాకీ, విలువిద్య, పరుగుపందెం వంటి క్రీడలన్నిటినీ ఇది  అవమానించడం కాదా? &lt;br /&gt;&lt;br /&gt;ఒక సినీతార మరణాన్ని పతాకశీర్షికలో పెడితే మీడియా ప్రాధాన్యాలను  ప్రశ్నిస్తున్నాము. మరి ఈ భారతజాతి అత్యున్నత గౌరవాన్ని ఒక సెలబ్రిటీకి, తన  వృత్తిని తాను ప్రతిభావంతంగా చేసుకుపోతున్న ఒక సినీనటుడి వంటి  క్రీడాకారుడికి ఇవ్వబోతుంటే ఆ ప్రాధాన్యాన్ని ప్రశ్నించనక్కరలేదా? &lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4498760432013228041?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4498760432013228041/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/12/blog-post_21.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4498760432013228041'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4498760432013228041'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/12/blog-post_21.html' title='వాణిజ్య తారలే భారతరత్నాలా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-1486162379955408670</id><published>2011-12-14T09:27:00.000-08:00</published><updated>2011-12-14T09:27:42.250-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 11 Dec 2011'/><title type='text'>కీర్తి వారసత్వం: కిస్సా కుర్సీ కా</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;/div&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;   &lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;కడుపున పుడితేనే వారసులవుతారని మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పలేదు.  మానసపుత్రులూ దత్తపుత్రులూ అంటూ రకరకాల వారసులుంటారని అవి చెప్పాయి.  ఆస్తులూ భూములూ ఒక్కోసారి రాజ్యాలూ తండ్రులనుంచి కొడుకులకు, చాలా అరుదుగా  కూతుళ్లకు సంక్రమించడం ఆనవాయితీయే. పెద్దకొడుకు అంత ప్రయోజకుడు కాకపోతే,  వారసత్వం కోసం కొడుకుల మధ్య పోరాటం జరిగితే, అందులో సమర్థుడైనవాడినే  ప్రజలు సమర్థించడం అరుదేమీ కాదు. కానీ, ప్రజాస్వామ్యయుగంలో నేతల ప్రతిష్ఠ,  జనాకర్షణల వారసత్వం కోసం జరిగే పోరాటం అంత సూటిగా కత్తియుద్ధాలతో సాగదు.  పార్టీలు, సంస్థలు చీలిపోయినప్పుడు కూడా ఉమ్మడివారసత్వంలో ఎవరి వాటా ఎంత  అన్న వివాదంలో, ఆఫీసు భవనాల కోసం ఎన్నికల గుర్తుల కోసం జెండాల కోసం  కోర్టుల్లో వ్యాజ్యాలు నడిచినప్పటికీ, నిర్ధారణ మాత్రం ప్రజాక్షేత్రంలో  జరిగిపోతుంది. పెద్దల నీడలో పెరిగి, వారి మార్గాన్నే కొనసాగించేవారికి  వారసత్వంలో సమస్యలేమీ రాకపోవచ్చును కానీ, తిరుగుబాటు చేసి వారసత్వాన్ని  గ్రహించాలనుకునేవారు మాత్రం సమాజం ఆమోదం కోసం చాలా ప్రయాస పడవలసి వస్తుంది.  ఎన్ని యుద్ధాలు చేసి గద్దెనెక్కినవారు సైతం ఏదో ఒక పరంపరతో తమను తామే  అనుసంధానించుకోకుండా పరిపాలనాహక్కును పొందడం కష్టం. &lt;br /&gt;&lt;br /&gt;స్టాలిన్ అనంతరం సోషలిస్టు రష్యాలో అధికారాన్ని చేపట్టిన నికితా కృశ్చెవ్,  తనకు ప్రజామోదం కోసం తెలివైన మార్గం అనుసరించాడు. స్టాలిన్‌ను దోషిగా,  సొంత ప్రజల మీదనే అణచివేతను, నిర్బంధాన్ని సాగించిన నియంతగా  నిలబెట్టదలచుకున్న కృశ్చెవ్, లెనిన్‌ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు.  లెనిన్‌ను కీర్తించి,&lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;పార్టీ పరమాధికారాన్ని అంగీకరించి, కృశ్చెవ్ తనను  తాను నిలబెట్టుకున్నాడు. విప్లవమార్గాన్ని పరివర్తనామార్గంగా మార్చి కూడా  నిలబడగలిగాడు. అయితే, సోవియట్ సమాజం మితిమీరిన స్టాలిన్‌విమర్శను  సహించలేకపోయింది. కృశ్చెవ్ అనంతరం వచ్చిన వారసులు లెనిన్ భజనను కొనసాగిస్తూ, స్టాలిన్‌పై  మాత్రం మౌనాన్ని పాటించారు. చైనాలో పరిస్థితి వేరు. మావో మరణానంతరం  కొద్దిసంవత్సరాలకే అధికారంలోకి వచ్చిన డెంగ్ సియావో పెంగ్- మావోను  విమర్శించినప్పటికీ, పూర్తిగా ఆయనను విసర్జించగలిగే పరిస్థితి లేదు.  రష్యాకు లెనిన్ ఎంతో, చైనాకు మావో కూడా అంతే. కాకపోతే, కృశ్చెవ్‌కు  స్టాలిన్ విలన్ అయినట్టు, డెంగ్‌కు మావో అనుయాయులైన 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్'  విలన్లు. సమస్త అవాంఛనీయ సంఘటనలకూ ఆ నలుగురినీ పాపాల భైరవులను చేసి, మావో  వ్యక్తిపూజను మాత్రం కొనసాగించాడు. &lt;br /&gt;&lt;br /&gt;సాంస్కృతిక విప్లవ కాలంలో మావో వ్యక్తిపూజ విపరీత స్థాయిలో జరిగిందంటారు  కానీ, అందులో వ్యక్తి ఆరాధనతో పాటు, సిద్ధాంత జపం కూడా ఉండేది. మావో  సిద్ధాంతాలకూ, ఆయన వ్యక్తిత్వానికీ అభేదం పాటిస్తూ ఆకాశానికెత్తేవారు.  డెంగ్ మావో సిద్ధాంతాలను పక్కనబెట్టి, ఆయన విగ్రహాలకు మాత్రం పూజలు  కొనసాగించారు. నిజమైన అర్థంలో మావో వ్యక్తిపూజకు పాల్పడింది డెంగే. మావో  జీవితకాలంలో ఆయనతో పోరాడిన వ్యక్తే అయినప్పటికీ, డెంగ్‌కు ఆమోదం  లభించడానికి మావోను కీర్తిస్తూ ఉండడమే. డెంగ్ కంటె నాలుగాకులు ఎక్కువ  చదివిన ప్రస్తుత చైనా నాయకత్వం కూడా మావో గొడుగు కిందనే తమ ఉనికిని  నిలబెట్టుకుంటున్నది. &lt;br /&gt;&lt;br /&gt;రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత మన దేశంలో కూడా అటువంటిదే ఒక సందర్భం  వచ్చింది. సాధారణ ఎన్నికల రెండు దశల మధ్య రాజీవ్ హత్య జరిగింది. ఫలితంగా,  పూర్తిగా ఓడిపోవలసిన కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రధానపార్టీగా అవతరించింది.  సోనియాగాంధీ వారసత్వానికి వెంటనే ఆమోదం సిద్ధించే పరిస్థితి లేదు. ప్రధాన  పదవిని ఆశించగలిగిన పెద్దమనుషులు కాంగ్రెస్‌లో చాలా మందే ఉన్నారు. అందరి  పోటీ మధ్య తటస్థవ్యక్తిగా పి.వి.నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆయన మనసులో  ఏముందో కానీ, నెహ్రూకుటుంబ పాలనకు కళ్లెం వేద్దామనుకున్నారు.  ఇందిరను, రాజీవ్‌ను కీర్తిస్తూనే, సోనియాగాంధీని పక్కనబెట్టారు.  అవిశ్వాసాలనుంచి గట్టెక్కడానికి చిన్న పార్టీల నుంచి మద్దతు  కూడగట్టుకున్నారు. అడపాదడపా సోనియాను కలుస్తూనే, ప్రభుత్వ వ్యవహారాలనుంచి  ఆమెను ఎడంగా ఉంచారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ కసరత్తు కొనసాగించారు.  మైనారిటీ ప్రభుత్వం, రాజీఅభ్యర్థిగా ఎంపికైన ప్రధాని, ఆర్థికసంస్కరణల  ప్రారంభం- ఇవన్నీ కలసి- పీవీ ప్రభుత్వానికి నిజమైన ప్రజామోదం ఉన్నదా లేదా  అన్న సందేహానికి తావులేకుండా చేశాయి. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ నేత అయి  ఉండడం, రాజీవ్ హయాందాకా మంత్రివర్గంలో ఉండడం- ఆయనను ప్రధాని పీఠంపై  చూడడానికి అభ్యంతరం లేకుండా చేసి ఉండవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;1995లో ఎన్టీయార్‌ను దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు- మరో  రకమైన పరిస్థితి. పరిపాలనలో, పార్టీ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యం  రీత్యా పార్టీలో సొంత బలం కూడగట్టుకున్నప్పటికీ, తిరుగుబాటుకు అనుకూలమైన  భావ వాతావరణాన్ని కూడా సృష్టించుకున్నప్పటికీ, ఎన్టీయార్‌ను తప్పించి  అధికారంలోకి రావడం ఒకరకంగా సాహసమే. ఎన్టీయార్ మరణించిన తరువాత వారసత్వం  కోసం తగువులాడుకోవడం వంటిది కాదిది. ఆయనను పదవీభ్రష్ఠుడిని చేసి  గద్దెనెక్కడం. అప్పటివరకైతే, శాసనసభ్యుల బలంతో కొనసాగవచ్చు, కానీ, ప్రజల  ముందుకు వెళ్లినప్పుడు ఎన్టీయార్ జనాకర్షణను ఎదుర్కొనడం సాధ్యమా? - ఈ  ప్రశ్న 1995లో చంద్రబాబుకు వచ్చే ఉండాలి. &lt;br /&gt;&lt;br /&gt;1996 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్టీయార్ అస్తమించడంతో, ఆయన వారసురాలిగా  లక్ష్మీపార్వతిని ప్రజలు గుర్తిస్తారన్న భయం కూడా ఆయనకు కలిగే ఉండాలి.  అయితే, వారసత్వ స్థాయికి తగినదానినని నిరూపించుకోలేక లక్ష్మీపార్వతి ప్రజల  చేతిలో భంగపడడం చంద్రబాబు దారిని సుగమం చేసింది. అయినా, ఆయన తన అధికారానికి  మూలం ఎన్టీయార్ పరంపరలోనే ఉన్నదని చెప్పుకోక తప్పలేదు. చివరి  సంవత్సరాలలోని సంఘటనలను పక్కనబెట్టి, ఎన్టీయార్ ప్రతిష్ఠకు తానే వారసుడినని  స్థిరపరచుకోగలిగారు. అయితే, ఇప్పటికీ, 1995 నాటి సంఘటనలు చంద్రబాబును అప్పుడప్పుడు  చిరాకుపెడుతూనే ఉంటాయి. ఎన్టీయార్ మరణానంతరం ఆయనను విమర్శించడం కాంగ్రెస్  విరమించుకున్నది. ఎన్టీయార్ ప్రతిష్ఠకు రాజకీయ రంగంలో ఇంకా ఎంతో విలువ  మిగిలే ఉన్నది. ఎన్టీయార్ ఒక కుమార్తె కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రి కూడా  అయ్యారు, అల్లుడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎన్టీయార్ ఆశయాలకు  వారసుడు వైఎస్సార్ మాత్రమేనన్న వాదనలూ మొదలయ్యాయి. అవసరమైనప్పుడు  ఎన్టీయార్ కుమారుడినో, మనవడినో ప్రచారంలోకి దింపే పని తెలుగుదేశం చేస్తూనే  ఉన్నది. &lt;br /&gt;&lt;br /&gt;రాజశేఖరరెడ్డి విషయంలో కాంగ్రెస్ పడుతున్న అవస్థ వర్ణనాతీతం. రెండోసారి  కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయవంతంగా ప్రతిష్ఠించిన  రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన తరువాత, 'వారసత్వ  హక్కు' కోసం ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి ప్రయత్నించినప్పుడు- ఢిల్లీలోని  కాంగ్రెస్ పెద్దలకు సంకటం ఎదురయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాలకు కారణం  సోనియా ప్రతిష్ఠనా, వైఎస్సార్ జనాకర్షణా అన్న చర్చా జరిగింది. అధిష్ఠానం  ఇచ్చిన స్వేచ్ఛతో సొంత బలగాన్ని అసెంబ్లీలో, బయటా పెంచుకున్న రాజశేఖరరెడ్డి  మరణానంతరం కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా తయారయ్యారు. వైఎస్సార్ విధేయత జగన్ బలం రూపంలో పరివర్తన చెందుతున్నప్పుడు-  రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠను సొంతం చేసుకుంటూనే జగన్‌ను  అడ్డుతొలగించుకోవడమెట్లానో అధిష్ఠానం ఆలోచించడం మొదలుపెట్టింది. జగన్  అకృత్యాలు ఒకటొక్కటి బయటపడడం మొదలుపెట్టాక, వాటిలో వైఎస్సార్ ప్రమేయం  స్పష్టంగా కనిపించసాగాక- ఒకరిని కాదని మరొకరిని ఎట్లా సొంతం చేసుకోవాలో  తెలియలేదు. వైఎస్సార్‌ను కూడా నిరాకరించే ధైర్యం లేదు. 2009లో  రాజశేఖరరెడ్డి గెలిపించిన ప్రభుత్వమే ఇప్పుడూ అధికారంలో ఉన్నది. కోర్టు  ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో వైఎస్ పాత్ర కూడా  బయటపడితే, దాన్ని స్వీకరించగలిగే శక్తి కాంగ్రెస్ కు ఉన్నదా అన్నది ప్రశ్న. &lt;br /&gt;&lt;br /&gt;2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనానికి కారణం సోనియానా, వైఎస్సా అన్న  అనుమానం అధిష్ఠానానికే ఉన్నట్టున్నది. లేకపోతే, వైఎస్ వారసత్వం  అన్యాక్రాంతమైపోతే కాంగ్రెస్‌ను గెలిపించుకోగలమా అన్న అనుమానం వారికి  రానక్కరలేదు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్రకాంగ్రెస్‌లో జనవిశ్వాసం  పొందగలిగిన సమర్థుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోతే, అది ప్రతిపక్షాలకే  ఉపయోగపడుతుంది. ఈ రెండున్నరేళ్లలో కిరణ్‌కుమార్ అటువంటి పేరుతెచ్చుకోగలరా?  వైఎస్ ప్రతిష్ఠ వారసత్వానికి ఏ విలువా లేకుండా చేయగలరా? అన్నవి ప్రశ్నలు.  అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ చుట్టూ  జరిగిన దాగుడుమూతలు చూస్తే, రాష్ట్ర కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సదసత్సంశయం  ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది. &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-1486162379955408670?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/1486162379955408670/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/12/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/1486162379955408670'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/1486162379955408670'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/12/blog-post.html' title='కీర్తి వారసత్వం: కిస్సా కుర్సీ కా'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4732561442504758381</id><published>2011-11-22T05:56:00.000-08:00</published><updated>2011-11-22T05:56:47.610-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 20 Nov 2011'/><title type='text'>ఉద్యమం వైకుంఠపాళిలో మళ్లీ మొదటి గడికి!</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;  &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;  సమైక్యవాదాన్ని తెలంగాణలో వినిపించే హక్కు లేదా - అని ప్రశ్నిస్తున్నారు  పరకాల ప్రభాకర్. ఉభయప్రాంతాల్లోనూ సమైక్యవాదులు, విభజన వాదులు ఉన్నారని,  ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చెప్పుకోగలిగిన స్వేచ్ఛ ఉండాలని ఆయన అంటున్నారు.  సూత్రరీత్యా ఆయన వాదనను కాదనడానికి ఏముంది? కానీ, విభజనవాదులు ప్రభాకర్  సభలను అడ్డుకుంటున్నారు. వారు సరే, పోలీసులు కూడా హైదరాబాద్ సహా తెలంగాణలో  ఎక్కడా సమైక్యవాద సభలు జరగడాన్ని ఇష్టపడడం లేదు.  తెలంగాణ వాదులు సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్లి ఏవైనా నిరసనలు చేపట్టడాన్ని  కూడా పోలీసులు అనుమతించకుండా- ఇంకా ఏర్పడని సరిహద్దులకు ముందే పహారా  కాస్తున్నారు. సీమాంధ్రలో విభజనకు అనుకూలంగా ఉన్నవారికి సమైక్యవాదులు  అవరోధాలు కల్పిస్తూనే ఉన్నారు. ఉద్వేగాలు ఉధృతంగా ఉన్నప్పుడు- హక్కులలోని  న్యాయాన్యాయాలను గుర్తించే సహనం ఎవరికీ ఉండదు. &lt;br /&gt;&lt;br /&gt;ఇంతకాలం మౌనంగా ఉండి తను ఎందుకు ఈ చివరిఘట్టంలో రంగప్రవేశం చేశారో,  దీర్ఘకాలంగా సాగుతున్న ఉద్యమం చేసిన వాదనల రామాయణం విని కూడా రాముడికి సీత  ఏమవుతుందని కొత్తగా ఎందుకు ప్రశ్నిస్తున్నారో పరకాల ప్రభాకర్ వివరణ  ఇవ్వాలని తెలంగాణవాదులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయన నుంచి సంతృప్తికరమైన  వివరణ వచ్చినప్పటికీ, ఆయన విశాలాంధ్రవాద ప్రచారాన్ని అనుమతిస్తారని ఏమీ  లేదు.  ప్రభాకర్ ఉద్దేశ్యాలేమైనప్పటికీ, ఆయన వంటి వారిని అడ్డుకోవడం  ఆహ్వానించదగినదేమీ కాదు. అసలు, ఫలానా అభిప్రాయం ఉన్నవారు తమ ప్రాంతంలో  తిరగకూడదని నిషేధాజ్ఞలు విధించడం ప్రజాస్వామికమేమీ కాదు. కానీ, ఉద్యమాలు  ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆశించే పరిస్థితి కూడా లేదు.  ప్రజాప్రతినిధులుగా ప్రజలలో మెలగేవారిని, తమ తమ డిమాండ్లపై నిలదీసే హక్కు  ప్రజలకు ఉంటుంది. చెప్పినమాట నిలబెట్టుకోలేని నేతలను ప్రజలు తరచు  ప్రశ్నించడం చురుకైన ప్రజాస్వామ్యమే. ప్రజలను ఎదుర్కొనడానికి భయపడి నేతలు  మొహం చాటేయాలి తప్ప, కాలు బయటపెట్టకుండా నిషేధించడం మంచి సంప్రదాయమేమీ  కాదు. &lt;br /&gt;&lt;br /&gt;మంచో చెడో - గత రెండేళ్ల కాలంలో ఉభయప్రాంతాల మధ్య ఉద్యమసరిహద్దు రేఖ ఒకటి  వెలసింది. ఇతర అభిప్రాయాన్ని సహించే తత్వం ఉభయప్రాంతాల్లోనూ కొరవడింది.  సామాజికాంధ్ర ఉద్యమం &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;వారే కాదు, చేగొండి హరిరామ జోగయ్య, వసంత నాగేశ్వరరావు  వంటి జై ఆంధ్ర నేతలు కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక తెలంగాణలో  అయితే, ఇతర ప్రాంతాల మంత్రులు, సమైక్యవాద నేతలు తిరుగాడే పరిస్థితి లేదు.  రాష్ట్రంలో ఏర్పడిన విభజనవాతావరణాన్ని సూచించడానికి, సమస్య తీవ్రతను అర్థం  చేసుకోవడానికి ఈ పరిస్థితి పనికివచ్చింది కానీ, ఉభయప్రాంతాల ప్రజలకు ఒకరి  వాదాన్ని మరొకరు తెలుసుకునే అవకాశం లేకుండా చేసింది. ఇది అవాంఛనీయ  పరిస్థితే అయినప్పటికీ, ఇటువంటి స్థితి ఒకసారి స్థిరపడింది కాబట్టి, అందులో  సడలింపు జరిగితే- ఉద్యమంలో వచ్చిన పరివర్తన కారణంగా, పరిష్కారానికి దోహదం  చేసే ప్రక్రియలో భాగంగా జరగాలి. ఉద్యమాలు బలహీనపడినందువల్ల జరిగితే, అది  సామరస్య వాతావరణానికి దోహదం చేయడం కాకుండా, సమస్యను దాటవేయడానికి మాత్రమే  ఉపకరిస్తుంది. &lt;br /&gt;&lt;br /&gt;తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో రైతు సమస్యలపై  యాత్ర నిర్వహిస్తున్నారు. నిజానికి ఆయన తెలంగాణలో సంచరించడానికి ఎటువంటి  నిరోధాలూ ఉండకూడదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఆయన అనుసరించవలసి  వచ్చిన వైఖరి కారణంగా- ఆయనకు రాజకీయమైన ఇబ్బంది ఉండింది. తెలంగాణవాదులు  కూడా ఆయన సంచారాన్ని సహించే పరిస్థితి ఉండేది కాదు.  గతంలో ఒకటి రెండు మార్లు తెలంగాణలో పర్యటించడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు  గట్టి ప్రతిఘటనే ఎదురయింది. కానీ, ఇప్పుడు ఆయన యాత్రకు తెలంగాణవాదుల నుంచి  నామమాత్రపు నిరసన కూడా వ్యక్తం కావడం లేదు. అది మంచి పరిణామమే కావచ్చును  కానీ, దాన్నిసాధ్యం చేసిన పరిస్థితులు మాత్రం సంతోషించదగినవేమీ కావు. ఆయన  పర్యటనను అడ్డుకోవద్దని టిఆర్ఎస్‌కానీ, రాజకీయ జెఎసి కానీ ఎందుకు  నిర్ణయించిందో ప్రజలకు తెలియదు.  గతంలో ఉండిన కారణాలు ఇప్పుడు ఎందుకు మాయమయ్యాయో కూడా తెలియదు.  ఉద్యమనాయకత్వం విధానాన్ని మార్చుకోవడం ఒక అంశం అయితే, ఎవరి పిలుపూ  లేకుండానే ఏవో నిరసనలకుదిగే సాధారణ తెలంగాణవాదులు కూడా నిర్లిప్తంగా ఉండడం  గమనించదగ్గ మరొక అంశం. తెలంగాణ ఉద్యమంలో ఆకస్మాత్తుగా ఏర్పడిన విరామం  ఫలితమా ఇది, లేక, తెలంగాణవాదులలో ఒక విరక్తిభావన నెలకొన్నదా?- అన్న సందేహం  కలుగుతుంది. &lt;br /&gt;&lt;br /&gt;సకలజనుల సమ్మె క్రమక్రమంగా సడలిపోవడంతో పాటు తెలంగాణవాదుల ఆశలు కూడా  బలహీనపడుతూ వచ్చాయి. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించలేమని,  శాంతి నెలకొంటేనే పరిష్కారం సాధ్యమని చెప్పే కాంగ్రెస్ కేంద్రపెద్దలు,  ఒకసారి సాపేక్ష శాంతి నెలకొన్న తరువాత ఇక ఆ ఊసే తీయరు. బక్రీద్ తరువాత  నిర్ణయం అని చెప్పిన పెద్దమనుషులు ఇప్పుడు తలా ఒక మాట మాట్లాడుతున్నారు.  పదకొండు పన్నెండు తేదీల్లో నిర్ణయం వస్తుందని ఎదురుచూసిన ఆశావాదులను,  మాల్దీవుల తిరుగుప్రయాణంలో ప్రధానమంత్రి విలేఖరులతో అన్న మాటలు తీవ్రంగా  కుంగదీశాయి. ఇప్పట్లో తెలంగాణ ఇవ్వము- అన్న ధోరణిలో స్పష్టంగా  మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్రమైన ప్రతిస్పందనలకు  దారితీస్తాయని అనుకుంటే, విచిత్రంగా ఒక జడాత్మక వాతావరణం ఏర్పడింది.  ఇటువంటి పోలికలు తేవడం అమానుషమైనప్పటికీ, ఒకస్థితిని వర్ణించడానికి అవసరం  కాబట్టి చెప్పుకోవాలి- మన్మోహన్ వ్యాఖ్యల కారణంగా ఒక్క ఆత్మహత్య కూడా  రిపోర్టు కాలేదు. ( ఏ కారణం వాళ్ళ అయినా సరే, ఆత్మహత్యలు జరగకపోవడమే ఆనందదాయకం)&amp;nbsp;  అంతకంటె చిన్ననేతల మాటలకు, చిన్న చిన్న సందర్భాలలో నిస్ప­ృహ తీవ్రస్థితికి  వెళ్లిన ఉదంతాలున్నాయి. నిస్ప­ృహ కూడా తెలియనంత షాక్‌లో, నిర్లిప్తతలోకి  తెలంగాణ సమాజం వెళ్లిందా అన్న అనుమానం వస్తున్నది. ఈ వాతావరణంలోనే  చంద్రబాబు తెలంగాణ పర్యటన సాగుతున్నది. &lt;br /&gt;&lt;br /&gt;ఎక్కడైనా నిరసన వ్యక్తమైన చోట తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగా  ప్రతిఘటిస్తున్నారు. తెలంగాణ గురించి సంజాయిషీ ఇచ్చుకోవలసిన సందర్భాలు కూడా  చంద్రబాబుకు ఎదురుకావడం లేదు. ఇందుకు కారణం- అన్ని అభిప్రాయాల వారినీ  యథేచ్ఛగా సంచరించనివ్వాలన్న ప్రజాస్వామికస్ఫూర్తి కాకుండా, ఉద్యమ గమనం లో  ఎదురయిన నిర్వేదం, జడత్వం కారణం కావడం విచారకరం. &lt;br /&gt;&lt;br /&gt;మన్మోహన్ వ్యాఖ్యలకు కెసిఆర్, కోదండరామ్ దగ్గర నుంచి వచ్చిన స్పందన  కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామనే శపథాలు మాత్రమే. వాటి అర్థం ప్రజా  ఉద్యమం నుంచి రాజకీయవ్యూహం దిశగా తెలంగాణ మార్గాన్ని మళ్లించడమే.  తెలంగాణప్రజలు, ఉద్యమశ్రేణులు కోరుకుంటున్నది బహుశా అది కాదు. రాజీనామాలు  అన్నీ అటకెక్కాయి. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపిస్తామని ఎంపీలు,  అసెంబ్లీని స్తంభింపజేస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు.  సకలజనుల సమ్మె వంటి అత్యున్నత ఆందోళన రూపం అనంతరం తిరిగి- పాదయాత్రల  ఉద్యమం ప్రారంభమైంది.  ప్రభుత్వం వైపు నుంచి నిర్బంధచర్యలు పెరుగుతుంటే కనీసవిమర్శ కూడా  వినిపించడం లేదు. తమ పోలిట్‌బ్యూరో సభ్యుడిని నాసా కింద అరెస్టు చేసి  నిరవధిక నిర్బంధంలో ఉంచితే, పార్టీ అధినాయకత్వం నుంచి గట్టి నిరసనే లేదు.  తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం పార్లమెంటు సమావేశాలకంటె ముందు వస్తుందన్న  నమ్మకం లేదు. యుపి విభజన గురించి మాయావతి ప్రకటన తరువాత రకరకాల  పునరాలోచనలు. కేంద్రంలో ఎస్సార్సీ మాట వినిపిస్తే, బిజెపిలో వెనుకంజ  కనిపిస్తున్నది. వె రసిజరిగిందేమిటి? మళ్లీ మొదటికి!&lt;br /&gt;&lt;br /&gt;అదృష్టవశాత్తూ, ఉద్యమంలో ఇంకా అనేక పాయలున్నాయి కాబట్టి, ఏదో ఒక కార్యక్రమం  జరుగుతూవస్తోంది. జెఎసి, టిఆర్ఎస్ ధోరణి నచ్చనివారు సొంతదారిలో నడవాలని  అనుకుంటున్నారు. వారితో మొదటినుంచి లేనివారు సొంతకార్యక్రమాలను  రూపొందించుకుంటున్నారు. ఢిల్లీ దీక్షలతో అనేకుల మద్దతు పొందిన సీనియర్‌నేత  కొండా లక్ష్మణ్ బాపూజీ సద్భావనా ప్రయత్నాలు చేస్తున్నారు. లగడపాటి వంటి  తీవ్ర సమైక్యవాదితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.  సద్భావనాయాత్రలను తలపెట్టారు. రెండు ప్రాంతాలవారి మధ్య సంప్రదింపులు అవసరం.  ప్రజల మధ్య సంభాషణ అవసరం. ఎవరెటువంటివారైనా ఉభయప్రాంతాల నేతల మధ్య ఒక  చర్చ అవసరం. ప్రయత్నాన్ని, ఫలితాన్నీ ఎన్నికల లెక్కలకు వదిలివస్తే సమస్య  పరిష్కారం దొరకదు. విస్త­ృతాభిప్రాయం సమీకరణకు సమాజం నుంచి చొరవ అవసరం. ఏమీ  లేకుండా, అంతా సద్దుమణిగింది అని ఎవరనుకున్నా ప్రమాదమే, ఎప్పుడంటే అప్పుడు  ఉద్యమాన్ని తిరిగి ఉధృతం చేయవచ్చుననుకుంటే అది భ్రమగా మిగలవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4732561442504758381?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4732561442504758381/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post_22.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4732561442504758381'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4732561442504758381'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post_22.html' title='ఉద్యమం వైకుంఠపాళిలో మళ్లీ మొదటి గడికి!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-5896588984406375817</id><published>2011-11-14T04:50:00.000-08:00</published><updated>2011-11-14T04:50:25.173-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 13 Nov 2011'/><title type='text'>విస్తరిస్తున్నది డాలర్ మతమే!</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;       &lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;గాంధీగారిని హింసలు పెడుతున్నదీ, ఇక్కడ పేదలకు సేవ చేస్తున్నదీ ఒకరేనా?-  అని నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలోని మిషనరీ ఆస్పత్రిని  ప్రస్తావిస్తూ, వట్టికోట ఆళ్వారుస్వామి నవల 'ప్రజల మనిషి'లోని ప్రధాన పాత్ర  ఆశ్చర్యపడుతుంది. ఆ ఇద్దరూ ఒకరేనా, వేరువేరా అన్నది రాదగ్గ ప్రశ్నే. ఒకరే  అని తెలిసిరావడం విస్మయపరిచే సమాధానమే. ఒకచేత్తో బైబిల్‌ను మరో చేత్తో  తుపాకిని పట్టుకుని యూరోపియన్ సామ్రాజ్యవాదులు మనదేశంలోకి ప్రవేశించారని  చరిత్రకారులు వ్యాఖ్యానిస్తుంటారు.  కానీ, సామ్రాజ్యవిస్తరణ చేసిన వర్తకులూ, సైన్యాలూ, ఆ విస్తరణకు బాధితులయ్యే  ప్రజల దగ్గరికే వెళ్లి మతబోధలు చేసిన ప్రచారకులూ వారి కర్తవ్యపరిధుల  దృష్ట్యా వేరువేరుగానే ఉన్నారు. ఒక్కోసారి, ఇద్దరి ప్రయోజనాలు, పనిపద్ధతులు  పరస్పరం విరుద్ధంగా ఉండడం వల్ల ఇబ్బందులూ ఏర్పడ్డాయి.  ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసలు ఏర్పరుచుకునే క్రమంలో- మత ప్రచారకుల  ప్రజాసంబంధాలు, బోధనలూ- ఆక్రమణదారులకు ఆమోదాన్ని సాధించిపెట్టాయనుకోవడంలో  అసత్యమేమీ లేదు. అయినంత మాత్రాన, ఆయా వలసల్లోని వివిధ ప్రజావర్గాలలో,  సామాజిక పరిణామాల్లో వలసవాదుల పాలనాపరమైన చర్యలు కానీ, వలసమతప్రచారకుల  సంస్కరణలు కానీ కలిగించిన సానుకూల ప్రభావాన్ని, ప్రగతిశీలమైన మార్పులను  తోసిపారేయలేము. &lt;br /&gt;&lt;br /&gt;బౌద్ధం కానీ, క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ- అవి అవతరించినప్పుడు  నిర్వహించిన చారిత్రకపాత్ర- అనంతర కాలంలో నిర్వహించగలిగాయని చెప్పలేము.  బౌద్ధం భారతదేశ నిర్దిష్ట పరిస్థితులలో సంకల్పించిన మౌలిక మార్పులను  సాధించకుండానే పరాజితమై, ఇతర దేశాలకు వలస వెళ్లి, అనేక మార్పులకు  లోనయింది. తిరిగి భారతదేశంలోని దళితులు గుండెలకు హత్తుకునేదాకా, ఇతర  దేశాల్లో అధికారిక మతంగా మాత్రమే, యథాతథస్థితిని సమర్థించే మతంగా మాత్రమే  మిగిలింది. &amp;nbsp; నాటి మతపెద్దల దౌష్ట్యాన్ని, అమానవీయతను ధైర్యంగా ఎదిరించి, కొత్త  నైతికతను, ప్రబోధాలను మానవాళికి అందించిన ప్రవక్త జీసస్. ఆయన బోధనల  ప్రాతిపదికపై విస్తరించిన మతం- ఆ మతానుయాయులు విస్తరణవాదులుగా,  వలసవాదులుగా, పెట్టుబడిదారులుగా పరిణమించిన తరువాత అదే తీరులో  ఉండలేకపోయింది. క్రీస్తు మతానికి ప్రతినిధులుగా వెలిగిన పెద్దలు, రాజ్యాల  అవసరాలతో రాజీపడ్డారు.  అనేక అమానుష యుద్ధాలను సమర్థించారు. బానిస వర్తకాన్ని  వ్యతిరేకించలేకపోయారు. మధ్య ఆసియాలో అనైక్యతతో పరస్పరం సంఘర్షిస్తూ ఉండిన  వివిధ తెగలను, మితిమీరిన విగ్రహారాధనతో, &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;అనాచారాలతో, అరాచకాలతో  దిగజారిపోతున్న ఆ తెగల సామాజిక జీవనాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రవక్త  మహమ్మద్ నడుం కట్టారు. ఆయన ఉదాత్త ఆశయాలు, ప్రతిపాదించిన విలువలు రకరకాల  వ్యాఖ్యానాలకు లోనయి ఆచరణలో భిన్నంగా మారిపోయాయి. &amp;nbsp; అయితే, ఈ మూడు మతాలను ఆలంబనగా చేసుకుని అనేక ప్రజావ్యతిరేక రాజ్యాలు  వర్ధిల్లినట్టే, ఈ మతాల బోధనలను ఆసరా చేసుకుని ప్రజల పక్షాన జరుగుతున్న  తీవ్రమైన పోరాటాలూ ఉన్నాయి. అనంతర కాలంలో పొడసూపిన అవలక్షణాలకు,  క్షీణవిలువలకు ఆయా మతాలు కానీ, ఆ మతాల బోధకులు కానీ కారణం కాదని వేరే  చెప్పనక్కరలేదు. ఆయా మతాల పేరుచెప్పుకుని, మౌలిక మానవీయ విలువలకు ఎవరైనా  విఘాతం కల్పిస్తూ ఉంటే, అందుకు మతాలను నిందించడం పొరపాటు. &lt;br /&gt;&lt;br /&gt;మధ్యయుగాలలో ప్రారంభమైన యూరోపియన్ వలసవాదం సహజంగానే క్రైస్తవ విస్తరణకు  అవకాశాలను తెరచింది. వాస్కోడిగామా, కొలంబస్‌ల కంటె ముందు కాలంలో, క్రైస్తవ  ప్రచారకుల పర్యటనలు జరగలేదని కాదు. చరిత్రలో అతి పెద్ద మిషనరీ మతాలు  రెండే- బౌద్ధం, క్రైస్తవం. ఈ రెండు మతాల ప్రచారకులు అనూహ్యమైన రీతిలో  ప్రపంచ సంచారం చేశారు. క్రీస్తుశకం ఆరంభ శతాబ్దాలలోనే కేరళ తీరానికి  క్రైస్తవ బోధకులు వచ్చారు.&amp;nbsp;  మొదటి క్రైస్తవ బోధకుడు వచ్చిన నాటికి భారతదేశం ఒకే ఒక మతంతో ప్రశాంతంగా  ఉన్న దేశమేమీ కాదు. వైదికమతం, బౌద్ధం తీవ్రంగా ఘర్షణ పడుతున్న కాలం అది.  కొన్ని ప్రాంతాలలో వైదిక, జైన మతాల మధ్య ఘర్షణ నడుస్తున్నది. ఇక  దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్న మాత్రారాధనలు, స్థానిక ఆదివాసీ  దేవతాసంప్రదాయాల సంగతి చెప్పనక్కరలేదు. తరువాతి కాలంలో వైష్ణవ, శైవ  సంప్రదాయాల మధ్య హింసాత్మకమైన పోటీ ఏర్పడింది. ఆ రెండు కోవలలోను, వైదిక,  అవైదిక ధోరణులతో మరిన్ని పాయలు ఏర్పడ్డాయి.  శంకరాచార్యులు, రామానుజాచార్యులు అనేక పరమత ఆలయాలను తమ తమ మతాలలోకి  మార్చారని చెబుతారు. బహుశా, ఆయా పరమతస్థుల మతమార్పిడికి సంకేతంగానే ఆలయాల  మార్పుకూడా జరిగి ఉండవచ్చు. ఇక బౌద్ధపరిశోధకులను ప్రశ్నిస్తే, దేశంలో  ప్రస్తుతం ఉన్న ఆలయాల్లో అనేకం బౌద్ధస్థలాలేనని చెబుతారు. భారతదేశంలో  ఇస్లాం ప్రవేశం జరిగాక, అనేక మతమార్పిడులు జరిగాయి. అందులో కొన్ని కత్తి  ఝళిపించి జరిపిన మార్పిడులు ఉన్నప్పటికీ, పరాజితమవుతున్న బౌద్ధం నుంచి,  వైదికమతంలోని నిమ్నవర్గాల నుంచి స్వచ్ఛందంగా జరిగిన మార్పిడులు కూడా  ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.  తరువాత హిందూమతంగా ప్రసిద్ధమైన వైదిక మతంలో ఉన్న తీవ్రమైన అంతరాలు (కుల  వ్యవస్థ ఆది వేద మతంలో లేదని, అనంతరకాలంలో చేరిన అవలక్షణమని ఆర్యసమాజీయులు  అంటారు) నిమ్నవర్గాలు తరచు బయటి అవకాశాల కోసం ప్రయత్నించడానికి కారణమని  గుర్తించకపోతే, ఈ ప్రక్రియ భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది.&amp;nbsp;  భారతదేశం ఇతర దేశస్థుల దాడికి, వలసకు గురి కావడానికి జాతిలోని అనైక్యత  కారణమని చెప్పేవారు కూడా, ఆ అనైక్యతను దేశీయపాలకుల మధ్య అనైక్యతగా  చూస్తారు. కానీ, అది ఇక్కడి నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ కల్పించిన  అనైక్యత అని,అదే ఇతరులకు రాజకీయంగా కానీ, మతపరంగా కానీ చొరబాటు అవకాశాలు  ఇచ్చిందని గుర్తించడం అవసరం. &lt;br /&gt;&lt;br /&gt;మతానికీ, సామ్రాజ్యాలకూ అవినాభావ సంబంధం ఉన్న రోజుల్లో సరే కానీ, ఆధునిక  సెక్యులర్ ప్రజాస్వామిక యుగంలో మునుపటి తరహా మతవిస్తరణలు అవసరం లేదు.  రాజ్యాల భౌతిక విస్తరణే నిలిచిపోయిన కాలం ఇది. ఎవరి జనసంఖ్యను వారు  స్థిరీకరించుకుని, వారి వారి మతవర్గాల మధ్య పనిచేస్తే సరిపోతుంది.  వ్యక్తులు స్వచ్ఛందంగా మతవిశ్వాసాలను మార్చుకోవడం స్వేచ్ఛలో భాగం. లేదా  సమూహాలు మూకుమ్మడిగా తమ ఆత్మగౌరవప్రకటన కోసం ( అంబేద్కర్ బౌద్ధంలోకి  మారినట్టు) మతాన్ని మార్చుకోవడం సామాజికమైన కార్యాచరణ. &lt;br /&gt;కానీ, మనుషులను గెలుచుకునే పద్ధతిలో ఎవరూ ఎవరినీ మార్చడం, చేర్చుకోవడం  వాంఛనీయం కాదు. ఏ దేశంలో కానీ, ప్రాంతంలో కానీ జనాభా సామాజిక స్వభావాన్ని  పెద్ద ఎత్తున కృత్రిమంగా మార్చే ప్రయత్నమేదైనా అభిలషణీయం కాదు. అయితే,  అక్కడక్కడా చెదురుమదురుగా జరిగే సంఘటనలకు అతిగా స్పందించవలసిన అవసరమూ లేదు.  ఏడువందల సంవత్సరాలు ముస్లిమ్ రాజులు పాలించిన తరువాత కూడా దేశంలో నేడు  ముస్లిముల జనాభా 13.5 శాతానికి మించి లేదు. రెండువందలేండ్లు తెల్లవారు  పాలించినప్పటికీ, క్రైస్తవుల జనాభా 2.5 శాతానికి మించలేదు.&amp;nbsp;  ఈ దేశ జనసంఖ్య స్వభావాన్ని తలకిందులు చేయగలిగే మతమార్పిడులు జరగడం అంత  సులభం కాదని చరిత్ర చెబుతున్నది. ఆ మాత్రం మైనారిటీ మతానుయాయులు, ఇస్లాం,  క్రైస్తవాలు రాక మునుపు కూడా దేశంలో ఉన్నారు. మతమార్పిడులు అనైతిక  పద్ధతుల్లో జరుగుతున్నాయని అనుకుంటే కనుక, దాన్ని నిరోధించే అవకాశమూ శక్తీ  మెజారిటీ మత పెద్దల చేతిలోనే ఉన్నది. &lt;br /&gt;&lt;br /&gt;అట్టడుగుకులాలకు సమానమైన ప్రతిపత్తీ, గౌరవమూ ఉన్న సమాజాన్ని, సాంస్క­ృతిక  వైవిధ్యాన్ని అనుమతించే ప్రజాస్వామిక స్వభావాన్ని నిర్మించుకోవడమొక్కటే,  పరమతాల విస్తరణను నిరోధించగలదు. ఏ వర్గాలైతే తమ సామాజిక న్యాయసాధన లో,  ఆత్మగౌరవపరిరక్షణలో మతమార్పిడిని ఒక సాధనంగా ఎంచుకుంటున్నాయో, ఆ వర్గాలను  తక్కిన సమాజం అభివృద్ధికీ, సమానత్వానికి ఎడంగా ఉంచుతున్నంత కాలం  మతమార్పిడులను వ్యతిరేకించగలిగే నైతికత కూడా మెజారిటీ మతవాదులకు ఉండదు. &lt;br /&gt;&lt;br /&gt;తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడానికి, మార్కెట్లను విస్తరించడానికి ప్రపంచాన్ని  చుట్టచుడుతున్న అగ్రరాజ్యాల మతం ఏదైనా కావచ్చును కానీ, వారి  నవీనవలసవాదానికి మతం ప్రధానమైన వాహిక ఏమీ కాదు. మతంతో నిమిత్తం లేని  సంస్క­ృతి, విలువల సంపుటి ఇప్పుడు ప్రపంచదేశాల ఆలోచనాపరుల, శిష్టవర్గాల  హృదయాన్ని, బుద్ధిని ఆక్రమించుకుని ఉన్నాయి.  దేశాల తలుపులు బార్లా తెరిచి, మెగ్డొనాల్డ్ దగ్గరనుంచి ఫార్ములా వన్ దాకా  జాతి గుండెల మీద నెలకొల్పిన గ్లోబల్‌మతం - ఏ అడ్డూ ఆపూ లేకుండా  విస్తరిస్తున్నది. ప్రపంచమంతా ఒకే భాష, ఒకే చదువు, ఒకే సినిమా, ఒకే కంపెనీ,  ఒకే క్రీడ స్థిరపడిన తరువాత, ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ డాలర్‌కు కప్పం  గడుతున్నప్పుడు, స్వార్థమొక్కటే అధికార విలువ అయినతరువాత, ఇళ్లల్లో గుళ్లలో  చేసుకునే పూజలేమైతేనేమి? &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-5896588984406375817?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/5896588984406375817/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post_14.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5896588984406375817'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5896588984406375817'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post_14.html' title='విస్తరిస్తున్నది డాలర్ మతమే!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-8586889411037269148</id><published>2011-11-08T05:46:00.000-08:00</published><updated>2011-11-08T05:46:16.180-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 06 Nov 2011'/><title type='text'>తొంభై ఏడేళ్ల నవయువకుడు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;   &lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; పెద్ద పెద్ద ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల్ని అడగండి,  అన్నా హజారే ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అని చెబుతారు. గాంధీగారు గాంధీగారు  అని వినడమూ చదవడమూ తప్పితే, అటువంటి వాళ్లను ప్రత్యక్షంగా చూసింది లేదు,  అదృష్టవశాత్తూ ఇప్పుడు హజారేను చూడగలుగుతున్నాం- అని మురిసిపోతారు.  స్వాతంత్య్రం వచ్చేనాటికి హజారేకు పట్టుమని పదేళ్లే అని చెబితే  ఆశ్చర్యపోతారు. &lt;br /&gt;&lt;br /&gt;హజారేను భావిభారత పౌరులు అట్లా చూడగలగడం సంతోషం కలిగించేదే. ఆయనను బాగా  గౌరవించేదే. తాము గౌరవించదగ్గ, ఆరాధించదగ్గ, నిస్వార్థమని చెప్పదగ్గ ఒక  ప్రతీకా, ఒక్క మనిషీ కనపడని ఎడారికాలమిది అని బాధపడిపోయే కొన్ని శ్రేణుల  ప్రజల ఊహాచిత్రమే హజారే. వారందరి ఆదర్శాలకూ ఆలంబనగా దొరికిన నాయకుడాయన. ఆ  ఊహాచిత్రపు రచన చేసింది మాత్రం ఉద్యమాలో, విశాల ప్రజానీకమో కాదు. &lt;br /&gt;&lt;br /&gt;ఆంగ్లవిద్యలో ఆరితేరిన సంస్కారవంతుల జాతీయ శిష్టవర్గమూ వారి గుండెచప్పుడును  అందంగా ఆర్తితో ప్రతిధ్వనించే ప్రచారశిబిరమూ కలసి చిత్రించిన బొమ్మ అది.  హజారే వ్యక్తిగత స్థాయిని అంచనా వేయడం కాదిది. ప్రజాజీవితంలో ఆయనది ఒక  విశిష్ట మార్గం. ఆ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన సంకల్పమూ  కార్యనిష్ఠా నిస్వార్థ తత్పరతా వేలెత్తి చూపలేనివి. అయినప్పటికీ, ఆయన  మార్గంపై ఉండే సందేహాలు, ఆయన అనుయాయివర్గంపై ఉండే అనుమానాలు  తోసిపారేయదగ్గవి కావు. ఎన్ని అదనపు మార్కులు వేసినా, ఒక స్వాతంత్య్ర  సమరయోధుడి స్థాయిని హజారేకు ఇవ్వలేము. &lt;br /&gt;&lt;br /&gt;ప్రభుత్వాన్ని తన దగ్గరకు రప్పించుకున్న తన ఆమరణ దీక్షకు, తాజాగా  మౌనదీక్షకు వేదికగా ఎంచుకున్న దేశరాజధాని నగరంలోనే ఒక  స్వాతంత్య్రసమరయోధుడు, నిండునూరేళ్లు జీవించబోతున్న పండుముదుసలి కొండా  లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహం చేస్తున్నారు. ఆయన పక్కనే మరో వృద్ధయోధుడు  బోయినపల్లి వెంకటరామారావు, మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులు దీక్షలో  ఉన్నారు. అన్నాహజారేకోసం ఉప్పొంగినట్టుగా ఢిల్లీ గుండెలు, జాతీయ మీడియా  కెమెరాలు వారి కోసం ఉప్పొంగడం లేదు. అశేష జనసందోహం జాతీయ జెండాలు  పట్టుకుని, ఒంటిమీదా బట్టల మీదా నినాదాలు రాసుకుని ఆ శిబిరం చుట్టూ  గుమిగూడడం లేదు.  అవినీతిపై యుద్ధమంటే అందరూ ఒప్పుకునే పోరాటంకాబట్టి అన్నా హజారేకు అందరూ  బ్రహ్మరథం పట్టారు, ప్రత్యేక తెలంగాణ కోసం సత్యాగ్రహం చేస్తున్న బాపూజీకి  అందరూ మద్దతు ఎట్లా ఇస్తారు?- అన్న ప్రశ్న సహేతుకమయినదే. తెలంగాణా డిమాండ్  గురించి సంబంధిత ప్రాంతాల ప్రజలలో, నాయకులలో భిన్నాభిప్రాయాలున్నాయి,  కాంగ్రెస్ అధినాయకత్వం అయోమయంలో ఉన్నది-ఇవన్నీ వాస్తవాలే. అన్నా హజారే  ఉపవాసదీక్ష చేశారు- బాపూజీ కేవలం సత్యాగ్రహం మాత్రమే చేస్తున్నారు, ఇదీ  వాస్తవమే. &lt;br /&gt;&lt;br /&gt;కానీ, గాంధీ మహాత్ముడు సైతం తన రాజకీయజీవితంలో అనేక వివాదాస్పదకారణాలకు  సత్యాగ్రహాలు చేశారు, ఒక్కొక్కసారి ప్రజావ్యతిరేకమని భావించే అంశాలపై కూడా  పట్టుదలగా ఆందోళనకు దిగారు. అయినా, ఆయన దీక్షలను ఆ అంశాల కారణంగా ఎవరూ  తక్కువ చేసి చూడలేదు. అందుకే ఇప్పుడు, &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;తొంభై ఏడేళ్ల సీనియర్ రాజకీయవేత్త,  జాతీయవాది కొంత మంది సహచరులతో దేశరాజధాని వీధుల్లో కూర్చుంటే దానికి స్పందన  లభించకపోవడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. నూటాపాతికేళ్ల సుదీర్ఘ చరిత్ర  ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, తన ఘనవారసత్వానికి సజీవ ప్రతీకగా  నిలిచిన మనిషితో సంభాషించలేకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. &lt;br /&gt;&lt;br /&gt;బాపూజీ జీవితం గొప్పది. ఒక ప్రాంతానికి పరిమితమైన అభివృద్ధి ఆకాంక్షల  దగ్గర నుంచి, సమస్త మానవాళికీ సంబంధించిన విస్త­ృత ఆదర్శాల దాకా మోసుకుని  తిరిగిన ప్రజాజీవితం ఆయనది. క్విట్ ఇండియాలో పాల్గొన్నారు, ఎమ్ఎన్‌రాయ్  ప్రభావంలో ఉన్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతాలను అధ్యయనం చేశారు.  పద్మశాలీల సమీకరణలో ముఖ్యపాత్ర వహించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో  పాలుపంచుకున్నారు.  తరువాతి కాలంలో ప్రధానస్రవంతి రాజకీయాల్లో ఉంటూనే, ఆ పరిమితుల మధ్యనే  సామాజిక న్యాయ విలువలను కాపాడడానికి కృషిచేశారు ఆయన. దామోదరం సంజీవయ్య  ముఖ్యమంత్రి కావడంలో బాపూజీ ప్రమేయమూ, చొరవా చాలా ఉన్నాయి. 1969 తెలంగాణ  ఉద్యమం కాలంలో మంత్రిపదవికి బాపూజీ చేసిన రాజీనామా ఇప్పటి మంత్రులూ  ప్రజాప్రతినిధులూ చేసినటువంటి రాజీనామాలు కావు. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో భూస్వామ్యదోపిడీని ఎదిరించిన చరిత్రా, ఒక ప్రాంతంగా తెలంగాణపై  వివక్షను ప్రశ్నిస్తున్న వర్తమానమూ బాపూజీ వ్యక్తిత్వంలో కలగలసిపోయాయి.  తెలంగాణకు ఎదురయిన రెండు రకాల సమస్యల గురించిన అవగాహన ఉన్నది కాబట్టే, ఆ  రెంటినీ ఒకదానికి ఒకటి పోటీదారుగా, ప్రత్యర్థిగా నిలబెట్టే చాపల్యం ఆయనలో  కనిపించదు.  మలివిడత తెలంగాణ ఉద్యమం ప్రారంభమయిన నాటికి ఆయనకు ఎనభైఏళ్లు పైబడ్డాయి.  ఇప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉన్న బాపూజీ అప్పుడు మరింత దృఢంగా ఉన్నారు. అయినా,  ఉద్యమానికి తాను నేతృత్వం వహించాలని ఉబలాటపడలేదు. తన అనుభవాన్ని, అవగాహనను  అందిస్తూ పెద్ద దిక్కుగా కొనసాగాలనే అనుకున్నారు. బలహీనవర్గాలకు  చెందినవారిని అగ్రనాయకత్వానికి అంగీకరించడంలో సమాజానికి ఉన్న పరిమితులు  ఆయనకు తెలియనివి కావు.  కొత్త తరం వారు సాహసించినప్పుడు, వారికి వెన్నుదన్నుగా ఉండడానికి  ప్రయత్నించారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజాపార్టీ పెట్టినప్పుడు,  దాన్ని ఆశీర్వదించడమే కాదు, అందులో భాగమయ్యారు కూడా. ఆ ప్రయత్నం విఫలమయ్యాక  కూడా ఆయన విశ్రమించలేదు. తన సలహాలు కోరినవారిని, తన సారథ్యాన్ని  కోరినవారిని ఆదరిస్తూనే ఉన్నారు. ఆ అవిశ్రాంత ఆచరణలో భాగంగానే ఇప్పుడు  సత్యాగ్రహంలో ఉన్నారు. &lt;br /&gt;&lt;br /&gt;బాపూజీ సత్యాగ్రహాన్ని సమర్థిస్తున్నవారూ, ఆయనకు జేజేలు పలుకుతున్నవారూ  అందరూ ఆయనపై గౌరవంతోనే ఆ పనిచేస్తున్నారని చెప్పలేకపోవచ్చు. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడితే దానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని  ప్రతిపాదిస్తున్నవారున్నారు. అంతకుమించిన గౌరవానికి కూడా ఆయన అర్హుడే,  కానీ, దాన్ని ఆయన ఆశిస్తున్నారని అనుకుంటే అపచారమే. టిఆర్ఎస్‌పైనా,  చంద్రశేఖరరావు నాయకత్వం మీద రకరకాల అనంగీకారాలున్నవారు బాపూజీ  వ్యక్తిత్వాన్ని ఆసరా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు.  రకరకాల వైరుధ్యాలున్న తెలంగా ణ ఉద్యమానికి బాపూజీ ఒక సమన్వయశక్తిగా  పనిచేస్తారని, పోరాటానికి నైతిక స్థయిర్యం ఇస్తారని నిజంగా ఆశిస్తున్నవారూ  ఉండవచ్చు. ఎవరేమనుకున్నా, అందరూ గౌరవించి తలకెత్తుకోదగ్గ వ్యక్తి బాపూజీ.  టిఆర్ఎస్ కానీ, ఆ పార్టీ ప్రధానశక్తిగా సాగుతున్న ఉద్యమం కానీ చేసిన  అతిపెద్ద పొరపాట్లలో - బాపూజీ సత్యాగ్రహానికి మద్దతు ఇవ్వకపోవడం, మౌనం  వహించడం ముఖ్యమైనది. &lt;br /&gt;&lt;br /&gt;కొండా లక్ష్మణ్ సత్యాగ్రహం వారం రోజులకే పరిమితమైనది. నల్లగొండలో  కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న దీక్షతో కానీ, గతంలో చంద్రశేఖరరావు  చేసిన దీక్షతో కాని దీనికి పోలిక లేదు. అప్పుడెప్పుడో ఢిల్లీలో కెసిఆర్ ఒక  రోజు చేసిన దీక్షతో కూడా దీనికి పోలిక లేదు. దేశరాజధానిలో తెలంగాణ  పరిష్కారావశ్యకతను నొక్కి చెప్పడానికి, జాతీయస్థాయిలో నలుగురి దృష్టికి  సమస్యను తీసుకువెళ్లడానికి ఉద్దేశించిన సత్యాగ్రహం బాపూజీది. &amp;nbsp; అందులో ఆయన విజయం సాధించినట్టే చెప్పవచ్చు. తెలుగుదేశంపార్టీకి చెందిన  తెలంగాణ ప్రతినిధులు, బాపూజీతో పాటు కలసినడుస్తున్న పోరాట సహచరులు మాత్రమే  కాక, కాంగ్రెస్ ఎంపీలు కూడా బాపూజీకి మద్దతు చెప్పారు. గద్దర్ ప్రజాఫ్రంట్  కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించింది. మాటవరసకైనా కాంగ్రెస్ నేత ఆస్కార్  ఫెర్నాండెజ్ వచ్చి పరామర్శించారు. అనేక ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు  వచ్చి కొండా లక్ష్మణ్‌కు సంఘీభావం చెప్పారు. &lt;br /&gt;&lt;br /&gt;ఎంతో ఉధృత స్థాయికి వెళ్లి, మళ్లీ విరామానికి లోనయిన తెలంగాణ ఉద్యమంలో ఈ  సత్యాగ్రహానికి ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించకపోవచ్చు. తెలంగాణ ఉద్యమానికి  కేంద్రం నుంచి ఎదురవుతున్న అలక్ష్యమూ స్పందనారాహిత్యమూ ఒక ప్రతికూలత అయితే,  అనివార్య పరిస్థితులనుంచి ఉద్యమంలో ఏర్పడుతున్న ఏకనాయకత్వం మరో ప్రతికూలత.  కొండా లక్ష్మణ్ సత్యాగ్రహం ఈ రెండు ప్రతికూలతలనూ స్పృశించడానికి  ప్రయత్నించింది. &lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-8586889411037269148?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/8586889411037269148/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post_08.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/8586889411037269148'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/8586889411037269148'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post_08.html' title='తొంభై ఏడేళ్ల నవయువకుడు'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4349812118333809629</id><published>2011-11-03T05:29:00.000-07:00</published><updated>2011-11-03T05:29:16.284-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 30 Oct 2011'/><title type='text'>బ్రహ్మరథమా, సవారీయా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మొదట నిప్పు రాజేసిన యోధులు పాపం అంతకు  ముందు దశాబ్దం కాలం నుంచి దేశంలోని రాజ్యాలకీ, సంస్థానాలకీ కాలికి బలపం  కట్టుకుని తిరిగారు, కలసి రమ్మని అడిగారు. నాయకత్వం వహించమనీ కొందరిని  కోరారు. కొందరు విని ఊరుకున్నారు, కొందరు సహకరిస్తామన్నారు, కొందరు ఆ  ప్రయత్నాల గురించి బ్రిటిష్‌వారి చెవిన వేశారు. ఆ ప్రయత్నాలు  నిరర్థకమయ్యాయని చెప్పలేము. పోరాటం ఉత్తర, మధ్య భారతాల్లో ఉవ్వెత్తున  ఎగియడానికి ఆ సన్నాహక చర్యలు చాలా ఉపకరించాయి. అయితే, చాలా కాలం దాకా  దేశవ్యాప్త ఆమోదం కలిగిన ఒక నాయకుడంటూ దొరకలేదు.  చివరకు ఏనభైఏండ్లు దాటిన వృద్ధుడిని, ఎర్రకోటకే పరిమితమైపోయిన చివరి  మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ని స్వతంత్ర భారత పోరాట  సర్వసైన్యాధ్యక్షుడిగా, తిరుగుబాటు నాయకునిగా ఎన్నుకున్నారు. ఆయన గొప్ప  నాయకత్వం అందించిందీ లేదు, చివరి నిమిషంలో కరవాలం ఝళిపించిందీ లేదు కానీ,  విప్లవ సేనానిగా శిక్ష మాత్రం అనుభవించాడు. పరిపాలన ఏమి చేశాడో, ప్రజల  గురించి ఏమి చేశాడో తెలియదు కానీ, చరమాంకంలో ఆయన జననేతగా  మిగిలాడు. &lt;br /&gt;&lt;br /&gt;నాయకత్వానికి ఉన్న మహత్యం అదే. నాయకుడో నాయకురాలో ముందుండి అనుచరులను  సేనలను ముందుకు నడిపిస్తారని సాధారణంగా అనుకుంటాం, చాలా సందర్భాలలో జనమూ  సేనలూ వెనకుండి నేతలను ముందుకు తోస్తూ కూడా ఉంటారు. ముక్కలు ముక్కలుగా,  సంబంధం లేకుండా జరిగే కార్యాచరణకు నాయకత్వం ఒక కేంద్రాన్ని ఇస్తుంది.  అనేకత్వంలో విజృంభిస్తున్న పోరాటాలు, తమకు తామే ఒక చిహ్నాన్నో &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ప్రతీకనో  నెత్తిన పెట్టుకుని ఏకోన్ముఖతను ప్రకటిస్తాయి. సిపాయిల తిరుగుబాటులో  అనేకానేక మంది వీరులు సాహసులు త్యాగధనులు పోరును నడిపించినప్పటికీ,  జాతీయస్థాయిలో తిరుగుబాటు జెండాను మోయడానికి ఒక పెద్ద నేత అవసరమైనప్పుడు  ఉత్సవ విగ్రహమే కావచ్చు ఒక బొమ్మను ప్రతిష్ఠించుకున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;స్థాయిలోను, విస్త­ృతిలోను ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంతో పోల్చడం సరికాదు  కానీ, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి నాయకత్వ అన్వేషణ నాలుగు దశాబ్దాలకు  పైగా సాగుతూనే ఉన్నదనిపిస్తుంది. జనం తమంతట తామే తమ అసంతృప్తిని  రాజకీయశక్తిగా మలచి, ఒక నాయకుడి చేతికి అప్పగించడం, అతను దాన్ని  అమ్ముకోవడమో, జారవిడవడమో చేయడం 1969లోనే మొదలయింది. జనంలో అంతటి తపనా,  సంసిద్ధతా ఉన్నప్పుడు నాయకుడనే ప్రతిమ ఎందుకు అన్న ప్రశ్న సబబే కానీ,  ఉద్యమంలోని వివిధత్వాన్ని ఏకసూత్రతతో అనుసంధానించే వ్యక్తి, ఉద్యమగమనానికి,  సాఫల్యానికి ఆవశ్యకం.  ఉద్యమాలు కీలకస్థాయికి చేరుకుని, అవతలి పక్షంతో సంభాషించే ప్రక్రియను  ప్రారంభించవలసి వచ్చినప్పుడు, ఉద్వేగాలను ఆవేశాలను ఆకాంక్షలను రాజకీయంగా  అనువదించే పని నాయకత్వానిదే. ఉద్యమంలోని వివిధ పాయలు, బృందాలు, ఛాయలు ఎంతో  కొంత ఆమోదించగలిగే వ్యక్తీ, ప్రాధాన్యాల వారీగా ఉద్యమలక్ష్యాలను  క్రోడీకరించగలిగి దౌత్యం నెరిపే వ్యక్తీ నాయకుడిగా ముందుకు వస్తాడు. ఈ  ప్రక్రియను సవ్యంగా అర్థం చేసుకోగలిగే శక్తి లేనివారు- నాయకులే ఉద్యమాలను  సృష్టిస్తారని, ప్రజలను రెచ్చగొట్టి పోరాటాలు చేయిస్తారని తలకిందులుగా  వ్యాఖ్యానిస్తారు. &lt;br /&gt;&lt;br /&gt;నాయకత్వం వహించాలని ముందుకు వచ్చే వారందరినీ జనం ఆమోదిస్తారని లేదు.  చెన్నారెడ్డి అనుభవం తరువాత- తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయడానికి  ప్రయత్నాలు జరగలేదని కాదు. ఆశాభంగమూ నిస్ప­ృహా అలుముకున్న వాతావరణంలో  మరొకరిని విశ్వసించే సాహసం ప్రజలు చేయలేదు. తిరిగి ప్రయత్నించాలనుకున్న  సమయంలో సైతం ముందుకు వచ్చిన నేతలు విశ్వాసం కలిగించలేకపోయారు. ఇంద్రారెడ్డి  ప్రయోగం కానీ, దేవేందర్‌గౌడ్ పార్టీ కానీ ఎందువల్ల సఫలం కాలేకపోయాయో  విశ్లేషించుకోవాలి. &amp;nbsp; ప్రస్తుత సామాజిక నిర్మాణంలో నాయకత్వంలోకి ఎదిగేవారికి- సాంప్రదాయికమైన  హోదాలు, కులం కానీ ధనం కానీ- తప్పనిసరిగా రెడీమేడ్ యోగ్యతలను అందిస్తాయి.  అలాగని, కులమూధనమూ ఉన్నవారందరూ యోగ్యులవుతారని కాదు. ఒక అంశం మీద పట్టుదలా,  నిరీక్షించగలిగే సహనమూ, ఉద్యమపర్యవసానాలను ఒడుపుగా నేర్పుగా  నిర్వహించగలిగే సామర్థ్యమూ- ఒక వ్యక్తిలో కనిపించినప్పుడే జనం నాయకత్వాన్ని  అప్పగిస్తారు. అది కూడా ఒక రోజులో ఒక నెలలో జరిగేది కాదు. &lt;br /&gt;&lt;br /&gt;నాయకత్వం స్థిరపడడం ఒక సంఘటన కాదు, ఒక క్రమం. అది అన్ని సందర్భాలలోనూ  పాజిటివ్ ఎంపిక కాకపోవచ్చు, తారతమ్యపరీక్షలో మెరుగైన వ్యక్తి ఎంపిక  కావచ్చు. ఎన్ని అవలక్షణాలున్నప్పటికీ, ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కె.  చంద్రశేఖరరావు నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు నిరాకరించలేకపోవడానికి కారణాలు  చారిత్రకమైనవి, రాజకీయమైనవి కూడా. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించేవారు  కెసిఆర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న కొద్దీ, ఆయన తెలంగాణకు గట్టి నాయకుడిగా  రూపొందుతూ వస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ ప్రాంతానికి ఒక దృఢమైన నాయకత్వం సమకూరడం వాంఛనీయమే అయినా,  అనివార్యత నుంచి ప్రత్యర్థుల స్పందనలనుంచి అది స్థిరపడడం ప్రమాదకరం. ఒక  తిరుగులేని శక్తిగా కెసిఆర్ రూపొందడంలోని ప్రమాదాన్ని గుర్తించినందువల్లనే  (ఇతర కారణాలు లేవని కాదు) సామాజిక న్యాయశక్తులలో రోజురోజుకు అసహనం  పెరుగుతున్నదనిపిస్తుంది. ఆ అసహనం ఒక్కోసారి తెలంగాణ ఉద్యమాన్నే ప్రశ్నించే  స్థాయికి పోతున్నది.  అందరికీ అన్ని విమర్శలూ ఉండి కూడా, బడుగు సామాజిక వర్గాలు ఎందుకు ప్రస్తుత  నాయకత్వం వెనుకే సమీకృతమవుతున్నాయో విశ్లేషించకోకుండా, కేవలం కుట్ర  సిద్ధాంతాలు వల్లె వేసినందువల్ల పెద్ద ఉపయోగం లేదు. ఉద్యమ మహాప్రవాహంలో ఏదో  ఒక స్థాయిలో అంతర్భాగమై ముందుకు నడిచేవారే తమ ప్రాతినిధ్యాన్ని  సాధించుకోగలరు, భవిష్యత్ ప్రమాదాలను నివారించగలరు. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న శ్రేణులు కెసిఆర్ ప్రతిమను తమ  భుజాల మీద 'స్వచ్ఛందంగానే' మోస్తున్నారు. దీన్ని కెసిఆర్ సవారీగా కూడా  వ్యాఖ్యానించవచ్చును కానీ, ఉద్యమకారులు దాన్ని అంగీకరించరు. ఉద్యమ మనుగడకు  అవసరం కాబట్టే, ఆ నాయకత్వాన్ని భరిస్తున్నామని, స్వీకరిస్తున్నామని అంటారు.  ఉద్యమం ఏ ఒక్కరిచేతిలోనూ లేని మాట నిజమే.  నిర్మాణపరంగా, కెసిఆర్‌కు కానీ, ఆయన పార్టీకి కానీ ఉద్యమంపై నిజమైన పట్టు  ఉన్నదని చెప్పలేము. అందుకే ఉద్యమేతర మార్గాలలో లక్ష్యాన్ని సాధించి రాజకీయ  లబ్ధి పొందాలని నాయకత్వం భావిస్తున్నదేమోనన్న అనుమానం కలుగుతుంది. అయినా,  ప్రజలు మాత్రం ఉద్యమం వేడి ద్వారానే రాజకీయవాదులను నడిపిస్తున్నారు, తమకంటె  వారికే ఎక్కువ లబ్ధి లభించే అవకాశమున్నప్పటికీ. &lt;br /&gt;&lt;br /&gt;దేశంలోని అనేక వర్గాల్లో, బృందాల్లో వర్తమాన పరిస్థితులపై తీవ్రమైన  అసంతృప్తి ఉన్నప్పటికీ, విశ్వసనీయమైన నాయకత్వ లోపం కారణంగా అది సంఘటితం  కాలేకపోతున్నది. విశ్వసనీయత నేడు జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.  ప్రజామోదాన్ని పైనుంచి సృష్టించి దిగువకు తీసుకువెళ్లాలనుకునే దృక్పథలోపం  మరో సమస్య. ఒకనాడు నెహ్రూ కుటుంబ వారసత్వం ఉండడమే పెద్ద అర్హతగా ఉండిన  దేశంలో ఇప్పుడు ఆమోదనీయత కోసం రాహుల్‌గాంధీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ఒకనాడు ప్రతిపక్షనేతలంటే, ప్రత్యామ్నాయ నాయకత్వం అన్న దృష్టి ఉండేది.  ఇప్పుడు వారూ ఆశ కలిగించడం లేదు. విద్యాధికులై, మధ్యతరగతిలోని  ఎగువశ్రేణుల్లో ఉన్నవారిలో ఉన్న ఆకాంక్షలు సైతం ఒక ఆలంబన కోసం  వెదుక్కుంటున్నాయి. ఒకనాడు చంద్రబాబునాయుడు వారికి ఆశగా కనిపించారు. తరువాత  మరికొందరికి లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ్ కనిపిస్తున్నారు.  జాతీయస్థాయిలో ఇప్పుడు అన్నా హజారే బృందం కనిపిస్తోంది. కానీ, అల్పపీడనం  స్థాయిలోనే అసంతృప్తి మిగిలిపోతోంది తప్ప, తుఫానుగా పరిణమించడంలేదు.  నాయకులను ముందుకు తోయగలిగే శక్తి ఆ వర్గాలకు లేదు, ఆ వర్గాలను ముందుకు  నడిపించగలిగిన చొరవ ఆ నాయకత్వానికీ లేదు. అందుకే అట్టడుగు వర్గాల వారు  ఉదాత్తంగా కనిపించే, విలువల జపం చేసే నాయకుల కోసం కాక, ఆచరణాత్మకంగా  వ్యవహరించే సాదాసీదా నేతలనే ఇష్టపడతారు. &lt;br /&gt;&lt;br /&gt;వారిలో ఎన్ని లోపాలు ఉండనీ గాక, ఎంత అవినీతి ఉండనీ గాక. విజయం సాధించగలిగే  శక్తి ఉన్నదా లేదా, ప్రయాణాన్ని ఒక మజిలీకి చేర్చగలిగే సత్తా ఉన్నదా లేదా  అని మాత్రమే చూస్తారు. తమ ఆకాంక్షల ఉధృతికి, నైతిక శక్తికి సమ ఉజ్జీ అయిన  మనిషి నేతగా లభించకపోతే, తామే ఒక కనీసస్థాయి మనిషిని ఎంచుకుని, అతనికే  నాయకత్వపు అలంకారాలు చేస్తారు. &lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4349812118333809629?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4349812118333809629/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4349812118333809629'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4349812118333809629'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/11/blog-post.html' title='బ్రహ్మరథమా, సవారీయా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4789686514374734233</id><published>2011-10-24T10:22:00.000-07:00</published><updated>2011-10-24T10:22:48.440-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 23 Oct 2011'/><title type='text'>పొరుగింటికి పాకిన అనకొండ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="headline"&gt;&lt;h1&gt;&lt;/h1&gt;&lt;/div&gt;&lt;div class="heading"&gt;&lt;b&gt;    &lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;అలీనోద్యమ దేశంగా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు, భారతదేశం అనేక అంతర్జాతీయ  అంశాలపై తనదంటూ ఒక వైఖరిని స్పష్టంగానే చెబుతూ ఉండేది. ఒకే ఒక పక్షంతో  లీనమవడం తప్ప అలీనతకు ఆస్కారం లేని రోజులు వచ్చాక, మౌనంగా ఉండడాన్ని,  డొంకతిరుగుడుగా వ్యక్తీకరించడాన్ని ఒక తప్పనిసరిగా అభ్యసించవలసి వచ్చింది.  ప్రచ్ఛన్నయుద్ధకాలపు అవశేషం ఏదన్నా భారత విదేశాంగ విధానంలో మిగిలిఉన్నదా  అంటే అది పాలస్తీనాకు గుర్తింపును కొనసాగించడంలోను, ఆ దేశానికి  ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని కోరడంలోనూ మిగిలిఉన్నదని చెప్పవచ్చు. &lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: justify;"&gt;అమెరికాపై టెర్రరిస్టు దాడి తరువాత, ఆప్ఘనిస్థాన్‌పై అమెరికా ఆక్రమణయుద్ధం  ప్రారంభించినప్పుడు, ఇరాక్‌పై దండెత్తినప్పుడు, ఇరాన్‌పై ఆంక్షల కోసం  ప్రయత్నించినప్పుడు, తాజాగా గడాఫీని హతమార్చినప్పుడు - భారత్ అధికారిక  ప్రతిస్పందనలు ఒకే రకంగా ఉన్నాయి. గడాఫీ హత్యను కానీ, ఆయన హయాంలో భారత్‌తో  ఉన్న సంబంధాల గురించి కానీ ప్రస్తావన ఏమీ లేకుండా- లిబియా  పునర్నిర్మాణానికి అవసరమైన సహాయం చేస్తామని మాత్రం ఇండియా ప్రకటన చేసింది.  గడాఫీ అధికార భ్రష్ఠుడైన వెంటనే భారత్, జాతీయ పరివర్తనా మండలి  (టిఎన్‌సి)తోనే దేశరాజకీయ, ఆర్థిక పునర్నిర్మాణానికి సహాయపడతామని హామీ  ఇచ్చింది.  చమురు, గ్యాస్ ఉత్పత్తులు కాకుండా, లిబియాకూ భారత్‌కూ సాలీనా వంద కోట్ల  డాలర్ల మేరకు వాణిజ్యం సాగుతోంది. అక్కడ అంతర్యుద్ధం ప్రారంభం కాకముందు  సుమారు 20 వేల మంది భారతీయులు నివాసం ఉండేవారు. వారందరినీ మార్చినెలలోనే  స్వదేశానికిి సురక్షితంగా తరలించారు. రెండుదేశాల మధ్య ప్రగాఢమైన స్నేహం  ఉన్నదని చెప్పలేము కానీ, ఒక సదవగాహన ఉండేది. 1984లో ఇందిరాగాంధీ లిబియాను  సందర్శించడమే ఆ దేశానికి మన నేతల ఆఖరి పర్యటన. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో  పశ్చిమాసియా విషయంలోను, వివిధ జాతీయ విముక్తి ఉద్యమాల విషయంలోను భారత్  వైఖరితో ఏకీభావం ఉన్నందున లిబియాతో నాడు స్నేహానికి ఆస్కారం ఉండింది.  భారత్ ఇంధన అవసరాల రీత్యా ఉభయదేశాల మధ్య వాణిజ్యసంబంధం పటిష్టమయింది.  అయితే, ఇటీవలి కాలంలో గడాఫీ, భారత్‌ను ఇబ్బందిపెట్టే వైఖరులు కొన్ని  తీసుకున్నారు. కాశ్మీర్ స్వతంత్రదేశం అయితే బాగుంటుందని ఐక్యరాజ్యసమితిలో  వాదించారు. ఈ ఏడాది తనపై తిరుగుబాటు చేసిన ప్రజలపై అణచివేత &lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;చర్యలను  సమర్థించుకోవడానికి కాశ్మీర్ ప్రస్తావన మరోసారి తెచ్చారు. భారత్ కాశ్మీర్  విషయంలో ఏమి చేస్తోందో తానూ అదే చేస్తున్నానని వాదించారు.  గడాఫీ తాజా వైఖరులు ఏమైనప్పటికీ, ఇద్దరిమధ్యా గొప్పస్నేహం లేనప్పటికీ-  అతని మరణంపైనా, అక్కడి పరిణామాలపైనా భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్పి  ఉండవలసింది. లిబియాలో జరిగింది సమర్థనీయం కాదని భారత్ నేతలకు అంతరాంతరాల్లో  తెలియదని కాదు. కానీ, మౌనమే దౌత్యనీతి అయిన సందర్భం ఇది. అగ్రరాజ్యానికి  ఆగ్రహం తెప్పించలేము, అలాగని, వెనుకటి వైఖరులనుంచి పూర్తిగా జారిపోనూలేము. &lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: justify;"&gt;హిందూమహాసముద్రాన్ని అణ్వస్త్ర రహిత మండలంగా ప్రకటించాలని భారతదేశం పదే పదే  అంతర్జాతీయవేదికల మీద గగ్గోలుపెట్టిన కాలం ఇప్పటి తరానికి తెలియదు.  హిందూమహాసముద్రాన్ని తానే కాపలా కాస్తానని, సోమాలియా పైరేట్లను పిట్టలను  కాల్చినట్టు కాలుస్తానని ప్రగల్భాలు పలికే భారతదేశమే ఇప్పటివారికి తెలుసు.  భారత్‌కు సుదూరంగా, హిందూమహాసముద్రంలో అక్కడెక్కడో ఒక దీవిలో అమెరికా  స్థావరం ఏర్పరచుకుంటేనే దాన్నొక ఆత్మగౌరవసమస్యగా భావించిన కాలం పోయి,  డబ్బిచ్చి ఎంపీలను కొని అయినా సరే, అణ్వస్త్ర ఒప్పందానికి అంగీకారం సాధించి  అమెరికాను మెప్పించాలనుకునే కాలం వచ్చింది.  ఇప్పుడు అగ్రరాజ్యాల విస్తరణవాదాన్ని ఖండించే ఉద్దేశ్యంకానీ, శక్తి కానీ  భారత్‌కు లేవు. అలాగని, అంతర్జాతీయ సమాజంలో భారత్‌కు ప్రతిష్ఠ తెచ్చిన  గతకాలపు వైఖరులను పూర్తిగా వదులుకునే ధైర్యమూ లేదు. అందుకే, లిబియాపై  ఆంక్షల వరకు అంగీకరించింది కానీ, లిబియా గగనతలాన్ని 'నోఫ్లైజోన్' గా  ప్రకటించడంతో సహా 'అవసరమైన అన్ని చర్యలనూ' తీసుకోవచ్చునని భద్రతామండలిలో  తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. &lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: justify;"&gt;లిబియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం ఉన్నప్పుడు,  గడాఫీ మరణానంతరం ఆ విషయాన్ని సూత్రప్రాయంగానైనా భారత్ చెప్పి ఉండవలసింది.  చెప్పలేదు. ఇరాక్‌కు, ఆఫ్ఘనిస్థాన్‌కు, లిబియాకు పట్టిన దుర్గతి భారత్‌కు  ఎన్నడూ రాదు అన్న ధీమా కావచ్చు. తటస్థతే శ్రీరామరక్ష అన్న లౌక్యమూ కావచ్చు.  లిబియాలో తడాఖా చూపించిన తరువాత, ఇక సిరియా, అల్జీరియా వంటి దేశాల్లో  కార్యక్రమాలు మొదలుకావచ్చు. ఇరాక్‌లో పనిపూర్తయిందని, ఈ సంవత్సరాంతానికి  ఉపసంహరించు కుంటున్నామని శుక్రవారం నాడు ఒబామా ప్రకటించారు కాబట్టి,  అమెరికా మరో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టవచ్చు. ఏమిటా ప్రాజెక్టు?  పాకిస్థానా? హిల్లరీ క్లింటన్ ఇస్లామాబాద్‌లో హడావుడిగా అర్థరాత్రి జరిపిన  పర్యటనలో చేసిన హెచ్చరికలను పాక్‌పాలకులు పట్టించుకుని దారికి వస్తే సరే,  లేకపోతే, ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లోని వజీరిస్థాన్ ప్రాంతంపై బాంబుల వర్షం  కురియవచ్చు.  పదిహేను రోజులుగా అమెరికా-పాక్ దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతూ ఉన్నది. తమపై  దాడి జరుగుతుందన్న భయం పాక్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. బింకంతో  మేకపోతు గాంభీర్యంతో పాకిస్థాన్ బక్కప్రగల్భాలు పలుకుతూనే ఉన్నది. తన దగ్గర  అణ్వాయుధాలున్నాయన్న మాటను నేరుగా చెప్పకపోయినా, ఆ హెచ్చరికల్లో  అంతర్లీనంగా వినిపిస్తూనే ఉన్నది. ఆప్ఘనిస్థాన్‌నుంచి కూడా ఉపసంహరించుకుని,  ఆర్థిక వ్యవస్థను కాస్త మెరుగుపరుచుకుని వచ్చే ఎన్నికలమీద దృష్టిపెట్టాలని  ఒబామా భావిస్తూ ఉండవచ్చు.  ఆప్ఘన్‌ను పూర్తిగా విడిచిపెట్టాలంటే, తాలిబన్లను నిర్మూలించడమో, రాజీకి  రప్పించడమో జరగాలి. తాలిబన్లకు, హక్కానీ నెట్‌వర్క్‌కూ బలమైన స్థావరంగా  మారిన పాక్ వాయవ్యప్రాంతంపై విచక్షణారహితమైన దాడులు జరగకపోతే, ఆప్ఘన్‌లో  అమెరికావ్యతిరేకులపై ఒత్తిడిపెరగదు. ఈ పరిస్థితి పాక్‌కు ప్రాణాంతకంగా  మారింది. పాక్‌మీద అమెరికా దాడి చేస్తే భారత్ వైఖరి ఏమిటి? &lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: justify;"&gt;భారత్‌లో ఉగ్రవాద చర్యలకు కారణం కాబట్టి, పొరుగుదేశం బలహీనపడడం మంచిదే  కాబట్టి, పాక్‌పై దాడిని భారత్ సమర్థించాలా? అంత దగ్గరగా వచ్చినవాడు రేపు  ఢిల్లీ మీద పడబోడని నమ్మకం ఏమిటని వ్యతిరేకించాలా? ప్రాదేశిక రాజకీయాల్లో  ఒకరికొకరు శత్రువులైపోతే, అగ్రరాజ్యాలకు ఎంతటి అనువైన వాతావరణం  ఏర్పడుతుందో ప్రస్తుత భారత ఉపఖండాన్ని చూస్తే అర్థం అవుతుంది.  'పెరట్లో పాములను పెంచుకుంటూ, అవి పొరుగువారిని మాత్రమే కాటేస్తాయని  అనుకోగూడదు' అని హిల్లరీ పాక్ విదేశాంగ మంత్రిని హెచ్చరించారు. హక్కానీ  నెట్‌వర్క్ మొదట సిఐఎ సృష్టించిన సంస్థేనని ఆమె మరచిపోయి ఉండవచ్చు. ఆమె  చెప్పదలచుకున్నది ఒకటే- ఎవరింట్లో పాములనయినా తాము వచ్చి పట్టి చంపేస్తాము.  ఏవి వానపాములో, ఏవి నాగుబాములో నిర్ణయించేది మాత్రం తామే. ఇవాళ, అమెరికా  దృష్టిలో పాములు వజీరిస్థాన్‌లో ఉన్నాయి. రేపు ఉత్తరప్రదేశ్‌లోనో,  ఛత్తీస్‌గఢ్‌లోనో కూడా ఉండవచ్చు. &lt;/div&gt;&lt;br /&gt;&lt;div style="text-align: justify;"&gt;భారత్‌కు కూడా అటువంటి పరిస్థితి ఎదురయితే ఎట్లా అనే ప్రశ్న మన పాలకులకు  ఎందుకు రాదంటే, వారు దేశాన్ని బడుగుదేశంగా, బక్కదేశంగా భావించడం మానేశారు.  వేటకుక్కలతో పాటు పరిగెడుతూ, తామే వేటాడుతున్నామని భ్రమపడుతున్నారు.  ఇరాక్‌లో, ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా చేసిన విధ్వంసం నుంచి జరుగుతున్న  పునర్నిర్మాణంలో మనకూ ఒక చిన్న కాంట్రాక్టు దొరుకుతుందని ఆశించినట్టే, రేపు  లిబియా విధ్వంసంలోనూ నాలుగు డాలర్లు వెదుక్కునే ప్రయత్నం చేస్తారు.  పాకిస్థాన్‌ను సర్వనాశనం చేస్తే, ఉపఖండంలో మనదే రాజ్యం అని కలలు  కంటున్నారు.  డీగోగార్షియాలో కాదు, వాడు రేపు మన పొరుగునే తిష్ఠ వేయబోతున్నాడని, అర్థం  చేసుకోలేకపోతున్నారు. భౌగోళిక ప్రపంచ రాజకీయాలలో అత్యంత వ్యూహాత్మక  స్థానంలో అమెరికాకు స్థావ రం దొరికితే, అది దశాబ్దాల పాటు స్థిరంగా  నిలిచిపోతుందని గుర్తించలేకపోతున్నారు. నిశ్శబ్దంగా బలం కూడగట్టుకుంటున్న  చైనాకు చెక్ పెట్టడానికి భారత్‌ను పావుగా వాడుకునే ప్రయత్నమూ జరుగుతోందని  తెలిసినా తెలియనట్టు ఉంటున్నారు. పొరుగింట్లో పాములుంటేనే కాదు, అగ్గి  రగిలితే కూడా ఇరుగింటికి ప్రమాదమే!&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4789686514374734233?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4789686514374734233/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_24.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4789686514374734233'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4789686514374734233'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_24.html' title='పొరుగింటికి పాకిన అనకొండ'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-7995100780588967665</id><published>2011-10-19T08:24:00.000-07:00</published><updated>2011-10-19T08:24:45.759-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Articles 19Oct2011'/><title type='text'>'సకలం' సశేషం, పాఠాలు అనేకం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;   &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;  సకల జనుల సమ్మె చరమాంకానికి వచ్చింది. విరమణ కాదు వాయిదా అని సమ్మెసంఘాలు  చెబుతున్నాయి కానీ, అవి ఆత్మసంతృప్తికి చెపుకుంటున్న మాటలే. నెలరోజులకు  పైగా సాగిన ఒక చరిత్రాత్మక ఘట్టం ముగింపునకు వచ్చిందన్నదే వాస్తవం. సమ్మెలు  సడలుతున్న సమయంలో కూడా ఒక రోజు తెలంగాణ బంద్‌ను విజయవంతంగా నిర్వహించడం,  విరమణ వల్ల కలుగుతున్న ఆశాభంగాన్ని సమర్థంగా తెలంగాణ ప్రాంత మంత్రుల మీదకు  మళ్లించడం- ఉద్యమస్ఫూర్తికి నష్టం కలగకుండా నాయకత్వం అనుసరించిన ఎత్తుగడలే.&lt;br /&gt;&lt;br /&gt;అయితే, ఈ సకలజనుల సమ్మె పోరాటంలో గెలిచిందెవరు? ఓడిందెవరు? - ఈ ప్రశ్నలు  తప్పనిసరిగా ముందుకు వస్తాయి, వస్తున్నాయి.  ఒక సుదీర్ఘ ఉద్యమంలో ఒక ఘట్టం ఫలితాన్ని బట్టి, ఓటమిగెలుపులను  నిర్ణయించవచ్చునా? అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. అంతిమదశలో మాత్రమే  చేపట్టవలసిన బ్రహ్మాండమైన ఉద్యమరూపాన్ని సమయం కాని సమయంలో రాజకీయ జెఎసి  ప్రయోగించడం సరిఅయినదేనా? ఈ దశలో ఈ ఉద్యమరూపం ఫలితం ఇట్లాగే ఉండబోతుందని  నాయకత్వానికి తెలియదా? విశాల ప్రజానీకం స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్న  ఉద్యమం విషయంలో రాష్ట్ర పాలనాయంత్రాంగం, అధికార పక్షం వ్యవహరించిన తీరు  సరిఅయినదేనా? సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం, పాలకపెద్దలు అనుసరించిన  సందేహాస్పదమైన ఎత్తుగడలు, భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఎటువంటి ప్రభావం  వేయనున్నాయి? &lt;br /&gt;&lt;br /&gt;ప్రశ్నలూ సందేహాలూ ఎలాగూ వస్తాయి కానీ, ఒక ఉద్యమం నుంచి మొత్తం సమాజం  నేర్చుకోదగినవి ఎన్నో ఉంటాయని కూడా గుర్తించాలి. ఒక ప్రాంతానికి చెందిన  ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి ఏఏ పద్ధతులను అనుసరించారు, ఆ  వ్యక్తీకరణను భగ్నం చేయడానికో, బలహీనపరచడానికో ప్రభుత్వాలు, వ్యతిరేకులు ఏ  వ్యూహాలను పాటించారు- అన్న అంశాలు- భవిష్యత్తులో జరిగే (తెలంగాణకు అనుకూల  నిర్ణయం వస్తే, సీమాంధ్ర ప్రాంత ప్రజలు చేయాలనుకుంటున్న ఉద్యమాలతో సహా)  అన్ని ఉద్యమాలకూ &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;పాఠాలుగానే పనికివస్తాయి.  సమ్మెల వల్ల సమాజానికి కలిగే ఇబ్బందులను సామాజిక న్యాయదృష్టితో చూడడం ఈ  సమ్మెతోనే మొదలయింది. భవిష్యత్తులో అన్ని ప్రజా ఉద్యమాలకూ ఈ దృష్టిని  అన్వయిస్తే, పోరాటాల తీరే మారవలసి వస్తుంది. సకలజనుల సమ్మె సందర్భంగా  చర్చకు వచ్చిన ఇటువంటి అనేక అంశాలు, మొత్తం సమాజం అనుభవసంపుటిలో భాగం  అవుతాయి, కొత్త విలువల అవతరణకు దోహదం చేస్తాయి. &lt;br /&gt;&lt;br /&gt;సకలసమ్మెలో ముఖ్యమైన విశేషం- ఒక రాజకీయమైన ఆకాంక్షకు మద్దతుగా  ఉద్యోగవర్గాలు ఆందోళనకు దిగడం. వేతనాల గురించి, పని పరిస్థితుల మెరుగుదల  గురించి ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలం సమ్మెకుదిగడం మనకు అనుభవమే కానీ,  రాష్ట్రవిభజన వంటి రాజకీయ నిర్ణయాన్ని కోరుతూ వివిధ శ్రేణుల ఉద్యోగులు,  కార్మికులు, సంస్థలు సమష్టిగా ఉద్యమించడం అరుదైనది.  అనేక అంచెల సామాజిక వ్యవస్థ, అంతరాల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఒక ప్రాంతంలో,  భిన్న వర్గాల మధ్య ఇంతటి ఉద్యమ ఐక్యత కూడా మునుపెన్నడూ కనిపించలేదు.  ఉద్యమనాయకత్వం మీద అనేక ఫిర్యాదులు, అసంతృప్తులు ఉన్నప్పటికీ, వివిధ సమాంతర  ఉద్యమసంస్థలు, బృందాలు ఉమ్మడి లక్ష్యం మీద ఏకాగ్రతతో వ్యవహరించిన  సందర్భాలు కూడా అరుదు. &lt;br /&gt;&lt;br /&gt;సకలజనుల సమ్మె- నిష్ఫలంగా ముగిసినప్పటికీ, ఉద్యమంలో మాత్రం నిస్ప­ృహ  కనిపించడం లేదు. ప్రతిరోజూ ఇద్దరోముగ్గురో యువకులు ఆత్మహత్యలు చేసుకునే  విషాదం కొనసాగుతూనే ఉంది కానీ, సకలసమ్మెను సుదీర్ఘకాలం కొనసాగించగలుగుతున్న  సంతృప్తి అధికసంఖ్యాకులను ఉత్తేజపరుస్తూ వచ్చింది. మరింత కాలం నిరీక్షణకు,  మరింత విస్త­ృతమైన ఉద్యమనిర్మాణానికి సంసిద్ధత, సంకల్పం గట్టిపడుతూ  వచ్చాయి. సమ్మె సగానికి వచ్చేటప్పటికే, కేంద్రప్రభుత్వం నుంచి కీలకమైన  స్పందన ఏదీ త్వరలో రాబోవడం లేదన్నది ఉద్యమశ్రేణులకు అర్థమైపోయింది.  విఫలమవుతున్న పోరాటరూపాన్ని పట్టుకువేలాడడం కంటె, మరోదారిలోకి మళ్లడం  మంచిదని, అయితే, అది గౌరవప్రదమైన పద్ధతిలో ఉండాలని ప్రతిపాదనలు  మొదలయ్యాయి. ఢిల్లీలో ఏమి ఉపదేశాలు లభించాయో తెలియదు కానీ, గత దసరాపండగ  నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో చాణక్యం మొదలయింది. ఆర్టీసీలో చేసిన  తొలిప్రయత్నం విఫలమయింది కానీ, మలివిడత రైల్‌రోకోను భగ్నం చేయడంలో  ప్రభుత్వం విజయం సాధించింది. ఇంతలో దీర్ఘకాలం బడులు మూసివేయడం గురించి  రకరకాల శిబిరాల నుంచి ఉద్యమం మీద విమర్శ మొదలయింది.  ఇరవయ్యోతారీకు దాకా సమ్మె సాగితే తెలంగాణలో ఉద్యమకారుల మీద ప్రజలే  తిరగబడతారు అని కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, అటువంటి  అంతర్గత విభజనను తీసుకువచ్చే ప్రయత్నమేదో గట్టిగానే సాగిందని అర్థమవుతుంది.  వీటన్నిటిని సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ  వర్గాల వారు అర్థం చేసుకుని, దృఢంగా నిలబడడం ఆశ్చర్యమే. అందువల్లనే వారి  శక్తి సన్నగిల్లిన తరువాత, సమ్మె విరమణ కోసం మార్గాలను వెదుక్కోవడాన్ని  ఎవరూ తప్పుపట్టలేకపోయారు. నిజానికి వారు రాజీనామా చేసిన సకల రాజకీయపార్టీల  ప్రజాప్రతినిధులకు మద్దతుగా సమ్మె ప్రారంభించారు. వారు మాత్రమే పోరులో  దూకితే, రాజకీయులు ఒడ్డునే ఉండిపోయారు. &lt;br /&gt;&lt;br /&gt;సమ్మె ఔచిత్యాన్ని ప్రశ్నించినవారే, తెలంగాణ గురించి ఏ హామీ లేకుండా ఎందుకు  విరమించినట్టు అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయదృష్టితో చూసినప్పుడు అటువంటి  ప్రశ్నలు తలెత్తడం సహజమే. సమ్మె ఉపసంహరణ లేదా వాయిదా- అన్నది  ఉద్యమలక్ష్యానికి తగిలిన దెబ్బగా అభివర్ణించేవారు కొందరుంటే, నాయకత్వ  వైఫల్యంగా చెప్పేవారు కొందరుంటారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు అయితే,  పంతం పట్టినట్టుగానే కనిపించింది. ఏదో ఒక లక్ష్యం కోసం ఉద్యమం బాటలో ఉన్న  ప్రజలతో ప్రభుత్వయంత్రాంగం పోటీపడడం మంచిది కాదు.  ప్రభుత్వం తరఫున తన వంతు బాధ్యత నిర్వహించినప్పటికీ, ఒక్క బొత్స సత్యనారాయణ  మాత్రమే, సమ్మె విరమణ వల్ల ఉద్యమ ఆకాంక్ష వీగినట్టు కాదు అన్న వ్యాఖ్య  చేసి, ఉద్యోగవర్గాలను కూడా గౌరవించారు. మెట్టరైతులకు విద్యుత్‌కొరతను  కల్పించి, అందుకు సమ్మెదే బాధ్యత అన్నట్టు వ్యవహరించడం దగ్గరనుంచి,  ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పోటీ పెట్టడం దాకా- ప్రభుత్వ వ్యవహారం  ఎత్తుకు పైఎత్తు పద్ధతిలోనే సాగింది తప్ప, సామరస్య పూర్వకంగా లేదు. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ ప్రజలకు ఈ సమ్మె కాలంలో కలిగిన రాజకీయజ్ఞానోదయం చిన్నది కాదు.  ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలుకానీ, కేంద్రప్రభుత్వం కానీ  ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఒక ఉద్యమాన్ని ఎంతగా అలక్ష్యం చేయగలవో ఈ సమ్మె  నిరూపించింది. సమ్మె ప్రభావాన్ని నిరాకరించడం దగ్గర నుంచి మొదలుపెట్టి,  హడావుడి సంప్రదింపుల ప్రదర్శనదాకా కాంగ్రెస్ పెద్దలు చూపిన దారుణమైన  వైఖరి సులువుగానే అర్థమయింది. ఎంపీలు కొద్దిమెరుగే కానీ, రాష్ట్ర  కాంగ్రెస్ శాసనసభ్యులు, మంత్రులు ప్రజల దృష్టిలో బాగా పలచన అయ్యారు.  నాలుగుగోడల మధ్య సమావేశాల్లో తప్ప మరెందుకూ పనికిరాని పదవులను వారు ఎందుకు  పట్టుకువేలాడుతున్నారో అర్థం కాదు. లాబీయింగ్‌ద్వారానే తెలంగాణ సాధ్యం అన్న  వైఖరి నుంచి, ప్రజా ఉద్యమాలను అప్పుడప్పుడు తన ప్రాబల్యాన్ని  పెంచుకోవడానికి వినియోగించుకునే దాకా మారుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్రసమితికి  ఇంకా పోరాటం మీద పూర్తి విశ్వాసం కలిగినట్టు కనిపించదు. 'అన్నీ ఆయనకు  తెలుసును' అని ప్రధానమంత్రి తెలంగాణ ప్రతినిధివర్గంతో పదే పదే అన్న మాటలు  కెసిఆర్ వైఖరిపై అనేక సందేహాలను కలిగించాయి.  ఎన్నికలు వచ్చి, పదేపదే గెలవడం ద్వారానే ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని,  2014 దాకా అదే పద్ధతిలో కొనసాగితేనే ఫలితం ఉంటుందని టిఆర్ఎస్ నమ్ముతోందని  అనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ ఒకానొక భాగస్వామి మాత్రమేనని,  పరిణామాలను శాసించగలిగిన ఇతర రాజకీయ, రాజకీయేతర శక్తులు అనేకం ఉన్నాయని  సకలజనుల సమ్మె నిరూపించింది. అన్ని శక్తులను కలుపుకుని మరింత బలమైన  సంఘటనగా ఏర్పడడానికి రాజకీయ జెఎసి ప్రయత్నించవలసి ఉన్నది. కోదండరామ్‌ను  ఉద్యమశ్రేణులు తగినంతగా గౌరవిస్తున్నప్పటికీ, ఆయన నుంచి మరింత  స్వతంత్రమైన, అందరినీ కలుపుకుని పోయే వైఖరిని కూడా వారు ఆశిస్తున్నారు&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-7995100780588967665?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/7995100780588967665/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_19.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/7995100780588967665'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/7995100780588967665'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_19.html' title='&apos;సకలం&apos; సశేషం, పాఠాలు అనేకం'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-558973067751272543</id><published>2011-10-11T09:24:00.000-07:00</published><updated>2011-10-11T09:24:04.077-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 09 Oct 2011'/><title type='text'>నేరం చరిత్రదే కాదు, కాంగ్రెస్‌దీ!</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; ప్రణబ్ ముఖర్జీ గారికి కోపం వచ్చింది. తాను అనని మాటలను అన్నట్టు మీడియా  రాస్తోందని ఆయన మొహం మాడ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే భవిష్యత్తులో  మరిన్ని సమస్యలు వస్తాయని ఆయన అన్నట్టుగా పత్రికల్లో టీవీల్లో వచ్చింది.  పాపం నిజంగానే ఆయన అట్లా అనలేదు. ఆయన మాటల్ని దారితప్పించింది తెలుగు  మీడియా కాదు, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్న ఎన్డీటీవీయే అట్లా వార్తలు విడుదల  చేసింది. ఇంతకూ ప్రణబ్ ఏమన్నారు? 'విస్త­ృత దృష్టితో చూస్తే భవిష్యత్తులో  మరిన్ని సమస్యలు తలెత్తుతాయి, ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటులో ఒక  పద్ధతిని అనుసరించలేదు. &lt;br /&gt;&lt;br /&gt;గత నాలుగైదువందల ఏళ్ల చరిత్రలోనూ వర్తమానంలోనూ కూడా ఒక పద్ధతంటూ లేదు..'  ఇట్లా చెప్పుకుపోయారు. ఈ మాటలకు ముందు తెలంగాణ సమస్య పూర్వాపరాలను ఆయన  పేర్కొన్నారు. అందువల్ల, ఆ సమస్యలేవో తెలంగాణ వల్ల వస్తాయన్నట్టుగా  అర్థమయ్యి ఉండవచ్చు. కానీ, ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో ఏవో విధాన నిర్ణయాలు వె  ల్లడించే ధోరణిలోనో, అలవోక వ్యాఖ్యలు చేసే ధోరణిలోనో మాట్లాడలేదు. ఒక చర్చా  ధోరణిలో, సైద్ధాంతిక దృష్టితో, బెంగాలీ బాబు లాగా మాట్లాడారు.  సంచలనాత్మకతలో కొట్టుకుపోయి ఉండకపోతే, ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన  చర్చనీయమైన అంశాలు మీడియాకు కనిపించి ఉండేవి. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ సమస్యకు చరిత్రలోను, సమీపగతంలోను, వర్తమానంలోను మూలాలు ఉన్నాయని  ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో సూచించారు. అసలు భారతదేశంలో అంతర్గత పరిపాలనా  యూనిట్లు ఏర్పడిన క్రమమే క్రమపద్ధతిలో లేదని ఆయన చెప్పారు. ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటు, సమైక్యంగా కొనసాగడం- అనే రెండు మార్గాల మధ్య పోరుగా  పరిణమించిన ప్రస్తుతసమస్య ఉధృతిలో మూలకారణాల పరామర్శ, చర్చ ఈ మధ్య  అణగారిపోయాయి. తెలంగాణ ఉద్యమమంటే, స్వార్థపర రాజకీయశక్తుల సృష్టి అని,  దానికి భౌతిక పునాది ఏమీ లేదని, విద్వేషపూరితమైనదని వ్యతిరేకులు  విమర్శిస్తుంటారు.  ప్రాంతీయ అసమానతలనేవే లేవని, అంతా సజావుగానే ఉన్నదని, &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ప్రస్తుత పరిస్థితిని  అణుమాత్రం కూడా మార్చనవసరం లేదని వాదిస్తుంటారు. పూర్వాపరాలు తెలియకుండా  ఎవరైనా అటువంటి వాదనలు చేస్తే అర్థం చేసుకోవచ్చును కానీ, తెలిసి తెలిసి ఒక  ఎత్తుగడగా అటువంటి వైఖరి అనుసరిస్తే అది సమస్యను మరింత క్లిష్టం  చేస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు. ప్రణబ్ తెలంగాణ సమస్యను దాని వర్తమాన  ప్రభావానికి అతీతంగా వస్తుగతంగా, చారిత్రకంగా చూసే ప్రయత్నం చేశారు.  మొదటి ఎస్సార్సీ కాలం నుంచి తెలంగాణ సమస్య ఉన్నదని ఉద్యమకారులు  చెబుతున్నదాన్ని ప్రణబ్ నిర్ధారిస్తున్నారు. అయితే, రాష్ట్రాల ఏర్పాటు  చరిత్రగతిలో అవకతవకగా జరిగిందని ఆయన చెప్పడం, అందుకు బాధ్యులెవరో  గుర్తించడానికి ఉపకరించదు. 'విధి', 'కాలం' అనే అమూర్త శక్తులు కొన్ని  అనుకోని మలుపులకు కారణమైతే అయి ఉండవచ్చును కానీ, తెలంగాణ సమస్యకు,  స్వాతంత్య్రానంతరం అంతర్గత పాలనాయూనిట్లకు సంబంధించిన సమస్యలకు - ప్రధాన  బాధ్యత కాంగ్రెస్‌పార్టీయే వహించవలసి ఉంటుంది. &lt;br /&gt;&lt;br /&gt;నాగరికతల ఆదిమదశలో నదీతీరాల వెంట మానవుల సాంఘిక జీవనానికి బీజాలు పడ్డాయి.  సమగ్రమైన సహజవనరుల వ్యవస్థలు ఉన్న చోట స్థిరనివాసాలు ఏర్పడ్డాయి. వనరుల  ఆధిపత్యం కోసం జరిగే పోరు, మానవ ఉత్పాదకతల్లో వచ్చిన మార్పులు రాజ్యాలను  ఏర్పరచాయి. పరస్పర యుద్ధాల్లో, బలవంతుడిదే పైచేయి అయిన క్రమం రాజ్యాల  రూపురేఖలను సరిహద్దులను నిర్ణయించాయి. అంగవంగ కళింగ ఛప్పన్నారు దేశాల  భరతఖండంలో మహాసామ్రాజ్యాలూ వర్ధిల్లాయి, చిన్న చిన్న రాజ్యాలూ  మనుగడసాగించాయి.  యూరోపియన్లు మన దేశంలో ప్రవేశించిన తరవాత, భారతీయ రాజ్యాల అంతఃకలహాలు,  బలాలు, బలహీనతలు అంతర్గత పటాలను మార్చివేశాయి. 1857 మొదటి  స్వాతంత్య్రపోరాటం తరువాత బ్రిటిష్ వలసవాదులు కొత్త ఆక్రమణలను  విరమించుకున్న తరువాత, ఒక స్ధిర రాజకీయపటం ఏర్పడింది. స్వాతంత్య్రంతో పాటు,  ఐదువందల చిన్నా చితకా సంస్థానాలు విలీనమూ జరిగింది. ఆంగ్లేయ వలసవాద  అభివృద్ధి జరిగిన ప్రాంతాలూ, సంస్థానాధీశుల పాలనలో అణగారిపోయిన రాజ్యాలూ  కలగలసి రాష్ట్రాల అవతరణ జరిగింది.  చెప్పినంత సులువుగా జరిగింది కాదీ ప్రక్రియ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని  తెలుగువారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షను 1913 నుంచి వ్యక్తం  చేస్తూ వచ్చారు. అట్లాగే, అనేక ఇతర ప్రొవిన్సుల్లోనూ భాషావర్గాలు సంఘటితం  కావడం మొదలయింది. వలసపాలన చివరి దశాబ్దాల్లో బ్రిటిష్‌పాలిత ప్రాంతాల్లో  ప్రజాస్వామ్యీకరణ, విద్యావ్యాప్తి, స్వాతంత్య్రానంతర స్థితిగతులపై  ముందుచూపు మొదలయ్యాయి. 1928లోనే కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ  అధ్యక్షతన ఒక కమిటీ వేసి, భాషాప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా  తీర్మానించింది. &lt;br /&gt;&lt;br /&gt;ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించిన జవహర్‌లాల్‌నెహ్రూ, స్వాతంత్య్రం  వచ్చిన వెంటనే భాషాప్రయుక్తరాష్ట్రాల ప్రతిపాదనను అటకెక్కించే ప్రయత్నం  చేశారు. భారతయూనియన్‌లో భాగస్వాములయ్యే వివిధ జాతులకు స్వయంప్రతిపత్తి  ఇస్తామని, రాష్ట్రాలకు విస్త­ృతాధికారాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్,  తరువాత పునరాలోచనలో పడింది. భాషాజాతీయత బలపడితే, భారతజాతీయత బలహీనపడుతుందని  భావించింది. భాషాజాతీయ రాష్ట్రాల పాలనలో భాషామైనారిటీలకు రక్షణ ఉండదని  వాదించింది.  భాషారాష్ట్రాల ప్రతిపాదనకు ససేమిరా అన్న నెహ్రూ పొట్టి శ్రీరాములు  ఆత్మాహుతి తరువాత, ఆంధ్రరాష్ట్రాన్ని హడావుడిగా ప్రకటించారు, రాష్ట్రాల  పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌నూ నియమించారు. ఆ కమిషన్ సిఫార్సులనయినా పూర్తిగా  అమలు చేశారా? లేదు. తెలుగుప్రాంతాలతో హైదరాబాద్ రాష్ట్రాన్ని విడిగా  కొనసాగించడమే మంచిదని ఫజల్ అలీ కమిషన్ చెప్పినా విశాలాంధ్రను ఏర్పరచారు.  మహారాష్ట్రను, గుజరాత్‌ను వేరుచేయాలని చెప్పినా 1960 దాకా చేయలేదు. అందుకు  మళ్లీ పెద్ద ఉద్యమం అవసరమైంది. పంజాబ్‌నుంచి హర్యానాను వేరుచేసే పనిమాత్రం  డిమాండ్ బలపడకముందే కాంగ్రెస్ ఆగమేఘాల మీద జరిపించింది.  అక్కడా చండీగఢ్ కొరివిని మాత్రం మిగిల్చి, పంజాబ్ ఉగ్రవాదానికి బీజం  వేసింది. 1969లో తెలంగాణలో ఉద్యమం వచ్చినప్పుడో, 1973లో ఆంధ్రలో  వచ్చినప్పుడో విభజన నిర్ణయం తీసుకోకుండా కఠినంగా అణచివేసింది. ఇక, 2004లో  టిఆర్ఎస్‌తో పొత్తు ఏర్పరచుకుని మళ్లీ ఆశ కల్పించింది, 2009డిసెంబర్ 9న  విభజన ప్రకటన చేసి ఆపైన వెనక్కి తగ్గింది. &lt;br /&gt;&lt;br /&gt;ఇందులో చరిత్ర చేసిన అన్యాయమెంత, కాంగ్రెస్ పార్టీ వేసిన కుప్పిగంతులెన్ని?  దూరదృష్టి, దేశభవిష్యత్తు గురించిన ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా,  కాంగ్రెస్ పార్టీ ఆపద్ధర్మనిర్ణయాలతో వ్యవహరిస్తూ వచ్చింది. ఒక్కోసారి  సంకుచితమైన దృష్టినీ కనబరచింది. ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుంచి కేరళను  వేరుచేయడానికి నెహ్రూప్రభుత్వం చాలా తటపటాయించింది. తమిళులు మరోభాషాప్రాంతం  తమ రాష్ట్రంలో ఉండకూడదని పట్టుబట్టినందున కేరళను ఏర్పరచవలసి వచ్చింది.  మలయాళీలు ఒక రాష్ట్రంగా ఏర్పడితే కమ్యూనిస్టులు బలపడతారని కాంగ్రెస్ భయం. &lt;br /&gt;&lt;br /&gt;మనుషులు ఏ ప్రాతిపదికమీద కలిసి ఉండాలి, ఒక దేశంలో అంతర్గత పరిపాలనాయూనిట్లు  ఎట్లా ఉండాలి? అన్న ప్రశ్నలకు- కేవలం భాషాపరమైన, ప్రాదేశికమైన  పరిష్కారాలు మాత్రమే ఉండనక్కరలేదు. తాము, తమ సమూహమూ ప్రత్యేక ప్రతిపత్తితో  విడిగా ఉండాలని ఒక సమూహం కోరుతున్నదంటే- అది స్వయంనిర్ణయాధికార కాంక్ష  కిందికి వస్తుంది. బాబా సాహెబ్ అంబేద్కర్ కులప్రాతిపదికపై నియోజకవర్గాలు  కోరారంటే, ప్రాదేశిక నియోజకవర్గాల కింద న్యాయం జరగని వర్గాల సాధికారత కోసం  ఉద్దేశించిన డిమాండ్.  భాష ఆధారంగా ఒక ప్రాంత జనం సంఘటితం కావడం, ఉమ్మడిగా వ్యక్తీకరించుకోవడం  ప్రజాస్వామ్యానికి అనువైనదేనని అంబేద్కర్ గుర్తించారు. అయితే,  భాషారాష్ట్రం కొత్త మైనారిటీలను సృష్టిస్తుందని ఆయన హెచ్చరించారు.  భాషారాష్ట్రాలు పెద్దసైజులో ఉండకూడదని, జాతీయ ప్రభుత్వాలను అదుపుచేసే శక్తి  వాటికి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు తక్షణ  ప్రమాదం ప్రాంతీయ ప్రాబల్యవర్గాల నుంచే ఉంటుందని, వారికి తిరుగులేని  అధికారం సంక్రమించకుండా జాతీయప్రభుత్వం కాపుకాయాలని ఆయన ఉద్దేశ్యం. ఒకే  భాషను వ్యవహరించేవారితో అనేక రాష్ట్రాలు ఏర్పడాలని ఆయన ఆశించారు. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రాల పరిమాణం ఎంత చిన్నగా ఉంటే అట్టడుగువర్గాల వారికి అంతగా  సాపేక్షరక్షణ ఉంటుందని ఆయన సిద్ధాంతం. కాబట్టి, రాష్ట్రాలను భాషాప్రాతిపదిక  అన్నది తిరుగులేనిదేమీ కానక్కరలేదు. భాషప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రాల్లో  ఇతర ప్రాతిపదికల మీద అసంతృప్తి కలగవచ్చు. ప్రాంతీయ అసమానతలు, సాంస్క­ృతిక  విభిన్నత, భౌగోళికమైన సమగ్రత, స్వయంగా పాలించుకోగలిగిన శక్తి  ఏర్పడినప్పుడు- భాషేతర ప్రాతిపదికలు కూడా ప్రత్యేక ఆకాంక్షలకు  దారితీస్తాయి. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను ఉత్తర, దక్షిణ భాగాలుగా  వేరుచేయాలని అంబేద్కర్ ఏనాడో చెప్పినది, 2000 సంవత్సరంలో వాస్తవరూపం  ధరించింది.  జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రెండూ భాషేతర ప్రాతిపదికమీద ఏర్పడిన రాష్ట్రాలే.  అగ్రకులానికి చెందిన కొండజాతి ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి, తమకు  ప్రత్యేక చట్టాలు అవసరమన్న డిమాండ్‌తో ఉత్తరాంచల్ ఏర్పడింది. సంక్లిష్టమైన  చరిత్రనుంచి సంక్రమించిన అనేక సమస్యలు వర్తమానంలో కలవరపరుస్తుండగా, ఇంకా  తెలియని మరెన్నో సమస్యలు నిద్రాణమై ఉన్నాయి. అవన్నీ మున్ముందు బయటపడతాయి.  ప్రణబ్ చెప్పింది అదే. తెలంగాణ సమస్యలో కూడా అటువంటి చరిత్రాంశ ఉన్నది.  స్వాతంత్య్రానంతరం ప్రణబ్ పార్టీ ఆడిన చెలగాటమూ ఉన్నది. తమను తాము  సగౌరవమైన స్థితిలో నిలబెట్టుకోవడానికి, సమానన్యాయాన్ని ప్రాదేశికంగా  సాధించుకోవడానికి తెలంగాణ చేస్తున్న పోరాటం, రేపు అనేక ప్రాంతాలు, అనేక  సామాజికవర్గాలు కూడా చేస్తాయి. &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-558973067751272543?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/558973067751272543/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_11.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/558973067751272543'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/558973067751272543'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_11.html' title='నేరం చరిత్రదే కాదు, కాంగ్రెస్‌దీ!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-3778802065620614217</id><published>2011-10-03T10:45:00.000-07:00</published><updated>2011-10-03T10:45:38.597-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 02 Oct 2011'/><title type='text'>పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;  ఉన్నదున్నట్టు ఉండడం సాధ్యంకాదు, ఏదో ఒకటి చేయవలసిందే. శ్రీకృష్ణకమిటీ  నివేదిక సిఫార్సుల మతలబు ఎట్లా ఉన్నా, దానిలోని సారాంశం మాత్రం అదే.  కాకపోతే, ఆ చేయదగిన వాటిలో మొట్టమొదటిదిగా సమైక్యరాష్ట్రంలో ప్రాంతీయ  కమిటీ ఏర్పాటును సూచించింది. ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఏ చికిత్సలూ లేకుండా  కొనసాగించడం సాధ్యంకాదన్నదే ఆ కమిటీ నిర్ధారణ. ఇప్పుడు ఆజాద్ కూడా అదే మాట  చెబుతున్నట్టున్నారు. ఎంతో రహస్యంగా రూపొందించి, రహస్యంగా చర్చిస్తున్న  నివేదిక 'లోగుట్టు' ఏమిటో తెలియదు కానీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలూ కలసి  ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని బలంగా చెప్పినట్టు తెలుస్తోంది. &lt;br /&gt;&lt;br /&gt;విభజన ఖాయమే అనిపిస్తోంది. కాకపోతే, అటువంటి సూచన ఏదో అధికార స్వరాలలో  పలకకపోతే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న సకలజనుల సమ్మె ఉపశమించేటట్టు లేదు.  సమస్యను సాగదీసినవారే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి కానీ, ఇప్పటికీ అలక్ష్యం  ధ్వనించే వాయిదా మాటలే మాట్లాడుతున్న ఢిల్లీ పెద్దలకు ఆ విజ్ఞత కలుగుతుందో  లేదో తెలియదు. దసరా తరువాత ఆశకు ఆస్కారం కలిగే ఏదో ఒక మాట వినిపిస్తే,  సమ్మె ముగుస్తుంది కానీ, సమస్య అక్కడితో ముగిసిపోదు.  ఎందుకంటే, విభజన తప్పదన్న తెలివిడికి ఎంత ప్రయాస అవసరమయిందో, విభజన  ప్రాతిపదికలపై అంగీకారానికి రావడానికి అంతటి యాతనా తప్పదు. మొదట బయటపడేది  కాంగ్రెస్ అభిమతం, ఆ తరువాత తక్కిన పక్షాలలో కసరత్తు, అందరిమధ్యా  సంప్రదింపులు, చర్చలు, వాదోపవాదాలు, అంగీకారం లేని అంశాలపై &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ఆందోళనలు-  తప్పనిసరి ప్రక్రియ ఇది. రాష్ట్రం కలసి ఉండడం కానీ, రెండుగా విడిపోవడం కానీ  కేవలం భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు కావు. విభజనతో కానీ, సమైక్యంతో  కానీ ముడిపడిన అనేక సామాజికార్థిక రాజకీయ ప్రయోజనాలు సెంటిమెంటులో  అంతర్లీనంగా ధ్వనిస్తున్నాయి.  కలసి ఉండడంలో ప్రయోజనాలున్నవారు సమైక్యాన్ని కోరితే, విడిపోవడంలో  ప్రయోజనాలు చూస్తున్నవారు విభజన కోరుతున్నారు. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన  ప్రాబల్యవర్గాల, రాజకీయవాదుల ప్రయోజనాలు ఎటూ సమైక్యంలో ఉన్నాయి. వారితో  నిమిత్తం లేకుండా కూడా సామాన్య, మధ్యతరగతి ప్రయోజనాలూ కొన్ని సమైక్యంతో  ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయుల  ప్రయోజనాలు విభజనలో ఉన్నాయి.  విశాల ప్రజానీకం కూడా తమ సొంత ప్రయోజనాలను, ఆకాంక్షలను ప్రత్యేక రాష్ట్రంలో  చూస్తున్నారు. రెండు ప్రాంతాలలో రెండు రకాల వర్గాల ప్రయోజనాలు ఒకే  నిష్పత్తిలో ఉన్నాయని కాదు. కానీ, ఇందులో సామాన్యుల ప్రయోజనాలూ ఉన్నాయన్నదే  గమనించవలసిన అంశం. రాష్ట్రవిభజన నిర్ణయం తీసుకునేముందు, లేదా విభజన  ప్రాతిపదికలను నిర్ణయించేముందు సాధారణ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి  తీసుకోవలసిందే. &lt;br /&gt;&lt;br /&gt;అయితే, ఈ ప్రయోజనాలు కేవలం హైదరాబాద్ నగరంతోనే ముడిపడి ఉన్నాయా? అదొక్కటే  మొత్తం సమస్యకు కేంద్రమా? హైదరాబాద్‌లో సీమాంధ్రప్రజల ప్రయోజనాలు  ఉన్నాయన్నది వాస్తవం. రాష్ట్రఅవతరణ జరిగినప్పటినుంచి ఉద్యోగులుగా వచ్చి  ఇక్కడ స్థిరపడినవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు,  ఉత్తరాంధ్రనుంచి, సీమాంధ్రలోని మెట్ట ప్రాంతాల నుంచి శ్రామికులుగా,  వృత్తిపనివారిగా వచ్చి స్థిరపడినవారు పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్‌లో  ఉన్నారు. అలాగే, వ్యాపారులుగా, పారిశ్రామికులుగా స్థిరపడిన వారూ ఉన్నారు.  హైదరాబాద్‌లో కేవలం ఆస్తులను మాత్రమే కూడగట్టుకున్నవారూ ఉన్నారు. వీరంతా  హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడం వల్ల మాత్రమే వచ్చారనుకోలేము.  ప్రభుత్వోద్యోగులు, రాజకీయవాదుల కుటుంబాలు అందువల్లనే వచ్చారనడంలో  సందేహంలేదు. తక్కినవారు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి అపరిమిత అవకాశాలున్న  మహానగరానికి వచ్చారనే భావించాలి. రాష్ట్రావతరణ జరిగి ఐదున్నర దశాబ్దాలు  గడుస్తున్నా, శాస్త్రీయంగా పట్టణప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు  ప్రయత్నించింది లేదు.  ఒకటో రెండో మహానగరాల కంటె, వికేంద్రీకరించిన పట్టణీకరణ సమాజానికి అధికంగా  దోహదం చేస్తుంది. అటు శ్రీకాకుళం నుంచి, ఇటు చిత్తూరు దాకా-  వ్యవసాయసంక్షోభం వల్లనో, ఇతర కారణాల వల్లనో గ్రామాలు వదిలి వచ్చేవారిని  స్వీకరించి ఆదరించగలిగే పట్టణాలులేవు. అందుకే, హైదరాబాద్‌లో పక్కనే ఉన్న  మహబూబ్‌నగర్‌కు చెందినవారూ, దూరాన ఉన్న ఉత్తరాంధ్రకు చెందినవారూ భవన  నిర్మాణ కార్మికులుగా కనిపిస్తారు.  వీరందరికీ రాజకీయప్రతిపత్తితో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆశ్రయాన్నీ,  ఉపాధినీ కల్పిస్తూ పోవలసి ఉంటుంది. హైదరాబాద్ నగరం విస్తరించడానికి,  'అభివృద్ధి' చెందడానికి ఉన్న కారణాలను శాస్త్రీయంగా, చారిత్రకంగా అధ్యయనం  చేయవలసిన అవసరం ఉన్నది. అసలు ఆ అభివృద్ధి ఎంత వరకు ప్రజానుకూలమైనది? కేవలం  ఉన్నతాదాయవర్గాల వారికి అవసరమైన జీవనప్రమాణాలను సిద్ధం చేసుకోవడమే  అభివృద్ధా? అన్నవి చర్చించవలసిన ప్రశ్నలు. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రవిభజన కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఇతర ప్రాంతీయులలో అభద్రత ఏర్పడే  అవకాశం ఉండవచ్చు, దాన్ని అర్థం చేసుకోగలము. విభజన ప్రాతిపదికలలో అవసరమైన  రక్షణలు కల్పించడమే ఆ సమస్యకు పరిష్కారం. సామాన్యులే కాక, సంపన్నులు,  వ్యాపారులు కూడా ఆకస్మిక పరిణామం కారణంగా, రాజకీయ నాయకత్వం మార్పిడి కారణం  దెబ్బతినకుండా, వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉన్నది. తాత్కాలికంగా  కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమా, మరో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకోవడమా- ఏ  పరిష్కారం సమ్మతమో దానికి మార్గం సుగమం కావాలి.  అయితే, సమస్య హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులది మాత్రమేనా?  ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో, వరంగల్, ఖ మ్మం, నల్గొండ,  మహబూబ్‌నగర్‌జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రుల ప్రయోజనాల సంగతేమిటి? వారు  తెలంగాణ రాష్ట్రంలో ధీమాగా ఉండగలుగుతారా? వారు ఉండగలిగితే హైదరాబాద్ వాసులు  ఎందుకు ఉండలేరు? - ఇవీ ప్రశ్నలే. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ఉన్న  సీమాంధ్రుల భద్రత, భవితవ్యం మాత్రమే చర్చనీయాంశా లా? సీమాంధ్ర ప్రాంతాలలోని  ప్రజలకు విభజనతో సమస్యలేమీ లేవా? &lt;br /&gt;&lt;br /&gt;సీమాంధ్రలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ హైదరాబాద్ ఒక తప్పనిసరి గమ్యం.  ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయి మరి. కొత్త రాజధాని ఏర్పాటైనా అది ఆ  అవసరాన్ని తీరుస్తుందని చెప్పలేము. ఎందుకంటే, ఏదైనా ఒక పట్టణం రాజధాని  కావడం వల్ల కాక, దానికున్న మౌలికసదుపాయాల వ్యవస్థ, భూముల అందుబాటు,  నైసర్గిక అనుకూలతల కారణంగా విస్తరిస్తుంది. &amp;nbsp; సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దూరదృష్టితో, వివేకంతో వ్యవహరించి  ఉపాధిఅవకాశాల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటుందనుకుందాం, అయితే దానికి సమయం  పడుతుంది. అప్పటిదాకా హైదరాబాద్ వారికి అందుబాటులో ఉండాలి. మరి ఇన్ని  అవకాశాలను కల్పిస్తూ పోతే, తెలంగాణ యువకుల సంగతేమిటి? అన్న ప్రశ్న  అనివార్యంగా వస్తుంది. చిన్నవో చితకవో సీమాంధ్ర లో అనేక పట్టణాలున్నాయి.  తెలంగాణ పరిస్థితి అది కాదు. వారికి హైదరాబాద్ లేకపోతే, ఉపాధి అవకాశాలు  మృగ్యం. అంటే, హైదరాబాద్ ఆదాయాన్ని పంచుకున్నట్టే, ఇతర అవకాశాలను కూడా  కొంతకాలం పాటు ఉభయులూ ఏదో ఒక నిష్పత్తిలో పంచుకోవాలి. &lt;br /&gt;&lt;br /&gt;ఉద్యోగాలు, చదువులూ పక్కనపెడితే, సాగునీటి సమస్య చాలా కీలకమయినది,  సంక్లిష్టమయినది. కృష్ణాగోదావరినదులు సుదీర్ఘంగా ప్రవహిస్తూ ఉన్నా తెలంగాణ  నేలకు సాగునీటి లభ్యత లేదన్నది తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ఒక ముఖ్యమైన  కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, సాగునీటి కోసం జరిగే కొత్త ప్రయత్నాలు  కానీ, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల కానీ- దిగువ ప్రాంతమైన కోస్తాంధ్రకు  నీరు అందదేమోనన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. పోలవరం, పులిచింతల  ప్రాజెక్టుల మీద ఉభయప్రాంతాల ప్రయోజనాలు, వైఖరులు భిన్నంగా ఉన్నాయి.  నీటిపంపకం పెద్ద సమస్యే కానున్నది. నిజానికి హైదరాబాద్ కంటె అదే పెద్ద సమస్య. మహానగరంలో అమిత  ప్రయోజనాలున్నవారు ఆ ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తూ, తక్కినవాటిమీద దృష్టి  సారించకుండా జాగ్రత్త పడ్డారు. విభజన అసాధ్యమనే అభిప్రాయాన్ని పదే పదే  కల్పించడం ద్వారా, సీమాంధ్ర ప్రాంత రైతాంగంలో తమ ప్రయోజనాల సాధన కోసం  ముందే మేల్కొనే అవకాశం లేకుండా చేశారు. అంటే సీమాంధ్ర రైతాంగం తెలంగాణతో  ఘర్షణ వైఖరి ద్వారా రక్షణలు పొందాలని, పొందగలరని కాదు. సాగునీటికి అధిక  లబ్ధిదారులు గా కనిపిస్తున్న సీమాంధ్ర ఆయకట్టురైతాంగం, తమ ప్రస్తుత  స్థితిని కాపాడుకోవడం అవసరం.  అందుకు, ఉభయప్రాంతాల మధ్య సంప్రదింపులు, సదవగాహన అవసరం. వాస్తవికత, సమాన  న్యాయం ప్రాతిపదికలుగా కృష్ణా జలాల పునఃపంపిణీ అవసరం. ఆ పంపిణీలో రాయలసీమకు  కూడా న్యాయం చేయవలసి ఉంటుంది. హైదరాబాద్‌తో ఉన్న ప్ర యోజనాల కంటె, అధికంగా  కృష్ణాజలాలే రాయలసీమ రైతాంగానికి, అక్కడి రాజకీయ నాయకత్వానికి కూడా  ముఖ్యం. పరీవాహకప్రాంత హక్కులు లేని రాయలసీమకు తుంగభద్ర, పెన్న తప్ప పెద్దనదులు  లేవు. తెలుగుగంగ పుణ్యమా అని కొన్ని నీళ్లు, రాజశేఖరరెడ్డి హయాం కారణంగా  పోతిరెడ్డిపాడు నుంచి కొన్ని వివాదాస్పద జలాలు మాత్రమే సీమకు  లభిస్తున్నాయి. ఎంతో కొంత జలవాగ్దానం జరగకపోతే, విభజన వల్ల రాయలసీమ అధికంగా  నష్టపోతుంది. జీవనదులు ప్రవహిస్తున్నా సాగునీటికి గతిలేకుండా ఉన్న  తెలంగాణ, రేపు కోస్తాకు, సీమకు నీటిని వాగ్దానం చేయవలసి రావడమే విచిత్రం. &lt;br /&gt;&lt;br /&gt;ఇందరికి ఇన్ని సర్దుబాట్లు చేసిన తరువాత తెలంగాణకు ఏమి మిగులుతుంది? దాన్ని  అభివృద్ధిబాటలో పాలకులు ఎట్లా నడిపిస్తారు?- అన్నవి ఆందోళనకరమైన  ప్రశ్నలే. కానీ, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకవలసిన సమయం వచ్చింది. విభజన  ఖాయం అని తెలిసిన తరువాత, పంపకాల మీదనే చర్చ ప్రారంభం కావలసి ఉన్నది.  వివక్ష వల్ల బాధితులైనవారు, ఇతరుల విషయంలో ఆ వివక్ష చూపించరు, ఉదారంగా  కూడా ఉంటారు. ఉండాలి. కానీ, విభజన ప్రాతిపదికలను నిర్ణయించేటప్పుడు, విభజన  ఉద్యమం ఎందుకు జరిగిందో, ఆ విలువలను ఆకాంక్షలను విస్మరించకుండా ఉండాలి.  భౌతిక ప్రయోజనాలు శూన్యమై కేవలం భావోద్వేగాలు సంతృప్తి చెందితే కూడా  ఉపయోగం లేదు&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-3778802065620614217?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/3778802065620614217/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_03.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/3778802065620614217'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/3778802065620614217'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/10/blog-post_03.html' title='పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4448997897949634345</id><published>2011-09-26T10:15:00.000-07:00</published><updated>2011-09-26T10:17:13.094-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham  25 Septmeber 2011'/><title type='text'>'సకలం' మిథ్య అంటే సరిపోతుందా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;&lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;ఏదైనా ఒక ఉద్యమం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్న వేసుకుని వారి వారి ఇష్టాన్ని బట్టి ఏ సమాధానమైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అభిప్రాయం మాత్రమే. కానీ ఏదైనా ఉద్యమం ఉధృతంగా సాగుతోందా, చప్పగా జరుగుతోందా అన్న ప్రశ్న వేసుకుని ఇష్టమొచ్చిన అభిప్రాయం చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే, అక్కడ వాస్తవం చెప్పాలి.&lt;br /&gt;&lt;br /&gt;మూడున్నర లక్షల మంది రాష్ట్రప్రభుత్వోద్యోగులు, లక్షన్నర మంది ఉపాధ్యాయులు, అరవైఏడు వేల మంది సింగరేణికార్మికులు, యాభై ఎనిమిదివేల మంది ఆర్టీసీ కార్మికులు, ఇంకా ప్రభుత్వాసుపత్రుల వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఇంకా ఆటోడ్రైవర్లు, పూజారులు, రజకులు, భవన నిర్మాణ కార్మికులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ డ్రైవర్లు సంఘీభావ సమ్మెలు చేస్తున్నారు. రోజుకో సమూహం కొత్తగా వచ్చి ఆందోళనలో చేరుతున్నది.ఏకకాలంలో సమ్మెచేసి జనజీవనాన్ని స్తంభింపజేసిన ఇటువంటి ఉద్యమం గతంలో ఎప్పుడైనా ఏ సమస్యల పరిష్కారం కోసమైనా జరిగిందా? ఇన్ని రోజులు నిలకడగా సాగిందా? ఉద్యమం తీరు మీద, నాయకత్వం మీద ఎన్ని విమర్శలు, విభేదాలు ఉన్నప్పటికీ-సమాజంలోని ఇన్ని వర్గాలు, శ్రేణులు ఒక్కుమ్మడిగా ఒక ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం మునుపు ఎన్నడైనా విన్నామా? తెలంగాణ ఉద్యమం గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నవారైనా, ఇప్పటి సకలజనుల సమ్మె తీవ్రతను, ఉధృతిని అంగీకరించడానికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే, హైదరాబాద్ వీధుల దగ్గర నుంచి, ఆదిలాబాద్ అడవుల దాకా వాస్తవమేమిటో కళ్ల ఎదుట కనిపిస్తున్నది. మరి రేణుకాచౌదరికీ, అభిషేక్ సింఘ్వికి సమ్మె ప్రభావం ఏమీ లేదని ఎందుకు అనిపించింది? ఇదంతా చల్లారిపోయే వేడి అని ముఖ్యమంత్రిగారికి ఎందుకు అనిపిస్తోంది?&lt;br /&gt;&lt;br /&gt;చల్లారిపోవచ్చు. ఏ విజయమూ లేకుండానే అణగారిపోవచ్చు. కానీ, ముగిసిపోయిందనుకున్నది మళ్లీ మళ్లీ మొలుచుకు వస్తున్నప్పుడు, ఇది ఇంతటితో ఆగేదికాదన్న కనీస అవగాహన ఉండాలి. అణచివేతతోనో, అసహాయతలోనో ఆందోళనలు విరమించుకున్నప్పటికీ, ఆకాంక్షలు నెరవేరని ఆశాభంగం, కనీస స్పందన కూడా దొరకని అరణ్యరోదనం- ఆయా జనవర్గాల మనసులో ఎటువంటి ఉద్వేగాలకు, ఆవేశాలకు &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;కారణమవుతాయో- సమాజానికి బాధ్యతవహించేవారికి తెలిసి ఉండాలి.గుంపును చెదరగొట్టి విజయం సాధించామని పోలీసులు అనుకోవచ్చు, సమ్మెను చెదరగొడితే సమస్య సమసిపోతుందని ప్రభుత్వాధినేతలు అనుకుంటే అది న్యాయం కాదు. మీరు వ్యక్తం చేస్తున్న ఆకాంక్షను ఆలకించాము, సమస్యను పైవారికి నివేదిస్తాము, పరిష్కారం సత్వరం జరిగేటట్టు మా ప్రయత్నం మేం చేస్తాము- అని చెప్పవలసింది పోయి, సమ్మె వల్ల కలుగుతున్న కష్టాలను చూపించి, చట్టాలతో భయపెట్టి, తాయిలాలతో ఆశపెట్టి సంక్షోభాన్ని గట్టెక్కాలనుకోవడం అంత గొప్ప పరిపాలనా వ్యూహమూ, రాజకీయ విజ్ఞతా కావు.&lt;br /&gt;&lt;br /&gt;మరి సమ్మె వల్ల కష్టాలు లేవా? చాలా ఉన్నాయి. లెక్కలేనన్ని ఉన్నాయి. సమ్మె ఎట్లా పరిణమిస్తుందో తెలియదు కానీ, నెలాఖరుకు జీతాలు వచ్చే ఆశ లేదు. వచ్చే నెల దసరా దీపావళి పండగలు. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. పదోతరగతి, ఇంటర్ పిల్లల తల్లిదండ్రులకయితే మరీ టెన్షన్. రోడ్ల మీద చిల్లర వ్యాపారం దెబ్బతింటున్నది. షోరూమ్‌లలో అమ్మకాలూ పడిపోయాయి.రవాణా సదుపాయం లేక రోగులు మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారు. సింగరేణి సమ్మె ప్రభావం నిజంగా మొదలయిందో ప్రభుత్వం మాయచేస్తోందో తెలియదు కానీ, ఇవాళ కాకపోతే రేపయినా విద్యుత్‌కొరత విరుచుకుపడుతుంది. ఇప్పటికే గృహవినియోగం కోత పడింది. సమ్మె పేరు చెప్పి సేద్యానికీ కోతవేయవచ్చు. జీవితం స్తంభించడం అంటే ఏమిటో తెలంగాణ జిల్లాలను చూస్తే తెలుస్తుంది. ఏ సమ్మెకైనా బాధితులంటూ ఉంటే వారు ప్రధానంగా స్థానికులే అయి ఉంటారు. అలాగే, ఈ సకల జనుల సమ్మె కూడా తెలంగాణ సకల జనులను ఇబ్బందులు పెట్టడంలో ఆశ్చర్యమూ అసహజమూ ఏమీ లేదు.&lt;br /&gt;&lt;br /&gt;మరి తెలంగాణ వారు తమను తాము ఎందుకు బాధించుకుంటున్నారు? సమ్మె చేసేవారూ బాధలు పడేవారూ వేరువేరా? ప్రభుత్వోద్యోగులకూ సింగరేణి కార్మికులకూ కుటుంబాలూ పిల్లలూ వాళ్ల చదువులూ అన్నీ ఉంటాయి. కరెంటు కోత వస్తే అందుకు బాధితులయ్యేవారిలో ఉద్యమకారులూ ఉంటారు. అంతెందుకు, వీరందరూ జీతాలు కోల్పోవడానికి, ప్రభుత్వ చర్యలకు సిద్ధపడే సమ్మెకు దిగారు కదా?తమను తాము బాధించుకుంటున్నామని వారికి తెలియదా? గొప్పదని తాము అనుకున్న ఆశయాన్ని సాధించడానికి వాళ్లు ఆ ఇబ్బందులు పడడానికి సిద్ధపడి ఉద్యమిస్తున్నారు. ఇది మీకే నష్టం, మీకే కష్టం- అనడమంటే, ఉద్యమాలు ఎట్లా జరుగుతాయో, ఏ ఏ సంసిద్ధతలతో జరుగుతాయో తెలియని అజ్ఞానమే అవుతుంది. తమను తాము కాకుండా ఇతరులను మాత్రమే బాధించే ఉద్యమాలు చేస్తే, ఈ విమర్శకులు ఆహ్వానిస్తారా? అప్పుడు వాటిని మరో పేరుతో పిలవరా?&lt;br /&gt;&lt;br /&gt;ఒక అపూర్వమైన ప్రజాందోళనతో వ్యవహరించవలసిన తీరు ఇది కాదు. ఆ ఆందోళన ఆశయాలతో ఏకీభావం లేకున్నా, ఇందులో పాల్గొంటున్న విస్త­ృత ప్రజారాశిని మొదట గౌరవించాలి. తరువాత ప్రజాస్వామికంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అందుకు జరగవలసింది- ముందు ఉద్యమం ఉనికిని గుర్తించాలి. కళ్లుమూసుకుంటే మాయమయిపోయేది కాదు, ఈ ఉద్యమం. ఉధృతంగా లేదనుకుంటే, బలహీనపడిందనుకుంటే, మెజారిటీ ప్రజలు ఇందుకు సుముఖంగా లేరనుకుంటే, అది ఆత్మసంతృప్తిని ఇవ్వవచ్చు, ఇతర ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి పనికిరావచ్చు.కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవాన్ని నిరాకరిస్తూ,సబ్ ఠీక్ హై అనుకుంటే, అది ఉష్ట్రపక్షి మనస్తత్వమే అవుతుంది. ఉద్యమం ఉనికిని గుర్తించడం మాత్రమే కాదు, అందులో కనిపించే మంచిలక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 1969 నాటి ఉద్యమం ఇంత కంటె తీవ్రతతో సాగింది. సందేహం లేదు. నెలల తరబడి విద్యాలయాలు మూతబడ్డాయి, వీధులు రణరంగంగా మారాయి. హింసాత్మక సంఘటనలూ జరిగాయి. నేటి ఉద్యమంలో అంత తీవ్రత కనిపించకపోవచ్చు, కానీ విస్త­ృతి కనిపిస్తుంది.నాటితో పోలిస్తే, అనేక రెట్లు జనం ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు కానీ, నేటి సంయమనం, నిగ్రహం నాడు లేవు. ఇన్ని శ్రేణులు, ఇన్ని సంఘాలు, ఇన్ని ఐక్యవేదికలు ఒకే ఉద్యమంలో అంతర్భాగంగా ఉన్నా, ఏ వైపు నుంచి కూడా హద్దుమీరిన దాఖలాలు లేవు. కానీ, ఉద్యమమే మిథ్య అనేవారు ఒకవైపు, ఉన్న ఉద్యమం ఉద్రేకాలను రెచ్చగొడుతున్నదనేవారు మరోవైపు- వీరు వాస్తవాన్ని ఎవరి నుంచి దాచిపెడుతున్నారు? వీరి మాటలు నమ్మితే, మోసపోయేది ఎవరు?&lt;br /&gt;&lt;br /&gt;అటూ ఇటూ ప్రగల్భ శూరులు లేరని కాదు. ఆచరణకు ప్రత్యామ్నాయంగా ఆవేశప్రకటనలను ఒక పద్ధతిగా పాటిస్తున్న వారు అన్ని వైపులా ఉన్నారు. కానీ, నిజంగా జనం అటువంటి మాటల వల్ల ఉద్రిక్తులవుతారా? ప్రాణాలిస్తామని చెప్పేవాళ్లు పదవులుకూడా వదలరని, ఆత్మాహుతి దాడులు చేస్తామనేవారి కాళ్లు గడప కూడా దాటవని, దళాలు ఏర్పాటు చేస్తామనడం, ఊచకోతలు కోస్తామనడం, నాలుక తీస్తామనడం- కేవలం వేదికలమీద వాగాడంబరాలేనని జనానికి తెలియదా? ఆ మాటల వల్ల కాదు కానీ, నిర్ణయాలు తీసుకోవలసినవారి నిర్లిప్తత వల్ల, సత్యం చెప్పవలసినవారి నోట అసత్యాల వల్ల, కనిపిస్తున్న వాస్తవానికి కళ్లు మూసుకోవడం వల్ల - ఉద్రిక్తతలు చెలరేగుతాయి.&amp;nbsp;ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా చేయగలిగినంత చేస్తున్న ఉద్యమానికి పాషాణహృదయమే సమాధానమైతే, అది ఎంతటి నిస్ప­ృహను, తెగింపును కలిగిస్తుందో ఏలినవారికి తెలియవద్దా? రెచ్చగొట్టడానికి మాటలే కానక్కరలేదు. మౌనం చాలు. నిర్లిప్తత చాలు. శాంతపరచడానికి అన్ని వేళలా పూర్తిపరిష్కారమే అక్కరలేదు, కాసింత సానుభూతి, కొన్ని అనునయవాక్యాలు చాలు. ఆశను మిగిలిస్తే చాలు. ఒక అడుగైనా ముందుకు పడితే చాలు.&lt;br /&gt;&lt;br /&gt;ఇంతటి మహోద్యమానికి పాలకుల ప్రతిస్పందన ఇట్లా ఉంటే, ఉద్యమప్రజలకు ప్రాతినిధ్యం వహించే నేతల ధోరణి మరీ దారుణంగా ఉంది. చిన్న పాటి సాంత్వన వాక్యం, కొద్దిగా సంఘీభావం, కాసింత నిజాయితీ కనబరస్తే చాలు, గజమాల వేయడానికి సిద్ధంగా ఉన్నారే ప్రజలు, చరిత్ర కల్పించిన అవకాశానికి ఎందుకింత పెడమొహం పెడుతున్నారు? రాష్ట్ర స్పీకర్ రాజీనామాలు తిరస్కరించినదే మహా భాగ్యం అనుకుని ఊరుకున్నారు.లోక్‌సభ స్పీకర్ పెండింగ్‌లో పెడితే, సభకు వెళ్లివస్తూనే ఉన్నారు. రాజీనామాలు పరిష్కారం అని కాదు, తాము చేసిన పనులకే కట్టుబాటులేని తనం ఎందుకు? నిన్న ఆత్మహత్యలతో, నేడు ఆత్మహింసతో ఆకాంక్షలను ప్రకటిస్తున్న ప్రజల కాలిగోరుకైనా సరిపోలగలరా వీరు? తమతో కలవమని జనం చేస్తున్న విజ్ఞప్తికి వీరు ఇస్తున్న స్పందన ప్రభుత్వస్పందన కంటె ఏ రకంగా భిన్నమైనది?సమస్యకు పరిష్కారం కావాలి. నిజమే. అంతకంటె ముందు కనీసం స్పందన కావాలి.&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4448997897949634345?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4448997897949634345/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/09/blog-post_26.html#comment-form' title='35 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4448997897949634345'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4448997897949634345'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/09/blog-post_26.html' title='&apos;సకలం&apos; మిథ్య అంటే సరిపోతుందా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>35</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-3716944095418792472</id><published>2011-09-12T09:40:00.000-07:00</published><updated>2011-09-12T09:40:05.745-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham  11 Septmeber 2011'/><title type='text'>ఆనాడు మూడు వేలు, ఆ తరువాత 20 లక్షలు!</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;జంట భవనాలు కూలిన మరుసటి రోజే సద్దామ్ హుస్సేన్ ఒక మాట అన్నాడు. "సెప్టెంబర్11, 2001 కంటె ముందు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా ఖండానికి ఆయుధాలతో వెళ్లినవారు పాశ్చాత్యులే. వాళ్లే అమెరికాను స్థాపించారు. ఆ తరువాత అమెరికాయే విధ్వంస ఆయుధాలను, మృత్యువును మోసుకుని అట్లాంటిక్‌ను దాటి ప్రపంచంపై దాడులు చేసింది''&lt;br /&gt;&lt;br /&gt;జంటభవనాలు కూల్చిన ఏడాది తరువాత ఒసామా బిన్‌లాడెన్ అమెరికన్ ప్రజలకు రాసిన లేఖలో తాము దాడి ఎందుకు చేసిందీ సుదీర్ఘంగా వివరిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. 'మానవజాతి చరిత్రలోనే మీది అధ్వాన్నపు నాగరికత అని చెప్పడానికి చాలా విచారంగా ఉంది'. తాను చేస్తున్నది నాగరికతల యుద్ధమని లాడెన్‌కు తెలుసునా? అమెరికా ఆధ్వర్యంలో సాగుతున్న అభివృద్ధి, ప్రకృతివిధ్వంసాలను, ఆ దేశంలోని నైతికపతనాన్ని సామ్రాజ్యవాదమనే మాట కూడా వాడకుండా అతనెలా వర్ణించగలిగాడు?&lt;br /&gt;&lt;br /&gt;సద్దామ్ హుస్సేన్ తన స్వగ్రామం తిక్రితిలో సమాధిలో శాశ్వత నిద్రలో ఉన్నాడు. ఒసామా బిన్‌లాడెన్ భౌతిక శరీరం అరేబియా సముద్రగర్భంలో గుర్తుతెలియని చోట జలసమాధి అయింది. మానవాళిపై జరిగిన అత్యంత ఘోరమైన అపచారంగా చెప్పుకుంటున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి జరిగి పదేళ్లు గడచిన నేటి రోజున&lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; ఆ ఇద్దరు ప్రతినాయకులు ఈ లోకంలో లేరు. వారు లేని ప్రపంచం సురక్షితంగా ఉంటుందని చెప్పిన అమెరికా ఈ వార్షికోత్సవాన గడగడ వణుకుతూ తనను తాను దిగ్బంధించుకున్నది.&lt;br /&gt;&lt;br /&gt;సెప్టెంబర్ 11కు జంటభవనాలనే ప్రతీకగా ఎంచుకుంటున్నాము కాని, ఆరోజు పెంటగాన్ మీద కూడా దాడి జరిగింది. అన్ని చోట్లా కలిపి మూడువేల మంది చనిపోయారు. ట్రేడ్ సెంటర్‌లో అయితే వివిధ దేశాలనుంచి ఉద్యోగవశాన వచ్చిన వారు, స్త్రీలు, పిల్లలు.. అందరూ అమాయకులే. అటువంటి మరణం విషాదకరం, ఆ దాడి దుర్మార్గం. వారందరి స్మ­ృతికీ ఏటేటా నివాళులర్పించవలసిందే. కానీ సద్దామ్ హుస్సేన్ అన్నాడు- అమెరికన్ ప్రజలారా, సెప్టెంబర్11 న ఏమి జరిగిందో దాన్ని మీ ప్రభుత్వమూ సైన్యాలూ ప్రపంచమంతా చేసినవాటితో ఒకసారి సరిపోల్చి చూడండి.&lt;br /&gt;&lt;br /&gt;ఆ మాట చెప్పడానికి సద్దామ్ కావాలా, హృదయం సరిఅయిన చోట ఉన్నవారందరూ, కాసింత ఆలోచన మిగిలిన వారందరూ అదే మాట చెప్పారు, చెబుతున్నారు. వారిలో అసంఖ్యాకంగా అమెరికన్లూ ఉన్నారు. ఎవరి పాపసంచయం ఆ ఘాతుకానికి నేపథ్యం అయిందో, ఎవరి కార్యాలు ఆ నరమేధానికి కారణాలయ్యాయో చరిత్ర నిర్మొహమాటంగా చెబుతుంది. అయినా అబద్ధమే సగర్వంగా వర్తమానంపై రెపరెపలాడుతున్నది. కారణం లేని రణమట. అమెరికన్ స్వేచ్ఛను చూసి అసూయట, ప్రజాస్వామ్యంపై యుద్ధమట. &lt;br /&gt;&lt;br /&gt;ప్రపంచానికే ప్రమాదమట. కానీ రాబర్ట్ ఫిస్క్ ఒప్పుకోడు. మధ్య ఆసియాలో అనేక యుద్ధాలను చూసిన జర్నలిస్టు అతను. చిన్న నేరం జరిగితే కారణమేమిటని అడుగుతారే, సెప్టెంబర్11కు కారణమేంటి అని అమెరికా ఎందుకు ప్రశ్నించుకోదు? అని ఆయన అమాయకంగా అడుగుతారు. కానీ, ప్రశ్న అమాయకమైనది కాదు. సెప్టెంబర్11కు మూలం పాలస్తీనాలో ఉన్నదన్న అప్రియమైన సమాధానాన్ని అమెరికా దాటవేస్తున్నదని అంటారు. సెప్టెంబర్11 నాటి అఘాయిత్యానికి ఆత్మాహుతిదళంగా పనిచేసిన పందొమ్మదిమందినీ ఏకం చేసినది పాలస్తీనాపై అమెరికా వైఖరే. పదేళ్ల తరువాత కూడా ఆ కారణాన్ని చూడడానికి ఇష్టపడని అమెరికా- తాజాగా పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితి సభ్యత్వ ప్రతిపాదనను వీటో చేయాలని నిర్ణయించుకున్నది. అమెరికన్లను ప్రమాదంలో పడవేస్తున్నది ఎవరు?&lt;br /&gt;&lt;br /&gt;ఒక్క మానవప్రాణానికే విలువ కట్టలేమంటే, మరి మూడువేల ప్రాణాలు? విలువైనవే. మూడువేలప్రాణాలంత విలువైనవి. కానీ, చరిత్ర సెప్టెంబర్11తో ఆగలేదు. ఈ దశాబ్దంలో అది రెండు మహాదురాక్రమణ యుద్ధాలను చూసింది. యుద్ధాన్ని సరిహద్దులకు అతీతంగా విస్తరించడం చూసింది. సామరస్యమే తెలిసిన దేశాలలో సైతం మానవబాంబులు, వరుసబాంబులు పేలడం చూసింది.టెర్రరిజంపై పోరాటం ప్రపంచ ప్రజలందరి సమస్యగా మారిపోయి, అమెరికాతో సహా దేశదేశాలలో ప్రజల హక్కులను హరించింది, చట్టవ్యతిరేక హత్యలను చేయించింది, వేలాది మందిని జైలుపాలు చేసింది. హిట్లర్‌కూడా సిగ్గుపడే రీతిలో ఒక గ్వాంటినామో బేను సృష్టించింది. మూడువేల మందికోసం వెలుగుతున్న కొవ్వొత్తుల కాంతులను అబద్ధాల చీకటిపై ప్రసరింపజేస్తే, గత దశాబ్దంలో జరిగిన ఇరవైలక్షల హత్యలు కనిపిస్తాయి.&lt;br /&gt;&lt;br /&gt;జంటభవనాలు కూలిన నెలరోజులకు, లాడెన్‌ను ముల్లా ఉమర్‌ను అప్పగించడానికి నిరాకరించిన ఆప్ఘనిస్థాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించింది. పదేళ్లు గడిచాయి, లాడెన్ నిష్క్రమించాడు. అయినా యుద్ధం ముగియలేదు. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. టెర్రరిజంతో సంబంధముందని మొదట అభాండం మోపి, ఆ తరువాత జనహనన ఆయుధాలున్నాయని ఆరోపణ చేసి- ఇరాక్‌పై యుద్ధం ప్రకటించారు. బాంబుల వర్షం కురిసింది. అజ్ఞాతంలో ఉండి చిక్కిన సద్దామ్‌ను ఏదో విచారణ జరిపి ఉరితీశారు. కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరచారు. ఆ దేశం చమురును ప్రపంచ మార్కెట్ సరుకు చేశారు.ఇంకా అక్కడ 'శాంతి' లేదు. వెనుదిరగాలంటే అమెరికాకు ఇంకా భయమే. పదిలక్షల కోట్ల డాలర్లు ఈ పదేళ్ల కాలంలో యుద్ధం కోసం ఖర్చుచేసిన అమెరికా తాను దివాలా తీసి ప్రపంచాన్నీ దివాలా తీయించింది. అమెరికాలోని మాంద్యానికి, ఇటీవలి చెల్లింపుల సంక్షోభానికీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనం కావడానికీ ఈ యుద్ధాలే కారణం. బుష్ రెండు దఫాల పాలన పోయి, మార్పుజపంతో వచ్చిన బరాక్ ఒబామా పాలనలో కూడా మార్పు లేదు. పైగా, శత్రువధను వినోదకార్యక్రమంగా చూసే అలవాటు బుష్‌కు ఎన్నడూ లేదు.&lt;br /&gt;&lt;br /&gt;ఏక ధ్రువ ప్రపంచమూ మార్కెట్ల గ్లోబలైజేషన్ ఒకేసారి అవతరించిన తరువాత, నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించడానికి అమెరికాకు ఒక శత్రువు కావలసి వచ్చింది. అందరూ శత్రువుగా భావించే శత్రువు కావలసివచ్చింది. ఆ శత్రువు భయంతో అందరూ తన పంచన చేరే వ్యూహం రూపొందించింది. ఆ వ్యూహానికి తెలిసో తెలియకో సహకరించే ఉగ్రవాదులున్నారో థర్డ్‌రీచ్ దహనం తరహాలో తానే ప్రత్యేక పరిస్థితిని సృష్టించుకున్నదో కానీ, అమెరికా టెర్రరిజంపై యుద్ధం ఒక సరికొత్త వలసవాద వాతావరణాన్ని సృష్టించింది.డాలర్‌కు సరిహద్దుల గొడవ మునుపే లేదు. ఇప్పుడు అమెరికన్ విమానాలకీ, ఎఫ్‌బిఐకీ దేశాల సార్వభౌమాధికారంతో పనిలేదు. ఏ దేశపు దోషినైనా బంధించగలరు. ఏదేశంలో అయినా అర్థరాత్రి వాలగలడు. ఎవరికైనా ఉగ్రవాద లింకులు అంటగట్టగలరు. ఒకే భయాన్ని అందరికీ పంచి, ఒకే అభయాన్ని అందరికీ అందించి లోకాన్ని పాలిస్తున్నది అగ్రరాజ్యం.&lt;br /&gt;&lt;br /&gt;అమెరికాలో కూర్చుని కంప్యూటర్ మీట నొక్కితే, మానవరహిత విమానం గురిచూసి అవాంఛనీయవ్యక్తిని హతమార్చగలదు. ఆకాశం మీద పహారా కాసిన అమెరికన్ ఉపగ్రహాలు నడిరోడ్డున జనసమ్మర్దం మధ్య ఉన్న మనిషి బొమ్మను కూడా ప్రసారం చేయగలవు. చిటికె వేస్తే ఏ దేశంలో అయినా ఉన్నట్టుండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు పుట్టగలవు. తలచుకుంటే, ఏ నగరం నడిబొడ్డున అయినా ఒక బాంబు విస్ఫోటం చెందగలదు. ఏవి ఉగ్రవాదులు పేల్చినవో, ఏవి వ్యూహాత్మకంగా పేలినవో, ఏవి కట్టుదిట్టాల కోసం పథకం ప్రకారం అమర్చినవో చెప్పడం సాధ్యమే కాదు. ఎన్ని హాలివుడ్ సినిమాలు రాలేదు, మధ్య ఆసియాలో టెర్రిస్టులను తామే సృష్టించి తామే తెరవెనుక ఉండి ఆడించిన కథనాలు?&lt;br /&gt;&lt;br /&gt;పదేళ్ల ప్రస్థానం తరువాత ఓడింది ఎవరు? గెలిచింది ఎవరు? ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక ఉద్యమానికి ఊతం ఇచ్చి, ఎప్పుడంటే అప్పుడు ఆ ఉద్యమాన్ని ఆర్పేయడం సాధ్యమా? సాధ్యం కాదని చెప్పడానికి భారతదేశంలోనే అనేక అనుభవాలున్నాయి. మనదేశం అనుభవం అట్లా ఉన్నప్పుడు అమెరికాకు మాత్రం భిన్నమైన అనుభవం ఎట్లా లభిస్తుంది? రష్యామీద కోపంతో తాలిబన్లను సాయుధం చేసిన అమెరికా, ఇప్పుడు చరిత్రను వెనక్కు తిప్పలేదు.&lt;br /&gt;సాయం అందించడానికి నీకు ఏదో వ్యూహం ఉన్నట్టే, తీసుకున్నవారికీ ఏదో ఉంటుంది. మధ్య ఆసియాలో ఆర్థిక ప్రయోజనాలను, వనరులపై పెత్తనాన్ని, ప్రపంచవ్యాప్తంగా సమీకరించదలచుకున్న విధేయతను దృష్టిలో పెట్టుకుని టెర్రరిజం పోరాటాన్ని తీర్చిదిద్దిన అమెరికా, తన ఉచ్చులో తానే బిగుసుకున్నది. ఇంకా అగ్రరాజ్యమే కావచ్చు. కానీ, అప్పుల రాజ్యమే. ఇంకా మహారాక్షసే, కానీ కాళ్లు మట్టివే. యుద్ధం ఎడతెగదు. శవపేటికలు తిరిగి వస్తూనే ఉంటాయి. అతనెవరో అప్పుడెప్పుడో హెచ్చరించినట్టు "నువు తెరచిన తలుపు ఇది, ఇక ఎన్నిటికీ మూసుకోదు.''&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-3716944095418792472?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/3716944095418792472/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/09/20.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/3716944095418792472'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/3716944095418792472'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/09/20.html' title='ఆనాడు మూడు వేలు, ఆ తరువాత 20 లక్షలు!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-169226236270218953</id><published>2011-09-06T05:51:00.000-07:00</published><updated>2011-09-06T05:52:40.420-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Editorial 03 Sept 2011'/><title type='text'>శ్రద్ధాంజలి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="headline"&gt;&lt;h1&gt;&lt;/h1&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;కొద్దికాలంగా అస్వస్థులుగా ఉండి, శుక్రవారం రాత్రి కన్నుమూసిన నండూరి రామమోహనరావు తెలుగు పాత్రికేయ, సాహిత్య, బౌద్ధిక రంగాలలో తనదైన గాఢముద్ర వేసిన బహుముఖప్రజ్ఞాశాలి. మృదుస్వభావిగా, ఆలోచనాపరుడిగా, సరళశైలిలో ఉన్నతమైన రచనలు చేసిన రచయితగా ఆయనను తెలుగుసమాజం చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సుమారు రెండు దశాబ్దాల పాటు సంపాదకుడిగా పనిచేసిన నండూరి, పత్రికకు సాహిత్య పరిమళాన్ని అద్దడమే కాకుండా, తన ప్రతిష్ఠతో వ్యక్తిత్వంతో గౌరవాన్ని సమకూర్చిపెట్టినవారు.&lt;br /&gt;&lt;br /&gt;కొడవటిగంటి కుటుంబరావు సహాయకుడిగా ఆంధ్రపత్రిక వారపత్రికలో పనిచేయడం నండూరిలోని రచయితను మెరుగుపెట్టగా, నార్లవెంకటేశ్వరరావు సారథ్యంలో ఆంధ్రజ్యోతిలో ప్రారంభం నుంచి పనిచేయడం ఆయనలోని ఉత్తమ పాత్రికేయుడిని, సంపాదకుడిని తీర్చిదిద్దింది. చెన్నైలో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడు ముళ్లపూడి వెంకటరమణ ఆయన సహోద్యోగి. మద్రాసులోని తెలుగు సాహితీదిగ్గజాలు శ్రీశ్రీ, ఆరుద్రలతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. మార్క్‌ట్వేన్ రచనలు రాజుపేద (ప్రిన్స్ అండ్ పాపర్), టామ్‌సాయర్ (టామ్‌సాయర్), టామ్‌సాయర్ ప్రపంచయాత్ర (టామ్‌సాయర్ అబ్రాడ్), హకల్‌బెరీ ఫిన్ (అడ్వెంచర్స్ ఆఫ్ హకల్ బెరీఫిన్), విచిత్రవ్యక్తి (మిష్టీరియస్ స్ట్రేంజర్) ఆ కాలంలోనే ఆయన తెలుగుచేసి ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు.మార్క్‌ట్వేన్ రచనలే కాక, రాబర్ట్ లూయీ స్టీవెన్‌సన్ సుప్రసిద్ధ రచన 'ట్రెజర్ ఐలాండ్'ను 'కాంచన ద్వీపం'గా, ఏసోప్స్ ఫేబుల్స్‌ని 'కథాగేయ సుధానిధి' గా అనువదించారు. తెలుగు బాలసాహిత్యానికి నండూరి అందించిన అపురూపమైన &lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;సేవ ఈ అనువాదాలు. సరళంగా, సున్నితంగా రాయగలగడం వల్లనే ఆ రచనలను పిల్లలకోసం చేయగలిగారా, లేదా వాటిని తెలుగు చేస్తున్న క్రమంలోనే ఆయనకు ఆ అద్భుతమైన శైలి అలవడిందా అని సందేహం కలుగుతుంది. బాపు రమణల స్నేహం కూడా ఆయనలోని తెలుగుని వెలిగించి ఉండాలి.&lt;br /&gt;&lt;br /&gt;నండూరి రామమోహనరావు ఆధునికుడు. ఆలోచనల్లోను అభిరుచుల్లోనూ కూడా ఆయన పాతను తలకెత్తుకునే మనిషికాదు. శాస్త్రవిజ్ఞానం చేసిన ఆవిష్కరణలు ఒకవైపు, ప్రాచ్య పాశ్చాత్య తాత్వికత ఒకవైపు, 20 వ శతాబ్దపు నూతన సాహిత్య కళాసిద్ధాంతాలు మరోవైపు ఆయనను ప్రభావితం చేశాయి. సంప్రదాయాన్ని అధ్యయనం చేసిన వ్యుత్పత్తి, ఆధునిక సృజనాత్మకత ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సామ్యవాద ఆదర్శాలు ఆయన ఒంటబట్టించుకున్నప్పటికీ, తక్కిన ఆలోచనల విషయంలో సహనం అలవరచుకున్నారు. ఉదారవాదం, మితభాషిత్వం ఆయన స్వభావాలు. కమ్యూనిస్టుదేశాల్లో రచయితలపై, అభిప్రాయస్వేచ్ఛపై నిర్బంధాలు అసంతృప్తికి గురిచేశాయి.&lt;br /&gt;&lt;br /&gt;కొడవటిగంటి కుటుంబరావుతో సాన్నిహిత్యం వల్లనే కాబోలు, నండూరిలో శాస్త్రవిజ్ఞానంపై ఆసక్తి, దాన్ని సులువుగా పాఠకులకు అందించాలన్న తపన ప్రారంభమయ్యాయి. మానవ పరిణామంపై రాసిన 'నరావతారం', విశ్వరహస్యాలను విప్పిచెప్పిన 'విశ్వరూపం', వివిధ భౌతికవాద, భావ వాద తాత్వికధోరణుల పరిచయం 'విశ్వదర్శనం'- తెలుగు పాఠకులకు గొప్ప కానుకలు. తత్వశాస్త్రంపై తానంటూ ఒక వైఖరి ప్రదర్శించకుండా, వివిధ ధోరణుల మధ్య ఉన్న స్పర్థను, వాదవివాదాలను పరిచయం చేస్తూ ఆయన 'విశ్వదర్శనం' రాశారు. ఆయన శాస్త్రవిజ్ఞాన గ్రంథాలు చదివిన వారిని సైన్స్ పై మరింత ఆసక్తి కలుగుతుంది. నిత్యజీవితాచరణలో ఎంతో కొంత శాస్త్రదృష్టి అలవడుతుంది.&lt;br /&gt;&lt;br /&gt;దినపత్రికాసంపాదకుడిగా నండూరిది ప్రత్యేకమైన మార్గం. నార్ల వలె నిశితమైన విమర్శలు, పదునైన వ్యాఖ్యలు ఆయన సంపాదకీయాలలో కనిపించవు. అభిప్రాయభేదాన్ని కూడా ఎంతో మృదువుగా, చెప్పీ చెప్పనట్టు చెప్పడం ఆయన ప్రత్యేకత. అందువల్ల ఆయన రాజకీయ సంపాదకీయాల్లో ఒక పెద్దమనిషి కనిపించేవారు తప్ప, కొరడా పట్టుకున్న విమర్శకుడు కనిపించడు. సాహిత్యసంబంధమైన పరిణామాలు జరిగినప్పుడు మాత్రం ఆయన సంపాదకీయాలు కొత్త పోకడలు పోయేవి. వాటిలోనూ వివాదాల జోలికి వెళ్లడం ఆయన పద్ధతి కాదు కానీ, రచనలో ఆయన పాండిత్యమూ సాహిత్యాభినివేశమూ కొట్టొచ్చినట్టు కనిపించేవి.'ఆంధ్రజ్యోతి' దినపత్రికకు సాహిత్యసుగంధాన్ని అలదిన ఘనత మాత్రం ఆయనదే. తెలుగునాట నాటి సుప్రసిద్ధరచయితలందరూ ఆంధ్రజ్యోతి దినపత్రికతో ఏదో రకంగా అనుబంధం కలిగి ఉండేట్టు చూసినవారు దినపత్రిక ఎడిటర్‌గా నండూరీ, వారపత్రిక ఎడిటర్‌గా పురాణం! కవిత్వాభిమాని, స్వయంగాకవి అయిన నండూరి (సవ్యసాచి పేరుతో ఆయన కవిత్వం రాసేవారు), ఇంద్రగంటి శ్రీకాంతశర్మతో కలసి 'మహాసంకల్పం' అనే గొప్ప ఆధునిక కవితాసంకలనానికి సంపాదకత్వం వహించారు. సాహిత్యంలో కనిపించే అన్ని ధోరణులను ఆసక్తిగా గమనించేవారు కానీ, తీవ్రవైఖరులకు అసమ్మతి తెలిపేవారు. అయినప్పటికీ, ఆయన కాలంలోని ఆంధ్రజ్యోతి సాహిత్యవేదిక- తెలుగు సాహిత్య పరిణామాలన్నిటికీ అద్దంపట్టేది.&lt;br /&gt;&lt;br /&gt;నండూరి అస్తమయంతో ఒక తరం సంపాదకులు నిష్క్రమించినట్టే. స్వాతంత్య్రం సిద్ధించే సంధిసమయంలో పత్రికారచనలో ప్రవేశించి, అనంతరం వైభవ, క్షీణదశలను దగ్గరగా పరిశీలించి, వ్యాఖ్యానించిన కోవలోని వారు నండూరి. భాష విషయంలో కానీ, భావాల విషయంలో కానీ కొన్ని ప్రమాణాలకు బద్ధులై నడిచిన వారు ఆయన. సకలరంగాలలో క్షీణత ఆరంభమయ్యే కాలానికి ఆయన విశ్రాంత జీవితంలోకి ప్రవేశించారు. సంపాదక జీవితమంతా గడచిన విజయవాడను వదలలేక, అక్కడే శేషజీవితం గడిపారు. నాలుగు కాలాల పాటు నిలిచే ప్రయోజనాత్మక వాఙ్మయాన్ని అందించి, నిండుజీవితం గడపిన నండూరి నిష్క్రమణ పత్రికారంగానికి, అక్షరప్రపంచానికి తీరని నష్టం. ఆయన స్మ­ృతికి 'ఆంధ్రజ్యోతి' వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. &lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-169226236270218953?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/169226236270218953/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/09/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/169226236270218953'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/169226236270218953'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/09/blog-post.html' title='శ్రద్ధాంజలి'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-4630159685042988223</id><published>2011-08-31T04:12:00.000-07:00</published><updated>2011-08-31T04:12:26.188-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 28 August 2011'/><title type='text'>ప్రభుత్వాలకు ప్రతీకారాలు ఉండవచ్చునా?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;ఆ ముగ్గురిని ఉరితీస్తే తమిళనాడు దేశం నుంచి విడిపోతుందని ఎండీఎంకె నేత  'వైగో' గోపాలస్వామి అల్టిమేటమ్ జారీచేశారు. దేవేందర్ పాల్ సింగ్  భుల్లార్‌ను ఉరితీసి, పంజాబ్ పాత గాయాలను రేపవద్దని అకాలీదళ్ ప్రకాశ్‌సింగ్  బాదల్ దగ్గరనుంచి కాంగ్రెస్ అమరీందర్‌సింగ్ దాకా కేంద్రప్రభుత్వానికి  విజ్ఞప్తులు చేస్తున్నారు. అఫ్జల్ గురును ఉరితీస్తే కాశ్మీర్ మళ్లీ  అగ్నిగుండమవుతుందని పాక్ అనుకూల గిలానీ దగ్గరనుం చి మితవాది ఉమర్ ఫరూఖ్  దాకా హెచ్చరిస్తున్నారు.  జార్ఖండ్ సాంస్క­ృతిక కార్యకర్త జితేన్ మరండీ, మరో ముగ్గురికి విధించిన  మరణశిక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. రాజీవ్  హత్యకేసులో మరణశిక్ష విధించిన ముగ్గురి క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి  నిరాకరించారు, వారి ఉరి అమలు తేదీ కూడా ఖరారు అయింది. భుల్లార్ దయాభిక్ష  పిటిషన్‌ను గత మేలోనే రాష్ట్రపతి తిరస్కరించారు. ఇంకా శిక్షతేదీ ఖాయం  కాలేదు. అఫ్జల్‌గురును పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్రహోంశాఖ  రాష్ట్రపతికి సిఫారసు చేసింది కానీ, రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  జార్ఖండ్ శిక్షలు కిందికోర్టులో విధించినవి. వారికి సంబంధించిన  న్యాయప్రక్రియ ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుంది. &lt;br /&gt;&lt;br /&gt;పైన పేర్కొన్న కేసులన్నీ రాజకీయాలతో ముడిపడి ఉన్నవేనని గుర్తించడానికి  పెద్ద శ్రమ అవసరం లేదు. ఇంకా ఉనికిలో ఉన్నవో, అణగారిపోయినవో అయిన సాయుధ  సంస్థలకు చెందిన నిందితులే ఇప్పుడు ఉరికంబం ముందు నిలుచున్న వారు. ఒక  హత్యకేసులో నిందితుడిగా ఉండి, బెయిల్‌మీద బయటకు వెళ్లిన సమయంలో మరో హత్య  చేసిన అస్సాం కు చెందిన ఎమ్.ఎన్.దాస్ అనే నిందితుడు ఒక్కడు మాత్రమే  క్షమాభిక్ష దక్కక, శిక్షకు సమీపంగా ఉన్న సామాన్య నేరస్థుడు.  తక్కిన వారంతా తీవ్రవాదులో, ఉగ్రవాదులో అని పేర్కొనేవారే. 'ఉగ్రవాదులకు  ఉరి, తక్కినవారికి క్షమ' అన్నది కేంద్ర హోంమంత్రి చిదంబరం ఫార్ములా అని,  దాని ప్రకారమే క్షమాభిక్ష సిఫార్సులపై రాష్ట్రపతికి సిఫార్సులు  వెడుతున్నాయని పత్రికలు రాస్తున్నాయి. చిదంబరం హోంమంత్రి అయినప్పుడు  మరణశిక్షలు ఖరారు అయిన వారు 53 మంది ఉండగా, అందులో 27 మందిపై అంతిమ  నిర్ణయాలు &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;జరిగిపోయాయి. ఈ 27 మందిలో 22 మందికి మరణశిక్షను జీవితఖైదుగా  మార్చారు. ఆ ఇరవైరెండు మందీ సాధారణ పౌరులుగా వివిధ నేరాలకు పాల్పడ్డవారే.  వారంతా కలసి 50 హత్యలకు పాల్పడ్డారు. హతులలో 15 మంది పిల్లలు. &lt;br /&gt;&lt;br /&gt;నేరం అని రాజ్యం నిర్వచించిన చర్యలకు పాల్పడినవారిని అనాదిగా పాలకులు  శిక్షిస్తూనే వచ్చారు. నేరాలన్నిటిలోకీ రాజద్రోహం, రాజ్యధిక్కారం క్షమార్హం  కాని నేరాలుగా ప్రభుత్వాలు పరిగణిస్తూ వచ్చాయి. వ్యవస్థకు పునాదిగా ఉండే  ధర్మాన్నో, నీతినో కాదన్న వారికీ తీవ్రశిక్షలే ఉండేవి. సంక్షేమం కంటె  శిక్షే అధికారానికి గుర్తుగా చెలామణి అయ్యేది. కోటగుమ్మాలకు తలలు  వేలాడదీయడాలు, కత్తివేటుతో శిరచ్ఛేదాలు, చర్మం వలిచి, శరీరాన్ని ఖండఖండాలు  చేయడాలు, ఫిర ంగి గొట్టానికి కట్టి పేల్చివేయడాలు- నేరం తీవ్రతను కాక,  పాలకుల క్రూరత్వాన్ని చూపేవి ఆనాటి మరణశిక్షలు. కానీ, కాలం మారింది. &amp;nbsp; ప్రజాస్వామ్యం ప్రపంచంలో పాదుకుంటున్న కొద్దీ, న్యాయాన్ని ఒక తటస్థవిలువగా  తీర్చిదిద్దే ప్రయత్నాలూ సాగుతూ వచ్చాయి. విచారణ, ప్రామాణికమైన తీర్పులు,  క్రౌర్యం పాలు తగ్గిన శిక్షలు ప్రవేశించాయి. న్యాయాన్ని ఒక మానవీయమైన  ప్రక్రియగా భావించేట్టు సాగిన సంస్కరణలను ప్రభుత్వాలు అన్ని సందర్భాలలోనూ  పాటించాయని కాదు. &lt;br /&gt;&lt;br /&gt;నేరస్థుడిని కాదు, నేరాన్ని శిక్షించాలని, నేరాల మూలకారణాలు సమాజంలో  లేకుండా చేయాలని చెప్పే ఉదారవాదం కూడా సమాజంలో క్రమంగా బలపడింది.  వ్యక్తులకు పగ లు, ప్రతీకారాలు ఉండవచ్చును కానీ, ప్రభుత్వాలు రాగద్వేషాలకు  అతీతంగా వ్యవహరించాలని, శిక్షలు విధిస్తే అవి సమాజం బాగు కోసం కావాలి తప్ప  మరే కారణం కోసమూ కాగూడదని చె ప్పగలిగేవారూ పెరిగారు.  నేరాలు అనివార్యమయ్యే పరిస్థితులు కల్పించిన పాలకులకు, ఎవరినైనా శిక్షించే  అధికారమెక్కడిదన్న ప్రశ్నా తలెత్తింది. నేరం నిర్ధారణ అయ్యేవరకు  నిందితుడికి సర్వహక్కులూ ఉండాలని, నేరాన్ని నిరూపించే బాధ్యత అభియోగం  మోపినవారిమీదనే ఉంటుందని ఆధునిక న్యాయశాస్త్రం స్పష్టం చేసింది. అణచివేత  లేకుండా అధికారాని కి హంగు సమకూరదని భావించే ఏలికలు, ఆ విలువలకు తూట్లు  పొడిచారు, నల్లచట్టాలు తయారు చేశారు. సభ్యప్రపంచానికి భయపడి దొంగచాటు  చట్టవ్యతిరేక శిక్షాస్మృతులను అమలుచేయసాగారు. &lt;br /&gt;&lt;br /&gt;ఇంతటి మానవీయ ప్రస్థానం తరువాత కూడా ప్రపంచంలో చాలా దేశాలు మరణశిక్షను  అనివార్యమైనదిగానే పరిగణిస్తున్నా యి. చాలా కొద్దిదేశాలు మాత్రం  మరణశిక్షను తాము అమలుచేయకపోవడమే కాక, ఇతరులు అమలుచేయడానికి సహకా రం కూడా  ఇవ్వడం లేదు. మరణశిక్షను చట్టంలో రాసుకున్న దేశాలన్నీ కూడా దాన్ని  ఉత్సాహంగా, ఉధృతంగా అమలుచేయడం లేదు. అమెరికా, చైనా వంటి దేశాలు  మరణశిక్షలను నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉండగా, భారతదేశం అరుదుగా మాత్రమే  అమలుచేస్తుంది.  అయినంత మాత్రాన, భారత్‌లో అనధికార మరణశిక్షలు అమలుకావ డం లేదని అర్థం  చేసుకోగూడదు. 2004 ఆగస్టు 14 వ తేదీన ధనుంజయ చటర్జీ అనే నిం దితుడిని  కోల్‌కతాలో ఉరితీశారు. ఆ తరువాత ఈ ఏడు సంవత్సరాలకాలంలో మరో మరణశిక్ష ఏదీ  అమలు కాలేదు. సెప్టెంబర్9 వతేదీన రాజీవ్ హత్యకేసులో నిందితులు ముగ్గురిని  ఉరితీస్తే, అది తమిళనాడులో పదహారేళ్ల తరువాత అమలు జరిగిన శిక్ష అవుతుంది. &lt;br /&gt;&lt;br /&gt;ఎంత అరుదుగా అమలుచేస్తున్నదయినా, ఎంతటి ఘోరనేరాలలో అయినా మరణశిక్షల విషయంలో  ఇటీవలి దాకా మన సమాజం కారుణ్యదృష్టినే ఎక్కువ ప్రదర్శించింది. మరణశిక్ష  అంటే ముందే బంధించి ఉంచిన ఖైదీని ఒక నిర్ణీత తేదీన ప్రభుత్వ యంత్రాంగం  ద్వారా హతమార్చడం. అటువంటి ప్రక్రియ సామాన్యప్రజానీకంలో సైతం  సంపూర్ణసమ్మతిని పొందలేదు. ఇక ఉదార ప్రజాస్వామిక సంస్థలు, హక్కుల ఉద్యమాలు  మరణశిక్షను ఒక సూత్రబద్ధవైఖరితో వ్యతిరేకిస్తాయి.  మరణశిక్షను వ్యతిరేకించడమంటే, ఎటువంటి నేరాలు చేసిన వ్యక్తి విషయంలో అయినా  మరణశిక్షను వ్యతిరేకించడమే. నేరాలను బట్టి వైఖరుల్లో మార్పు ఉండదు. అలాగే,  మరణశిక్షను వ్యతిరేకించడమంటే, అందుకు కారణమయిన నేరాన్ని సమర్థించడం కానీ,  అందులో భాగస్వామి కావడం కానీ కాదు. నేరమూలాలను, వాటి నిరోధానికి సంబంధించి  ప్రత్యామ్నాయ ఆలోచనలు కలిగి ఉండడం. &lt;br /&gt;&lt;br /&gt;పెరారివలన్, శంతన్, మురుగన్ - ఈ ముగ్గురికీ రాజీవ్‌గాంధీపై వ్యక్తిగతమైన  వైరం ఏమీ లేదు. వారు ఆ నేరంలో నిజంగా భాగస్వాములయి ఉంటే, అందుకు కారణం  వారు భాగస్థులైన ఎల్‌టీటీఈ ఉద్యమం. ఇప్పుడు ఆ ఉద్యమం లేదు, ఆ సంస్థ లేదు.  రాజీవ్ హత్యకేసులో మొదటగా పేర్కొనగలిగిన ముద్దాయిలందరూ హతులయ్యారు. టైగర్ల  ఉద్యమాన్ని శ్రీలంక ప్రభుత్వం తుడిచిపెట్టిన తీరుపై, అందుకు భారత్  సహకరించిన విధానం పై ఇప్పటికే తమిళులలో ఎంతో వేదన ఉన్నది.  ఈ దశలో ఆ ముగ్గురిని ఉరితీయడం అవసరమా? నేరనిరోధానికి అది పనికివస్తుందా?  సాంకేతిక ప్రతీకారం తప్ప మరో లక్ష్యమేమన్నా నెరవేరుతుందా? నేరమూలాన్నే  పట్టించుకుంటే, టైగర్లను ప్రోత్సహించడం, వారిని అదుపుచేయాలనుకోవడం,  శ్రీలంకపై దాడికి వెళ్లడం- వంటి అనాలోచిత చర్యలకు పాల్పడిన  భారతప్రభుత్వాన్ని, దాని సారథులను రాజీవ్‌హత్యానేరం నుంచి మినహాయించగలమా?  భుల్లార్ టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డమాట నిజమే. కానీ, పంజాబ్ టెర్రరిజం  ఇప్పుడు సమసిపోయింది.  పంజాబ్‌లో రక్తపాతానికి నాటి కేంద్రప్రభుత్వం అనుసరించిన సంకుచిత  రాజకీయవ్యూహం కారణం కాదా? ఖలిస్థాన్ వాదాన్ని తుడిచిపెట్టడానికి అనుసరించిన  అణచివేత పద్ధతుల సంగతేమిటి? ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పునే దృష్టిలో  పెట్టుకుంటే కెపిఎస్ గిల్ మాత్రం బోనులో నిలబడనక్కరలేదా? ఢిల్లీ  హింసాకాండకు సంబంధించి ఒక ఉరిశిక్షా ఎందుకు లేదు? ఇక అఫ్జల్‌గురు  ఉదంతమయితే, ఒక ఉద్వేగపూరితమైన అంశంగా మారిపోయింది. ఒక మరణశిక్షను  అమలుచేయమని రాజకీయపార్టీలు, సమాజంలో కొన్ని శ్రేణులు డిమాండ్ చేయడం  అఫ్జల్‌గురు కేసుతోనే మొదలయింది.  పార్లమెంటుపై దాడిలో నిజంగా అతని పాత్ర ఉన్నదా, ఉన్నా అంతగా ఉన్నదా?- అన్న  ప్రశ్నలను పక్కనబెడదాం. శిక్ష న్యాయమైనదే అనుకుందాం. కాశ్మీర్‌తో ముడిపడిన  ఆ శిక్షను అమలుచేయడానికి ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం వ్యవహరించడానికి  ఎందుకు అనుమతించకూడదు? రవీంద్ర మహత్రే అనే దౌత్య ఉద్యోగిని జెకెఎల్ఎఫ్  తీవ్రవాదులు లండన్‌లో హతమార్చిన వెంటనే ప్రతీకార దృష్టితో మగ్బూల్ భట్ అనే ఆ  సంస్థ నేతను ఉరితీయడమే కదా, కాశ్మీర్‌లో మరోసారి అగ్ని రాజేసింది? చర్చల  ప్రక్రియో, శాంతి ప్రక్రియో ఎంతో కొంత సాగుతున్న తరుణంలో- అఫ్జల్ గురు  విషయంలో కావలసింది విశాలమైన దృష్టీ, దీర్ఘకాలికమైన దృక్పథమూ కాదా? &lt;br /&gt;&lt;br /&gt;కానీ, మరణశిక్షను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఇప్పుడు కష్టతరమైపోయింది.  ఎవరికి కావలసిన వారి గురించి వారే మాట్లాడుకోవాలి తప్ప, సాధారణమైన మానవీయ  దృష్టి లోపిస్తున్నది. ఆ ముగ్గురి గురించి తమిళులు మాట్లాడతారు, అఫ్జల్  గురించి కాశ్మీరీలు, భుల్లార్ గురించి పంజాబీలు మాట్లాడతారు. ఒక విలువగా  మరణశిక్షను వ్యతిరేకిస్తూ మాట్లాడే పరిస్థితులు మాత్రం లేవు. దొరికిన  బందీలను తక్షణం హతమార్చాలని, విచారణ తతంగం లేకుండా ఉరితీయాలని కోరుకునే  తత్వం ప్రజల్లో పెరిగింది. నాగరికతా ప్రయాణంలో, ప్రజాస్వామ్యప్రస్థానంలో  సమకూర్చుకున్న న్యాయవిలువలనే కాదనుకునేధోరణి ఇది. అన్నిటికంటె ప్రమాదకరమైన  పరిమాణం ఇది. &lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-4630159685042988223?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/4630159685042988223/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_31.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4630159685042988223'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/4630159685042988223'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_31.html' title='ప్రభుత్వాలకు ప్రతీకారాలు ఉండవచ్చునా?'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-5480213069471444732</id><published>2011-08-23T05:07:00.000-07:00</published><updated>2011-08-23T05:07:35.151-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 21 Aug 2011'/><title type='text'>అవినీతి సారాంశం అర్థమయిందా అన్నా !</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="headline" style="text-align: justify;"&gt;&lt;h1&gt; &lt;/h1&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; రామ్‌లీలా మైదానంలోని గద్దెపై పలచటి పరుపు మీద తెల్లటి వస్త్రాలు, టోపీ  ధరించి బాలీసులను ఆనుకుని బాసింపట్టు వేసి కూర్చున్న అన్నా హజారే ఒక  వర్తమాన వాస్తవంగా మాత్రమే కాదు, చారిత్రక స్మ­ృతిగా కూడా కనిపిస్తున్నారు.  ఆయనకు సమీపంలో కూర్చుని భజనలు చేస్తున్నట్టు నినాదాలు చేస్తున్నవారు,  పాటలు పాడుతున్నవారు, మైదానం అంతా నిండి కోలాహలంగా కదలాడుతున్న వారు- ఏం  జరుగుతున్నదక్కడ? మల్టీకలర్ హైడెఫినిషన్ డిజిటల్ యుగంలో, తెగిపోయిన, గీతలు  పడి మాసిపోయిన బ్లాక్అండ్ వైట్ ఫిల్మ్ లాగా ఏమిటా దృశ్యం? ఇదంతా మన  జ్ఞాపకంలో ఉన్నదే, ఎప్పుడో మనం వదిలివేసినదే, మనకు తెలియకుండానే మనం  బెంగపడుతున్నదే, కాలనాళికలో కుంగిపోయి బలహీనంగా లీలగా వినిపించే సంగీతమే. &lt;br /&gt;&lt;br /&gt;అన్నా చేస్తున్న ఉద్యమం ఎందుకు జరుగుతున్నదన్నది పక్కనబెడితే, అది  సృష్టిస్తున్న చిహ్నాలు ఆసక్తికరమైనవి. సంపద వృద్ధినీ, నిట్టనిలువు  అభివృద్ధినీ, నలువరసల మహారహదారులనీ, సర్వవ్యాప్తమై పోయిన శ్వేతవస్తు  సంచయాన్ని ఆరాధిస్తూ వస్తున్న సమాజానికి, స్ఫురద్రూపి కాని డాంబికాలు లేని,  బక్కపలచని, వయసు మళ్లిన వ్యక్తి ఏ జ్ఞాపకాలను రగిలించి నేత  కాగలుగుతున్నాడు? సకల రాజకీయ వేదికలపై సమస్త విలువలూ లుప్తమైపోయి,  ఆధారపడడానికి ఏ ఆశా లేక ఆరాధించడానికి ఏ వ్యక్తీ దొరక్క నిరాశలో ఉన్న  వారికి బహుశా అతను ఆలంబనగా కనిపించి ఉంటారు. &lt;br /&gt;&lt;br /&gt;పుస్తకాలలో చదువుకుని, పెద్దల జ్ఞాపకాలలో తడుముకుని, సినిమాలలో  ఉద్వేగపూరితంగా పునఃసృష్టించుకుని పులకించిపోయిన జాతీయోద్యమ దృశ్యాలను  అక్కడ గుమిగూడినవారు అభినయిస్తున్నారా? లేక, అరబ్, &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ఆఫ్రికన్ దేశాలలో  వెల్లువెత్తిన మల్లెల విప్లవాలకు ఇక్కడ అంటుగడుతున్నామనుకుంటున్నారా?  పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. అలాగని, కనిపిస్తున్నదాన్ని మాత్రమే  నమ్మడం కష్టం. అన్నాహజారే ఉద్యమం ద్వారా జనం తమ జీవితాల్లోకి ఆదర్శవాదాన్ని తిరిగి  తెచ్చుకుంటున్నారని యోగేంద్ర యాదవ్ అనే రాజకీయ విశ్లేషకుడు అన్నాడు. ఆ  వ్యాఖ్యలో కొంత వాస్తవమూ ఉన్నది,&amp;nbsp;  కొంత అతిశయోక్తీ ఉన్నది. సమాజంలో ఆదర్శాలు, విలువలు క్షీణించిపోయి  ఉండవచ్చును కానీ, ఎక్కడా ఏ చిన్న బృందంలోనూ ఏ సమూహంలోనూ సంస్థలోనూ లేకుండా  పోయాయనడం సరికాదు. ప్రధాన స్రవంతి రాజకీయాల గురించి, సామాజిక జీవనం గురించి  మాట్లాడితే స్థూలంగా యోగేంద్ర వ్యాఖ్య నిజమే కావచ్చు. కానీ, ఆయన చెప్పిన  జనం ఎవరు? సామాన్యజనం నిజంగా అన్నా హజారే ఆదర్శాన్ని, పోరాటాన్ని  పట్టించుకుంటున్నారా, అసలు వారికి లోక్‌పాల్ వ్యవస్థ గురించి, అవినీతి  నిరోధక యంత్రాంగం ఆవశ్యకత గురించి అవగాహన ఉన్నదా? &lt;br /&gt;&lt;br /&gt;మధ్యతరగతి, విద్యాధిక వర్గాలు అధికంగా మమేకం అవుతున్న ఉద్యమం చాలా కాలం  తరువాత వచ్చిందనవచ్చు. స్వాతంత్య్రోద్యమం అని మనం చెప్పుకుంటున్నదాంట్లో  కూడా విశాల ప్రజానీకం పాలుపంచుకున్నదెంతో, మధ్యతరగతి ప్రజలు, వివిధ సంఘటిత  శ్రేణులు పాల్గొన్నదెంతో సమీక్షించుకోవలసిందే. లోక్‌నాయక్ జయప్రకాశ్  నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణ విప్లవ ఉద్యమంలో రకరకాల సామాజిక శక్తులు  వారి విడి విడి ఆకాంక్షలతో సహా పాలుపంచుకున్నందువల్ల ప్రజల పాత్ర  విస్త­ృతంగా కనిపిస్తుంది తప్ప, నాటి ఆందోళనకు ప్రధాన చోదకశక్తులు  మధ్యతరగతి విద్యాధిక వర్గమే. సంపూర్ణ విప్లవం, అత్యవసర పరిస్థితి తరువాత  దేశంలోని మధ్యతరగతి విరాజకీయీకరణ పెరిగిపోయింది. &lt;br /&gt;&lt;br /&gt;నూతన ఆర్థిక విధానాల తరువాత ఈ తరగతి ఆర్థికంగా పైపైకి ఎగబాకే తాపత్రయంలో  పడిపోయింది. నైతికంగా దిగజారిపోయింది. వ్యవస్థాత్మకమైన అవినీతితో ఆ  శ్రేణుల అనుబంధం గాఢమై పోయింది. ప్రయోజనాలను వదులుకోకుండానే, తమ  అస్తిత్వాన్ని, నైతికతను నిలబెట్టగలిగిన ఆధారాల కోసం వారి అన్వేషణ మాత్రం  మిగిలింది. డొల్ల దేశభక్తి, పదునులేని నిరసనరూపాలు, అమూర్తమైన అవినీతిమీద  అసంబద్ధమైన వ్యతిరేకత- వారికి సరికొత్త నైతికతను సమకూర్చి పెట్టిన  వైఖరులు. అన్నా హజారేకు జై కొడుతున్న కార్పొరేట్, సాఫ్ట్‌వేర్, ఫేస్‌బుక్  తరం కూడా ఈ అనివార్యత నుంచే ప్రవర్తిస్తోందా? &lt;br /&gt;&lt;br /&gt;రాజకీయనాయకుల అవినీతి సరే. బ్లాక్‌మార్కెటీర్లను వెనుకేసుకురావడం  దగ్గరనుంచి స్మగ్లర్లను పోషించడందాకా తొలితరాల రాజకీయనేతలు చేసి ఉండవచ్చు.  ఇప్పటి నేతలువేరు. ఇప్పటి పరిస్థితులువేరు. ఇప్పటి అవకాశాలు వేరు.  సమాజానికి, ప్రభుత్వానికి చెందిన వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు  కట్టబెట్టగలిగే వెసులుబాటు ఇప్పటి పాలకులకు వచ్చింది. ప్రభుత్వమే గతంలో  నిర్వహిస్తూ ఉండిన అనేక బాధ్యతలను, అభివృద్ధి పనులను ఇతరులకు  అప్పగించగలిగిన విధానచట్రం అమలులోకి వచ్చింది.  మంచిచెడ్డలన్నిటినీ మార్కెట్‌శక్తులే చూసుకుంటాయని, ప్రభుత్వం ఒక వేదికగా  మాత్రమే పనిచేయాలనే వాదన చెలామణీలోకి వచ్చింది. నిబంధనలూ నియమాలూ  నిర్బంధానికి గుర్తులనీ, నిర్నిబంధమైన స్వేచ్ఛే అభివృద్ధికి శ్రీరామరక్ష  అనే సూక్తికి పట్టం దొరికింది. ఈ సరళీకృత, ఉదారవాద ఆర్థికరాజ్యంలో- నేతలు,  పారిశ్రామికవేత్తలు, బ్రోకర్లు- మధ్యతరగతిలోకి ఎగువశ్రేణుల వారు  పట్టపగ్గాల్లేకుండా విహరించారు.  ప్రభుత్వ కంపెనీలు కారుచవకగా చేతులు మారిపోయాయి. స్టాక్‌మార్కెట్‌లో  రంకెలేసిన ఆంబోతులు దండుకున్నంత దండుకుని చతికిలపడ్డాయి. ప్రభుత్వం  చేతుల్లో ఉన్న భూములకు రెక్కలొచ్చాయి. ఔట్‌సోర్సింగ్ మనుషుల ఎగుమతిని,  డబ్బుల దిగుమతిని పెంచింది. సాఫ్ట్‌వేర్ బూమ్, దేశంలోనే వాలిన బహుళజాతి  కాల్‌సెంటర్లు సరికొత్త ఉద్యోగతరగతిని సృష్టించాయి. నీతి అవినీతుల  నిర్వచనాలే మారిపోయాయి. డబ్బుకు కొత్త మారకం విలువ ఏర్పడింది. &lt;br /&gt;&lt;br /&gt;జన లోక్‌పాల్ బిల్లు వస్తే ఏం చేస్తావు చెప్పు అన్నా హజారే?  తప్పుచేసినవాడిని ఏం చేయాలో చెప్పే బిల్లు అది. తప్పు జరగకుండా ఏమి  చేస్తావు చెప్పు? తప్పు ఎట్లా జరుగుతోందో చెప్పు? రాత్రికిరాత్రి  సంపన్నులైనవారి సక్సెస్ స్టోరీలను పారాయణం చేసే తరానికి ఎట్లా నీతిని  రంగరించిపోస్తావో చెప్పు. చేతుల మీదుగా జన ఖజానాలను అన్యాక్రాంతం చేయగలిగే  అధికారం ఉన్నవాడు నోరుకట్టుకుని ఎట్లా ఉంటాడో చెప్పు. లోక్‌పాల్ ఒక బూటకపు  బిల్లు నిజమే.  అధినాయకుడిని మినహాయించే అస్త్రం కోరలు పీకిన ఆయుధం. పార్లమెంటును,  న్యాయవ్యవస్థనీ మించిన హోదా కావలనుకోవడం తప్ప, జనలోక్‌పాల్ మెరుగైన  చట్టమే. ఏదీ లేని చోట ఏదో ఒక వ్యవస్థ ఉండాలి. రాజకీయపోరులో భాగంగా  అవతలిపక్షం అవినీతిని ఎండగట్టడానికైనా ఒక సాధనం కావాలి. నీ దీక్ష ఫలించి, ఆ  చట్టం రానీ. ధర్మం కుంటిగానైనా ఒంటికాలితో నడవనీ. &lt;br /&gt;&lt;br /&gt;ఇప్పుడు హజారే భూసేకరణ గురించి మాట్లాడబోతున్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా  అధికారిక భూకబ్జాలు సాగితే ఊరుకోమంటున్నారు. ఎన్నికల సంస్కరణల గురించీ  మాట్లాడుతున్నారు. అమూర్తమైన అవినీతి నుంచి, మూలకారణాల వైపు చిన్నగానైనా  అడుగులు వేస్తున్నారు. లంచాలు తిన్నా తినకపోయినా, ప్రతిఫలం అందుకున్నా  అందుకోకపోయినా, కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అవినీతే. &amp;nbsp; ఒక్కపైసా తినకపోయినా మన్‌మోహన్ అధిష్ఠించింది అవినీతి సింహాసనమే. కాసిని  తిండిగింజలు, నెలకు కాస్త పింఛను ప్రజలకు విదిలించి, వ్యక్తిగతంగా లబ్ధి  ఇచ్చే నాలుగు పథకాలు అందించి - జాతిసంపదను కొల్లగొట్టే రాజకీయ విధానమే  పచ్చి అవినీతి. వాటి గురించి అన్నా మాట్లాడడం మొదలుపెడితే, కత్తులు  ఝళిపించినంత ఉద్వేగంతో కొవ్వొత్తులు వెలిగించిన నడిమితరగతి ఆయన వెంట  వస్తుందా? &lt;br /&gt;&lt;br /&gt;అన్నాను స్వాతంత్య్ర సమరయోధుడని కూడా మీడియా అభివర్ణిస్తున్నది. పాపం 1947  నాటికి ఆయన పదిసంవత్సరాల బాలుడు. తాను గాంధేయవాదిని మాత్రమే అని ఆయన  చెప్పినా సరే, ఆయనే గాంధీ అన్నట్టుగా అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు.  పోలిక ఎంత వరకు సమంజసమో పక్కన బెడదాం కానీ, ఇప్పుడు దేశరాజకీయ, సామాజిక పటం  మీద ఒక గాంధీ అవసరం మాత్రం ఉన్నట్టుంది.&amp;nbsp;  గాంధీ రాజకీయాల్లోకి నైతికతను ఒక అంశంగా తేవడమే కాదు, సమాజంలోని అన్ని  రంగాలకూ ఏదో ఒక స్థాయి నైతికతను విధించారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే,  రాజకీయనేతలను, ఉద్యోగవర్గాలను మాత్రమే కాక, అత్యాశాపరులైన కార్పొరేట్  ధనికస్వాములను కూడా అవినీతిపరులుగా పరిగణించేవారు. దేశాన్ని పరాధీనం  చేస్తున్న విధానాలను కూడా దోషిగా నిలబెట్టేవారు.&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-5480213069471444732?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/5480213069471444732/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_23.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5480213069471444732'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5480213069471444732'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_23.html' title='అవినీతి సారాంశం అర్థమయిందా అన్నా !'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-8503090780409919226</id><published>2011-08-15T06:20:00.000-07:00</published><updated>2011-08-15T06:20:45.644-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 14 Aug 2011'/><title type='text'>వలపోతలు కాదు, తెలుగు తలపోతలు కావాలి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;   &lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;   &lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; ఈ మధ్యే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసిన అరవిందరావులో  పెద్దగా ప్రచారం కాని కోణం సంస్కృతాభిమానం. ఈ మధ్యే ఆయన సంస్కృతంలో  పీహెచ్‌డీ తీసుకున్నారు కూడా. కొద్దిరోజుల కిందట ఒక చిన్న సమావే శంలో  మాట్లాడుతూ ఆయన, మన రాష్ట్రంలో వేదపండితులు చాలా మంది ఉన్నారని అనుకుంటాము  కానీ, వేదానికి అర్థం చెప్పగలిగినవారు కానీ, వ్యాఖ్యానించగలిగిన వారు కానీ  వేళ్లమీద లెక్కించేంత మందే ఉన్నారని, కొన్ని రోజుల్లో వారు కూడా లేకుండా  పోతారని బాధపడ్డారు. ఆ పరిస్థితిని నివారించడానికి ఆయన, మరికొందరు కలసి ఏవో  గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఫలితం పెద్దగా ఆశావహంగా ఉన్నట్టు  కనిపించడం లేదు. &lt;br /&gt;&lt;br /&gt;సంస్కృతం సరే, మన రాష్ట్రంలో కాకపోతే, మరో రాష్ట్రంలో, మరో దేశంలో దాన్ని  నిశితంగా అధ్యయనం చేసినవారు, చేస్తున్నవారు ఉన్నారు. వైదిక వాఙ్మయానికి  ధార్మికమైన పార్శ్వం ఉన్నందున, దాని పరిరక్షణకు నడుం కట్టగలిగినవారు  తగినంతమంది ఉంటారు. కానీ, తెలుగు భాషాసాహిత్యాల సంగతి ఏమిటి? దాని  భవిష్యత్తు ఏమిటి? కావ్యాలను ప్రబంధాలను ప్రతిపదార్థం తెలిసి  బోధించగలిగినవారు, వ్యాఖ్యానించగలిగినవారు విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా  లేనట్టేనని విశ్రాంతదశలో ఉండి తెలుగు సాహిత్యబోధన గురించి పట్టింపు ఉన్న  పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో ఉన్న తెలుగు పౌరాణిక, కావ్య,  ప్రబంధ వాఙ్మయానికి సజీవులుగా ఉన్న పండితుల ద్వారా సాధికారమైన వ్యాఖ్యలు,  ప్రతిపదార్థాలు రాయించకపోతే, భవిష్యత్తు తరాలు నష్టపోతాయని వారు  హెచ్చరిస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;బోధించే గురువులు లేకపోవడమే కాదు, నేర్చుకునే శిష్యులు కూడా కరవవుతున్నారు.  భాషాస్వరూపాన్ని నిర్ధారించుకోవడానికి పరామర్శ పండితులే కాదు, పరామర్శ  గ్రంథాలు కూడా అందుబాటులో లేవు. ప్రామాణికమైన ఒక్క మహానిఘంటువు తెలుగుకు  లేదు. తెలుగు మాధ్యమమే పాఠశాలలనుంచి నిష్క్రమిస్తున్న వేళ, అనేక శాస్త్ర  సాంకేతిక అంశాలపై పదజాలం, పరిభాష తెలుగులో కొత్తగా రూపొందడమే ఆగిపోయింది.  గతంలో రూపొందిన పరిభాష కూడా చెలామణీలో లేకుండా పోయింది. పౌరవ్యవహారాలకు  సంబంధించి కూడా తెలుగును &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ప్రామాణికంగా వాడడం గురించిన శిక్షణ ఏ స్థాయిలోనూ  విద్యార్థులకు లభించడం లేదు.  ఇక అధికార భాషగా తెలుగు వినియోగానికి పునాదులు ఎట్లా పడతాయి? పరభాషలనుంచి  ఆదానమైన పదజాలాన్ని ఎంతమేరకు రచనల్లో వినియోగించవచ్చునో, సభ్యతకు  సంబంధించిన సరిహద్దులేవో నిర్ణయించే వ్యవస్థలేవీ లేవు. తెలుగు  భాషాసాహిత్యాలలో గట్టి పునాదులు వేసే ప్రాచ్య విద్యాసంస్థలన్నిటినీ ఒకదాని  తరువాత ఒకటి మూసివేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు నాసిరకంగా  ఉంటున్నాయి. చెప్పుకోదగ్గ పరిశోధనావ్యాసాలు ఈ మధ్యకాలంలో వచ్చినట్టు  తెలియదు. &lt;br /&gt;&lt;br /&gt;పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నారని, తెలుగు పత్రికలు చదవడం కూడా  రావడం లేదని, పరదేశాలకు వెళ్లినవాళ్లయితే, అక్కడే స్థిరపడిపోయి  మాతృదేశాన్ని భాషను మరచిపోతున్నారని బాధపడేవారికి కొదవలేదు. తెలుగుభాషను  రక్షించుకోవాలని అనుకోని వారెవరూ కనిపించరు. కానీ, అది జరిగేదెట్లా?  పత్రికల్లో శీర్షికల్లో ఇంగ్లీషు వాడకం తగ్గిస్తే, టీవీ యాంకర్లు యాసను  సవరించుకుంటే, వత్తులు పలికితే, బోర్డుల్లో తెలుగు తప్పుల్లేకుండా రాస్తే-  తెలుగు ఉద్ధరణ జరిగిపోతుందా? ప్రస్తుతం వ్యాజ్యంలో పడిపోయింది కానీ,  తెలుగును ప్రాచీనభాష చేస్తే మాత్రం, ఆ హోదాను సమర్థంగా వినియోగించుకోగల  సంకల్పం, శక్తీ తెలుగువారికి ఉన్నాయా? అసలు తెలుగు ఆధునిక భాష కావాలా,  విశిష్ట భాష కావాలా?- వేర్వేరు స్థాయిల్లో రెండూ కావాలా? ఎంతమందికి స్పష్టత  ఉన్నది? &lt;br /&gt;&lt;br /&gt;పదే పదే చెప్పుకున్న విషయమే కానీ, తమిళులకున్న భాషాభిమానంతో మనం పోలిక,  పోటీ పెట్టుకోగూడదు. వారి భాషాజాతీయవాదం బలమైన పునాదులపై నిర్మితమైనది.  అక్కడి హేతువాద ఉద్యమం, బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమం, ద్రావిడ  ఉద్యమం-వేరువేరు కాదు. ఆర్యత్వాన్ని, వైదికాన్ని వ్యతిరేకించినవారు,  ప్రాచీన తమిళ సంస్క­ృతిని సాహిత్యాన్ని మాత్రం అభిమానించారు. తమిళాన్ని  ప్రేమించడం అంటే, తమిళులు తమను తాము ప్రేమించుకోవడం, తమ సమాజాన్ని ముందుకు  నడిపించడానికి చేసే ప్రయత్నం. భాష అంటే కొన్ని అక్షరాలు, వాటితో నిర్మించే  పదాలూ వాక్యాలూ కాదు. భాష అంటే దాన్ని మాట్లాడే ప్రజలు, దాన్ని మాట్లాడిన  ప్రజల చరిత్ర, సంస్క­ృతి. రాజకీయమైన ఏకతకు భాష అవసరమైనప్పుడు, భాషావాదం  కూడా రాజకీయ ఉద్యమమే అయింది. &lt;br /&gt;&lt;br /&gt;తెలుగులో విద్యావకాశాల కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన తెలంగాణ ప్రజలు కూడా  ఇప్పుడు స్వచ్ఛందంగా తెలుగును వదిలి క్రమంగా ఆంగ్లమాధ్యమాన్ని  స్వీకరిస్తున్నారు. నాడు, తెలుగు విద్య కోసం చేసిన పోరాటం, నిజాం పాలనపై  తెలంగాణ ప్రజల రాజకీయ నిరసన. రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాలలో కూడా ప్రజలను  ఎవరూ తెలుగు మాధ్యమాన్ని వదలమని నిర్బంధించలేదు. మన చేతిలో లేని అనేక  పరిణామాలు ముంచుకువచ్చి, ప్రజలు తమ ప్రాధాన్యాలను మార్చుకోవలసిన పరిస్థితి  ఏర్పడింది. మూలకారణాలను స్ప­ృశించకుండా, ఇప్పుడు చరిత్రను ఎట్లా తారుమారు  చేయగలం? &lt;br /&gt;&lt;br /&gt;తెలుగువారిలో అనైక్యతఉన్నదని, ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకోలేని  అసూయాకార్పణ్యాలు ఉన్నాయని చెప్పుకోవడం మనకు అలవా టు. లోతుగా ఆలోచించి చేసే  వ్యాఖ్య కాదు అది. కాకపోతే, తమిళులతో పోలిస్తే తెలుగుసమాజంలో కొన్ని  ప్రతికూల పరిస్థితులున్నాయి. ప్రాంతాల వారీగా, కులా ల వారీగా అనేక  మాండలికాలు తెలుగులో ఉన్నాయి. వాటి మధ్య స్నేహపూర్వకమైన సమన్వయం జరగలేదు.  ప్రమాణభాషలో వివిధ ప్రాంతాల, వర్గాల ప్రత్యేక వాడుకలను చేర్చుకోలేదు.  భాషాసాహిత్యాలను కొన్ని ఉన్నత సామాజిక వర్గాల ప్రత్యేక రంగాలుగా భావించి,  ఇతరులు అందులోకి రాకుండా చేశారు.&amp;nbsp;  ఇప్పుడు ఆ వర్గాల వారే అవకాశాలు రాగానే, సాహిత్యాన్నీ భాషనీ ఎడమకాలితో  తన్ని డాలర్లను లెక్కబెట్టుకుంటున్నారు. ఇవాళ భాషను రక్షించవలసింది,  వెనుకబడిన ప్రాం తాల వారూ కులాలవారూ మాత్రమే. ప్రభుత్వ స్కూళ్లలో  తెలుగుమాధ్యమంలో చదువుకుంటున్నది వాళ్లే, తొలిసారి అక్షరాలను ఆలింగనం  చేసుకుని, తమ గుండెగోడుకు సాహిత్యవ్యక్తీకరణలు ఇస్తున్నది వాళ్లే. భవిష్యత్  రచయితల్లో అత్యధికులు వాళ్లే. కానీ, వాళ్లకు సంప్రదాయ తెలుగు సాహిత్యం  పునాది తగినంత లభించడం లేదు. ఇంతకాలం అంచులకే ఉండిపోయిన సమాంతర  సంప్రదాయసాహిత్యాన్ని వెలికి తీయడానికి కావలసిన ప్రేరణ, ప్రోత్సాహం కూడా  వారికి దొరకడం లేదు. &lt;br /&gt;&lt;br /&gt;తెలుగు సమాజం- తాము వ్యవహరించే భాషను ప్రజాస్వామ్యీకరించుకోవడం మొదటి  కర్తవ్యం. ఆ తరువాత ఆధునిక అవసరాల రీత్యా, భాషను ఆధునీకరించుకోవడానికి,  ప్రమాణీకరించుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. తెలుగులోని అన్ని రకాల  వ్యవహారాలనూ క్రోడీకరించి భాషస్వరూపాన్ని ఆవిష్కరించగలిగే మహానిఘంటువు  నిర్మాణం పై ప్రయత్నాలకు ఆవశ్యకమైన ప్రాతిపదిక. నిఘంటు నిర్మాణం ఒకసారి,  ఒకేసారి జరిగిపోయేది కాదు. అందుకు శాశ్వత పీఠం ఏర్పాటు కావాలి. &amp;nbsp; తెలుగులో శాస్త్ర వైజ్ఞానిక రంగాలకు చెందిన మౌలిక ఆలోచనలను వ్యక్తం  చేయడానికి కావలసిన పరిభాషా నిర్మాణం జరగాలి. ఈ నిర్మాణంలో కేవలం పండితులను  మాత్రమేకాక, వివిధ సామాజిక వర్గాలను భాగస్వాములను చేయాలి. తెలుగుకోసం ఒక  మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయడమో, ప్రత్యేక నిధుల కేటాయింపులో - జరగవలసిందే.  కానీ, దాని కంటె ముందు- తెలుగుకు వచ్చిన కష్టమేమిటో, దానికి నివారణ ఏమిటో  శాస్త్రీయమైన మదింపు అవసరం. లేకపోతే, తెలుగుభాష తలపోతలు- సెలవులు  వచ్చినప్పుడు జరుపుకునే సాంస్క­ృతిక కార్యక్రమాల్లాగా, అప్పుడప్పుడు  కూర్చుని గుండెలు బాదుకునే తంతు లాగా మారిపోయే ప్రమాదం ఉన్నది.&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-8503090780409919226?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/8503090780409919226/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_15.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/8503090780409919226'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/8503090780409919226'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_15.html' title='వలపోతలు కాదు, తెలుగు తలపోతలు కావాలి'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-5958445404344278887</id><published>2011-08-13T20:05:00.000-07:00</published><updated>2011-08-13T20:05:53.402-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 07 Aug 2011'/><title type='text'>జనసంకటం, రాజకీయ చెలగాటం!</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="text-align: justify;"&gt;రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చితి తొలగాలని కోరుకునేవారికి చిదంబరం  లోక్‌సభ ప్రకటనలో ఏదన్నా ఒక సానుకూల అంశం కనిపించి ఉంటే, అది ఒకే ఒక్కటి.  ఏకాభిప్రాయ సాధనకు 'రెండువారాలు పట్టవచ్చు, రెండునెలలు పట్టవచ్చు' అన్న  తరువాత రెండేళ్లయినా పట్టవచ్చు అంటాడేమో అని భయపడ్డవారికి 'మూడు నెలలు  పట్టవచ్చు' అని చిదంబరం అనడం ఎంతో కొంత ఊరటే కదా? ఆయన మటుకు ఆయన గరిష్ఠంగా  మూడునెలల వ్యవధి కోరుతున్నారు.&amp;nbsp; &lt;/div&gt;&lt;div style="text-align: justify;"&gt;&lt;br /&gt;ఆ వ్యవధి సమస్య పూర్తి  పరిష్కారానికి అనుకుంటే పొరపాటే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న  సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి అంత సమయం అవసరం పడవచ్చని ఆయన  అంచనా. ఆ తరువాత, రాష్ట్ర విభజన బంతిని రాష్ట్రంలోకే విసిరిన చిదంబర  విన్యాసాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తక్కిన పార్టీలలో అటువంటి ప్రక్రియ  ఎప్పుడు మొదలయ్యేను, ఎప్పటికి పూర్తయ్యేను? కాంగ్రెస్ ముందుగా చెబితేనే  తాము చెబుతామని &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;భీష్మించుకున్న తెలుగుదేశం పార్టీ అటువంటి సహకారం  అందిస్తుందా? ముందు చెప్పినవాళ్లకు ఒక ప్రాంతంలో మేలు, మరో ప్రాంతంలో కీడు  జరిగే అవకాశం ఉన్నప్పుడు - అధికారపార్టీని సంకటంలో పడేసే పరిస్థితిని  ప్రతిపక్షం ఉపయోగించుకోకుండా ఉంటుందా? ఏతావాతా తేలేదేమంటే, సమస్య సశేషం. కనుచూపుమేరలో పరిష్కారం లేదు.&lt;br /&gt;&lt;br /&gt;అందుకేనేమో శనివారం నాడు కెసిఆర్, 2014 గురించి మాట్లాడారు. రెండేళ్లే కదా,  ఎక్కడికి పోతారు, అప్పుడు చూపిద్దాం తడాఖా - అన్నారాయన. ఎన్నికల రంగం  ఆయనకు అనువైన క్షేత్రం. అందులో ఆయనకు స్థానబలం ఎక్కువ. వీధిపోరాటాలూ  మిలియన్‌మార్చ్‌లూ - వీటిమీద ఆయనకు గురి తక్కువ. చొక్కాలు చింపుకుంటేనే  ఉద్యమమా - అని పార్టీ పెట్టిన తొలిరోజుల్లోనే ప్రశ్నించిన కెసిఆర్‌ను,  తెలంగాణ ఉద్యమం చాలా దూరం తీసుకువచ్చింది. ఆయన నాయకహోదాకు భంగం  కలిగించకుండానే, పగ్గాలు మాత్రం పూర్తిగా ఆయన చేతిలో లేకుండా చేసే  పరిణామాలు పదేళ్లలో చాలానే జరిగాయి.&lt;br /&gt;&lt;br /&gt;రాజకీయమైన లాబీయింగ్, ఎన్నికల  పోరాటం- ఈ రెంటినే నమ్ముకోవడం కానీ, రాజకీయపార్టీలతో నిమిత్తం లేకుండా  కేవలం ప్రజా ఉద్యమాల మీదనే ఆధారపడడం కానీ తెలంగాణ వంటి ఆకాంక్షల విషయంలో  సరికాదని, రెంటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలనీ కూడా అవగాహన  పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న రకరకాల జెఏసీలు - ఈ  అవగాహననే సూచిస్తాయి. అయితే, ఇప్పటికీ, ప్రధాన స్రవంతి రాజకీయాలకూ, ప్రజా  ఉద్యమాలకూ నడుమ అంతర్గత వైరుధ్యమూ ఘర్షణా తీవ్రంగానే కనిపిస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;సకలజనుల సమ్మె - ఒక సరికొత్త భావన. ప్రజా ఉద్యమాలు కొత్త పోరాట రూపాలను  సృష్టించుకున్నట్టే, కొత్త పదాలను, పదబంధాలను కూడా సృష్టిస్తాయి. అటువంటి  వాటిలో సకలజనుల సమ్మె కూడా ఒకటి. 'చలో సీఎం ఇల్లు ముట్టడి' అని ఎమ్మార్పీస్  మొదటిసారి పిలుపు ఇచ్చినప్పుడు కూడా ఆ పదబంధం ఇంతే కొత్తగా వినిపించింది.  తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ముచ్చటపడవలసిన పోరాట  రూపం సకలజనుల సమ్మె. ఈ నెల రెండో పక్షం లో ప్రారంభమయ్యే ఈ సమ్మె తెలంగాణ  ఉద్యమానికి మరింత తీవ్రతను, ప్రభుత్వంపై మరిం త ఒత్తిడిని కలిగించనున్నది.  ఉద్యమంలో తమ భాగస్వామ్యం కోసం, ఉద్యమఫలితాలలో తమ వాటా కోసం పోటీపడుతున్న  విభిన్న రాజకీయశక్తులు పరస్పరం విధించుకుంటున్న ఒత్తిడుల మధ్య ఈ సమ్మె  జరుగనున్నది.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడంతో  మొదలైన రాజకీయ ఒత్తిడి, కాంగ్రెస్ రాజీనామాలతో పుంజుకున్నది. ఎంతో కష్టం  మీద ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారని, వారు దారితప్పకుండా చూడడమే తమ పని  అని తెలంగాణ ఉద్యమనాయకులు బహిరంగంగానే చెప్పారు. రాజీనామాలు చేసిన  ఎమ్మెల్యేలు, ఎంపీలకు మద్దతుగా కావచ్చు, వారు జారిపోకుండా దిగ్బంధనం  చేయడానికి కావచ్చు, విస్త­ృతమైన ఉద్యమకార్యాచరణను వివిధ వేదికలు  ప్రకటించాయి. అందులో భాగంగానే సకలజనుల సమ్మె ప్రతిపాదన ముందుకు వచ్చింది. &lt;br /&gt;&lt;br /&gt;రాజకీయపార్టీలకూ  ప్రజా ఉద్యమాలకూ ఉండవలసిన సంబంధం రీత్యా ఈ వ్యూహం ప్రశంసనీయమే. పైకి  వినిపిస్తున్న ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే, రాజకీయశక్తుల మధ్య  పరస్పరమైన ఒత్తిడి ఇంకా పనిచేస్తూనే ఉన్నది. కానీ, మారిన పరిస్థితులలో,  రాజకీయవాదుల కట్టుబాటు సందేహాస్పదం అయిన నేపథ్యంలో సమ్మె ప్రాసంగికత ఎంత,  ఫలితం ఎంత అన్నది చర్చనీయాంశాలుగా మారాయి. శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్  తిరస్కరించారు. మళ్లీ రాజీనామాలు చేయాలన్న డిమాండ్ కానీ, చేసే యోచనగానీ  బలంగా కనిపించడం లేదు. &lt;br /&gt;&lt;br /&gt;గతంలో మొదట రాజీనామా చేసి కాంగ్రెస్‌వారిని  అనివార్యస్థితికి నెట్టినట్టు, తెలుగుదేశం శాసనసభ్యులు ఈ సారి కూడా  చేస్తారా? చేయగలరా? సోనియా అనారోగ్యం వార్తలు వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్  తెలంగాణ ఎంపీలు లోక్‌సభకు వెళ్లకుండా పట్టుదల చూపిస్తున్నారు కానీ,  భావోద్వేగాలతో చేసినవన్న కారణం చెప్పి వారి రాజీనామాలను లోక్‌సభ స్పీకర్  నిరాకరిస్తే అప్పటి పరిస్థితి ఏమిటి? మళ్లీ రాజీనామాలు చేస్తారా? సోనియా  అస్వస్థులై ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని  భావిస్తారా? అప్పుడు సమ్మెకు, ఉధృత ఉద్యమానికి దిగిన ఉద్యోగులు,  విద్యార్థుల పరిస్థితి ఏమిటి? రాజీనామాల నడుమ, రాష్ట్రంలో మళ్లీ మొదలయిన  ఆత్మహత్యల నడుమ కూడా చిదంబరం ద్వారా నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడించిన  కేంద్రం వైఖరిని గమనించిన తరువాత, సమ్మెను అణచివేయడానికి రాష్ట్ర  ప్రభుత్వం చేస్తున్న సకల సన్నాహాలను చూస్తున్న తరువాత- సకలజనుల సమ్మె సమయమూ  సందర్భమూ ఉచితమైనదే అవుతుందా? నిజంగానే నిజంగానే అది అంతిమ ఫలితం  ఇస్తుందా? నిజానికి రాజీనామాల వంటివి ఒక పరాకాష్ట దశలో చేపట్టవలసిన బ్రహ్మాస్త్రాలు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ ఉద్యమం తీరుతెన్నులేమిటో కానీ, బ్రహ్మాస్త్రాల దాకా వెళ్లి,  తిరిగి వంటావార్పులకు దిగవలసివచ్చిన సందర్భాలు అనేకం. ప్రజల్లో ఆకాంక్ష ,  సహనం బలంగా ఉండడం వల్ల ఎన్నిసార్లైనా మళ్లీ మొదటికి రావడానికి  సంకోచించడంలేదు. సకలజనుల సమ్మె వంటి అత్యున్నత ఉద్యమరూపం పూర్తిగా విజయవంతం  కాకున్నా, విఫలం అయినా, ఫలితాలను సాధించలేకపోయినా- ప్రజల్లో కలిగే  నిస్ప­ృహ అధికంగా ఉంటుంది. సహాయనిరాకరణ సందర్భంగా, ఒంటరిగా ఉద్యమం బరువును  మోయవలసివచ్చిన గుణపాఠం ఉద్యోగవర్గాలకు ఉన్నది.  తెలంగాణ కోసమే  పుట్టిన రాజకీయపార్టీ, పదేళ్లు గడచినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను  నిర్మించుకోవడానికి, పార్టీకి వివిధ అంచెల యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడానికి  విముఖంగా ఉన్న స్థితిలో తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు  మాత్రమే ఉద్యమానికి స్థిరమైన బలగంగా ఉంటూ వచ్చారు. ఫలితంగా వచ్చిన  కష్టనష్టాలను భరిస్తూ వచ్చారు. ఇంకా ఆ పరిస్థితి కొనసాగవలసిందేనా- అన్న  ప్రశ్నలు ఉద్యోగనేతల నుంచే వినిపిస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;వివిధ రాజకీయశక్తులు, అనేక జేఏసీలు, వాటి మధ్య సామాజికకోణం నుంచి, నాయకత్వ  పోటీ నుంచి అనేక వైరుధ్యాలు. ఇవి కాక- ఉభయప్రాంతాల రాజకీయనేతల మధ్య  వాగ్యుద్ధాలు, ఆత్మాహుతిదళాల, ఆత్మరక్షణదళాల ప్రకటనలు, తెలంగాణ రాకపోతే  విషం పుచ్చుకుని చస్తానని బాధ్యతారహితంగా మాటతూలే ఉద్యమనేతలు, సమ్మెకు  సహకరించకపోతే భౌతికదాడులు చేయాలనే పిలుపులు, ప్రతిదాడులు చేస్తామనే  స్పందనలు- ఇవన్నీ తెలంగాణ సమస్యను మరింత సంక్లిష్టమూ ప్రమాదభ రితమూ  చేస్తున్నాయి. ఎట్లాగైనా హింస జరిగేట్టు చూసి అణచివేయాలని ప్రభుత్వం  చూస్తున్నది- అని కలవర పడుతున్న తెలంగాణవాదులూ ఉన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఎంతకాలమిట్లా, ఏదైనా గట్టిగా చేయాలని అసహనంతో ఉన్న ఉద్యమకారులూ ఉన్నారు.  మీడియాలో వచ్చే ప్రకటనలు చూసే గుండెలు పగులుతున్న యువకులూ ఉన్నారు. అయ్యా,  హింసకు మాటల్లోనూ చేతల్లోనూ ఆస్కారం ఇవ్వకండి, ఒక చిన్న సంఘటన జరిగిందా,  ఉద్యమం మళ్లీ నలభయ్యేళ్ల వెనక్కి వెడుతుంది- అని హితవు చెప్పే  పరప్రాంతీయులూ ఉన్నారు. ఎంతకాలమిట్లా, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికారం  అనుభవించిందీ లేదు, నాలుగు డబ్బులు చూసిందీ లేదు- అని చిరాకుపడుతున్న  స్వప్రాంతీయనేతలూ ఉన్నారు. వీటన్నిటి మధ్య తెలంగాణ నివురుగప్పిన నిప్పులాగా  ఉన్నది.&lt;br /&gt;&lt;br /&gt;ఇక సామాన్యుడేమంటున్నాడు? ఆత్మత్యాగాలు ఆత్మహత్యలు వద్దు. పారిన రక్తం  చాలు. ఆత్మహింసా వద్దు పరహింసా ప్రగల్భాలూ వద్దు. అసలు ఆ మాటలే వద్దు.  ఐక్యంగా ఉండండి, ఉద్యమాన్ని నిలబెట్టండి, వాస్తవికతను బట్టి వ్యూహాలను  రచించండి. విజయం ఎప్పుడు లభిస్తుందో, అసలు లభిస్తుందో లేదో మీ మనసుకు ముందే  తెలిస్తే దాన్ని ప్రజలకు చెప్పండి. 2014 నిజమయితే, అదే చెప్పండి.  అప్పటిదాకా సహనం ఇచ్చే కార్యక్రమం ఇవ్వండి. ఒకరినొకరు ఎగదోసుకునే క్రీడకు  స్వస్తి చెప్పండి. మరింతమంది మిత్రులను కూడగట్టుకోండి. ఉద్యమాన్నీ  రాజకీయాన్ని రెండుపట్టాల మీద కుదురుగా నడపండి. మభ్యపెట్టకండి.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-5958445404344278887?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/5958445404344278887/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5958445404344278887'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5958445404344278887'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_13.html' title='జనసంకటం, రాజకీయ చెలగాటం!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-7079468740563240258</id><published>2011-08-01T09:28:00.000-07:00</published><updated>2011-08-01T09:28:39.325-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 31July 2011'/><title type='text'>గాలి ధనం ముందు సాగిలపడుతున్న రాజకీయం!</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="font-weight: normal; text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;     &lt;br /&gt;యడ్యూరప్పను చూస్తే ముచ్చటేస్తుంది. సౌమ్యుడిగా కనిపించే ఆయనకు ముడిఇనుము  బాగా వంటబట్టినట్టుంది, కొత్త తరం కొత్త రకం ఉక్కుమనిషిగా తయారయ్యారు.  లోకాయుక్త నివేదిక తరువాత, వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్  దగ్గరనుంచి ప్రపంచంలోని పెద్ద పెద్ద పత్రికలన్నీ అవినీతి చక్రవర్తిగా ఆయన  పేరును మారుమోగిస్తున్నాయి. ఇక దేశంలో అయితే చెప్పనక్కరలేదు, గాలి బ్రదర్స్  వ్యాపారాలకు ఆయన చేసిన సేవను చూసి జనం గుండెలు బాదుకుంటున్నారు. అయినా  సరే, యడ్యూరప్ప ముఖం కించిత్తు కూడా చిన్నపోలేదు. సిగ్గుశరము మానం అభిమానం  వంటి పదాలేవీ ఆయన నిఘంటువులో ఉన్నట్టు లేవు.&lt;br /&gt;&lt;br /&gt;కిందపడ్డా పై చేయిగా  ఉండాలని, ఎంత అప్రదిష్ట అయినా రూపాయి ముందు దిగదుడుపేనని ఆయనకు అధికారపీఠం  పాఠం చెప్పినట్టుంది. దిగిపోను, పొమ్ముని బిజెపి పెద్దలను మొదట గద్దించారు,  తరువాత దిగుతాను కానీ నా మనిషినే కూర్చోబెట్టాలి అని మారాము  మొదలుపెట్టారు. ఎవరెవరిని ముఖ్యమంత్రులు చేయొచ్చో, ఎవరిని ఉపముఖ్యమంత్రి  చేయాలో, మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం ఇవ్వాలో గడ్కారీకి డిక్టేషన్  ఇవ్వడం మొదలుపెట్టారు. శనివారం రాత్రి పొద్దుపోయింది, అయినా ఆయన అలకపాన్పు  దిగలేదు. త ప్పు చేసింది ఎవరో, ఎవరు ఎవరిని శాసిస్తున్నారో పార్టీ పెద్దలకు  అంతుచిక్కడం లేదు.&lt;br /&gt;&lt;br /&gt;భారతీయ జనతాపార్టీ మీద జాలి కలుగుతోంది కానీ, ఆ పార్టీ చెప్పే పెద్ద పెద్ద  మాటలు గుర్తుచేసుకుంటే నిజానికి కోపమే రావాలి. నైతిక విలువలు, వ్యక్తిత్వ  నిర్మాణం, క్రమశిక్షణ వంటి సూక్తులు చాలా చెప్పే అలవాటున్న ఆ పార్టీ  పెద్దలు ఇప్పుడు యడ్యూరప్ప ముందు, గాలి జనార్దనరెడ్డి గ్రూపు ముందు ఎందుకు  సాగిలపడుతున్నది? ప్లీజ్, మా పరువు కాపాడండి, పదవినుంచి తప్పుకోండి అని  ఎందుకు ప్రాధేయపడుతున్నది? ఒక్క కలం &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;పోటుతో యడ్యూరప్పను, గాలిముఠాను పార్టీ  నుంచి ఎందుకు తొలగించలేకపోతున్నది? ఆ ధైర్యమే ఉంటే ఆ పార్టీకి ఎంతటి  ప్రతిష్ఠ సమకూరేది? ఢిల్లీలో లోక్‌పాల్ ఉద్యమానికి ఇచ్చే మద్దతుకు ఎంతటి  నైతికబలం లభించేది? మూడేళ్లలో వచ్చే సాధారణ ఎన్నికలకు ఒక స్ఫూర్తిదాయకమైన  సన్నాహం ప్రారంభమయ్యేది? కానీ, ఆ పార్టీని ఎందుకో నీరసం ఆవహించి కాళ్లు  బారజాపుకున్నది. బళ్లారి గనుల నుంచి, యడ్యూరప్ప సంపాదన నుంచి ఎంతో కొంత  పార్టీ ఖర్చులకు ప్రవహించి ఉండకపోతే, ఈ మొహమాటం ఎందుకు?&lt;br /&gt;&lt;br /&gt;గాలిబ్రదర్స్ బళ్లారిని ఒక సొంత సామ్రాజ్యం లాగా తయారుచేసుకున్నారని క  ర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో వ్యాఖ్యానించారు. ఈ  సామ్రాజ్యానికి బీజం ఎక్కడ పడింది? 1999లో బళ్లారి పార్లమెంటు స్థానానికి  సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ పోటీపడినప్పుడు పడింది. ఎన్నికల్లో సుష్మ  ఓడిపోయినప్పటికీ, గాలి జనార్దనరెడ్డి కార్యకర్తృత్వం, సమర్థత ఆమెపై ప్రభావం  వేసినట్టున్నాయి. అప్పటికింకా జనార్దనరెడ్డి గనిపనితనం మొదలు కాలేదు. &lt;br /&gt;బిజెపి  అగ్రనాయకత్వంతో అప్పుడు మొదలైన పరిచయం, కాలక్రమంలో ఆయనకు అండదండలుగా  మారాయి. గనుల లీజులు లభించడం, ఆ సమయంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి  ఇనుముకు గిరాకీ బాగా పెరగడం, వనరుల పందేరానికి సంబంధించి దేశవ్యాప్తంగా  విధానాలు సరళం కావడం జనార్దనరెడ్డికి బాగా కలసివచ్చాయి. ఆయనకు కలసిరావడమే,  బిజెపికి కూడా మేలు చేసింది. దక్షిణభారతంలో మొదటి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు  కావడానికి గాలిజనార్దనరెడ్డి అర్థబలం సహకారం సామాన్యమైనదేమీ కాదు. ఆ  కృతజ్ఞత బిజెపి నాయకత్వం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్టున్నది.&lt;br /&gt;&lt;br /&gt;సంతోష్ హెగ్డే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. కర్ణాటక లోకాయుక్తగా  ఎంత స్వతంత్రంగా, ఎంత ఖచ్చితంగా పనిచేయవచ్చునో చేసి చూపిస్తున్నవాడు.  అవినీతి నిర్మూలనపై వ్యక్తిగతంగా కూడా పట్టింపు ఉన్నవాడు. జనలోక్‌పాల్  భావనకు అక్షరరూపం ఇచ్చినది కూడా ఆయనే. మూడున్నర దశాబ్దాల కిందట జనతా  ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన లోక్‌పాల్ ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణ రూపం  తీసుకోలేదు కానీ, అప్పటి ప్రయత్నాలలో భాగంగా లోకాయుక్తలు మాత్రం  ఏర్పాటయ్యాయి. అయితే, అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తలు  సమానాధికారాలతో లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి  నామమాత్రపు ఉనికితో నెట్టుకొస్తుండగా, కర్ణాటక లోకాయుక్త పీఠం చొరవతో  పనిచేస్తున్నది. అక్కడి లోకాయుక్తకు అధికారాలు, పరిధి కూడా ఎక్కువే. దేశంలో  పౌరసమాజం డిమాండ్ చేస్తున్న లోక్‌పాల్ వ్యవస్థ ఉనికిలోకి వస్తే ఎంత  సమర్థంగా పనిచేయవచ్చునో కర్ణాటక లోకాయుక్త తన కార్యాచరణ ద్వారా  నిరూపిస్తున్నారు. అంటే, కర్ణాటక పరిణామాలు కేవలం ఆ రాష్ట్రానికే  పరిమితమైనవి కావనీ, వాటికి జాతీయస్థాయిలో కూడా ప్రాసంగికత ఉన్నదని అర్థం  చేసుకోవాలి. అటువంటి లోకాయుక్తను ఉద్దేశించి గాలి జనార్దనరెడ్డి ఏమన్నారు? ఇరవైనాలుగు  గంటల్లో సంతోష్ హెగ్డే గురించిన మసాలా సమాచారం ఏదో బయటి ప్రపంచానికి  చెబుతానన్నారు. శుక్రవారం చేసిన ఆ ప్రతిజ్ఞను శనివారం నెరవేర్చుకోలేదు  కానీ, స్వతంత్ర అవినీతి నిరోధక వ్యవస్థతో ధనరాజకీయవాదులు ఎట్లా  వ్యవహరించబోతారో 'గాలి' సవాల్ సూచిస్తున్నది. ఒక పక్కన దేశమంతా  అవినీతి రహిత రాజకీయ, పాలనా వ్యవస్థ కోసం ఉద్యమించడానికి సిద్ధంగా  ఉన్నప్పుడు, అవినీతి కారణంగా కుప్పకూలిపోతున్న తమ అధికారాన్ని  నిలబెట్టుకోవడానికి ఎంతటి నిస్సిగ్గుతనానికి నేతలు దిగజారుతారో కర్ణాటక  చెబుతున్నది. కేవలం ప్రకటనలకే పరిమితమై అవినీతిపై పోరాటం చేసే పార్టీలు  ఆచరణలోకి దిగవలసి వచ్చేసరికి ఎంతగా రాజీపడతారో కూడా బిజెపిని చూస్తే  తెలుస్తుంది.&lt;br /&gt;&lt;br /&gt;గనుల కుంభకోణానికి, 2జి స్కామ్‌కు పెద్ద తేడా ఏమీ లేదు. ఇనుపఖనిజంలాగానే,  స్పెక్ట్రమ్ కూడా ఒక సహజవనరే. కాకపోతే, తవ్వినకొద్దీ గని తరిగిపోతుంది,  నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నిసార్లు వేలం వేసినా స్పెక్ట్రమ్ తరిగిపోదు. 2జి  స్కామ్‌లో సైతం పాత, చవక రేట్లకు ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ కట్టబెట్టారు.  గనులూ అంతే, నామమాత్రపు ధరలకు లీజుకు ఇచ్చారు. ఒకటి ఢిల్లీ స్థాయిలో,  మరొకటి బెంగళూరు స్థాయిలో జరిగినంత మాత్రాన ఒకటి పెద్దదీ ఒకటి చిన్నదీ  కాదు.&lt;br /&gt;2జి స్కామ్ గురించి గొంతు చించుకున్న బిజెపి, కర్ణాటక  అవినీతిని తివాచీ కింద దాచిపెట్టలేదు. గాలిజనార్దనరెడ్డి ఘనత  ఎక్కడున్నదంటే, చవకగా లభించిన ఇనుమును తవ్వుకోవడమే కాకుండా, లీజుకు ఇవ్వని  నేలలను కూడా తవ్వడం, పక్కగనులకు కూడాకన్నం వేయడం, రకరకాల కంపెనీలు పెట్టి  ఎగుమతిదారుడూ దిగుమతిదారుడూ తానే అయి పన్నులు ఎగ్గొట్టడం- ఒక్క  నైపుణ్యంకాదు, రాష్ట్రంలో జగన్ కంపెనీల వ్యవహారం ఎట్లా ఉన్నదో గాలి  కంపెనీల తీరూ అట్లాగే ఉంటుంది. ఆ రెండూ ఒకే తానులోని ముక్కలు కావడ మే ఇక్కడ  చమత్కారం.&lt;br /&gt;&lt;br /&gt;గాలి జనార్దనరెడ్డీ, వైఎస్ జగన్మోహనరెడ్డీ వేరువేరు రాజకీయమూలాల నుంచి  వచ్చినప్పటికీ, వారి ఆర్థిక రాజకీయ విజృంభణలకు ఆస్కారం ఇచ్చినవి ఒకే  వాతావరణం, ఒకే విధాన చట్రం. ఆ ఇద్దరి రాజకీయపార్టీలు కూడా, కనీసం అవినీతి  విషయంలో, ఒకే చెట్టు కొమ్మలని అనిపించేది అందుకే. ఆలస్యం చేసినా కాంగ్రెస్  చివరకు జగన్‌ను వదిలించుకోగలిగింది. బిజెపి ఇంకా 'గాలి' ని  వదలలేకపోతున్నది. ఆ ఇద్దరూ తమ వ్యక్తిగత ఆర్థిక బలాన్ని విపరీతంగా  పెంచుకోగలగడానికీ, రాజకీయంగా జాతీయపార్టీలను కూడా ముప్పుతిప్పలు  పెట్టగలగడానికీ- కాంగ్రెస్-బిజెపి జమిలిగా ఈ దేశంలో అమలుచేస్తూ వస్తున్న  ఆర్థిక విధానాలే కారణం.  కార్పొరేట్ ప్రపంచం తిమ్మిని బమ్మిని చేసి  వ్యవస్థల కన్ను గప్పి 'అభివృద్ధి'ని సాధించడానికి కావలసిన సానుకూల వాతావరణం  ఈ దేశంలో ఏర్పడి ఉన్నది. ఆ వాతావరణాన్ని అట్లాగే ఉంచి, వ్యక్తులను, కొన్ని  సంస్థలను మాత్రమే నిరోధించడం సాధ్యమయ్యే పని కాదు. అపరిమిత లాభార్జనను  ప్రోత్సహించే వ్యవస్థే అవినీతికి ప్రధాన ఇంధనం. ప్రజల సంపద అయిన సహజవనరులను  కారుచవకకు కంపెనీలకు అప్పగిస్తే, ఆ బాధ్యతారాహిత్యం నుంచి పుట్టిన రాజకీయ,  ఆర్థిక శక్తులు భస్మాసరులై మూలాలనే దహించివేస్తాయి.&lt;br /&gt;&lt;br /&gt;అవినీతిపరులైనప్పటికీ, ఆర్థికంగా ఆవశ్యకమైన వ్యక్తుల విషయంలో  రాజకీయపార్టీలు రాజీపడితే, ఇక అవినీతి నిర్మూలనకు ఆస్కారమెక్కడిది?  లోక్‌పాల్ వ్యవస్థ అన్ని హంగులతో ఏర్పడితే మాత్రం, ఈ రాజకీయపార్టీల ద్వారా  నియమితులయ్యే లోక్‌పాల్‌లు నిష్పక్షపాతంగా, నిర్భయంగా వ్యవహరించగలిగే  వీలెక్కడిది? తీహార్ జైలులో మగ్గుతున్న రాజా, కనిమొళి- ఒక దృశ్యం. మరో  దీక్షకు సన్నద్ధమవుతున్న అన్నాహజారే- మరో దృశ్యం. గాలి కూటమితో కలసి  అధినాయకత్వాన్ని ఆటాడిస్తున్న యడ్యూరప్ప- ఇంకో దృశ్యం. మన దేశ వాస్తవికతను ఈ  మూడు సన్నివేశాలూ ప్రతిఫలిస్తున్నాయి!       &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-7079468740563240258?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/7079468740563240258/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/7079468740563240258'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/7079468740563240258'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/08/blog-post.html' title='గాలి ధనం ముందు సాగిలపడుతున్న రాజకీయం!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-574661790850870643</id><published>2011-07-25T09:18:00.000-07:00</published><updated>2011-07-25T09:18:31.439-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 24 July 2010'/><title type='text'>ఇంకిన క్రొన్నెత్తురు.. తెగిపోయిన విపంచికలు..</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt;    &lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;  &lt;/b&gt;&lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; అనగనగా ఒక రాజ్యంలో వరుస కరువులు వచ్చాయట. గ్రీష్మం తప్ప మరో రుతువు  లేకుండా పోయిందట. బీటలు పడ్డ నేలలు, మోడులయిన చెట్లు, ఎండిపోయిన చెలిమలు -  జీవితం దుర్భరంగా మారిపోయిందట. &lt;br /&gt;&lt;br /&gt;అప్పుడొక సాధువు వచ్చి రాజుగారికి చెప్పాడట, 'మీ రాజ్యంలోనే ఉన్న వరుణ  పర్వతంపై కొండకొమ్ము మీద ఒక వర్షదేవత ప్రతిమ ఉన్నది. ఆ దేవతకు పూజలు చేస్తే  కరువులు పోతాయి. కాకపోతే, ఆ కొండ చాలా పెద్దది, వేలకొద్దీ మెట్లు ఎక్కి  పోవాలి. కాళ్లూచేతులూ బాగున్నవాళ్లంతా వచ్చే పున్నమి రోజున వెళ్లి పూజలు  చేయండి, ఫలితం ఉంటుంది' అని. &lt;br /&gt;&lt;br /&gt;రాజుగారు చాటింపు వేశారు. ఆ పర్వతం చుట్టుపక్కల ఊళ్లవాళ్లంతా  ఉత్సాహపడిపోయారు. పున్నమి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. తీరా ఆ రోజు  రాగానే, వేల కొద్దీ జనం బారులుతీరి కొండదిశగా నడవసాగారు. అందరిలోనూ పట్టుదల కనిపిస్తోంది, నిష్ఠ కనిపిస్తోంది. వడివడిగా  నడుస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ఆ జనంలో కలవకుండా, ఒక పిల్లవాడు మాత్రం విడిగా పరుగుతీస్తున్నాడు. అతని చేతిలో ఒక గొడుగున్నది. &lt;br /&gt;&lt;br /&gt;ఒక పెద్దాయన అడిగాడూ - ఓరి పిల్లవాడా, ఎండ దంచికొడుతున్నది కదా, పైన చూస్తే  ఒక మబ్బుతునకే లేదు కదా, చినుకుచుక్క రాలి ఏళ్లు గడిచాయి కదా,  గొడుగెందుకురా తీసుకువస్తున్నావు? ఎవరిచేతిలోనన్నా చూశావా గొడుగుండడం? &lt;br /&gt;&lt;br /&gt;అప్పుడు పిల్లవాడన్నాడూ - పెద్దాయనా, మనం ఇప్పుడు ఎందుకు వెడుతున్నాము?  వర్షదేవతకు పూజచేస్తాము కదా, కన్నీటితో ఆ దేవతకు అభిషేకం చేస్తాము కదా,  ఇంతమంది ప్రార్థనలను ఆమె ఆలకిస్తుంది కదా, మరి కొండ దిగేటప్పుడు వాన రాదా,  అప్పుడు నేను తడిసిపోనా? అందుకే తెచ్చాను గొడుగు. &lt;br /&gt;&lt;br /&gt;ఆ పెద్దాయన నవ్వాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు. పనిచేయడానికి పట్టుదలా నిష్ఠా  &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;మాత్రమేకాదు కదా, నెరవేరుతుందన్న విశ్వాసం ఉండాలి కదా, గొడుగు తెచ్చిన  పిల్లవాడికి తప్ప ఇంతమందిలో ఏ ఒక్కరికీ విశ్వాసం లేదే? - అనుకున్నాడు.  &lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="RunningText"&gt;&lt;/div&gt;&lt;div class="RunningText"&gt;***&lt;/div&gt;&lt;div class="RunningText"&gt;&lt;br /&gt;దేన్నైనా సాధించడానికి ప్రయత్నం జరిగినప్పుడు, లక్ష్యశుద్ధి చిత్తశుద్ధి  ఉండి, గమ్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉన్నవారు తక్కువ మందే కనిపిస్తారు,  పైన కథలో పిల్లవాని వలె. అధికులు ఏదో ఒక గొర్రెదాటు తత్వంతోనో,  అర్థమనస్కంగానో, నామమాత్రంగానో ఆ ప్రయత్నంలో పాలుపంచుకుంటారు. ఎవరిలోనైనా  అసాధారణ స్థాయిలో నమ్మకం కనిపించినప్పుడు సాటివారి నుంచి హేళన కూడా  ఎదురవుతుంది.  తెలంగాణ ఉద్యమం విషయంలో పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అతి  కొద్దిమంది, అదీ నాయకత్వ స్థానాలలో ఉన్నవారు అతిప్రయత్నం మీద సమష్టి ఆచరణలో  పాలుగొంటున్నట్టు కనిపిస్తారు. విజయం అందుతుందా లేదా అన్న దాని విషయంలో  వారి మాటలు ఎట్లాగున్నప్పటికీ, మనసు మాత్రం డోలాయమానంగా ఉంటుంది,  అపనమ్మకంతో కునారిల్లుతుంటుంది.  వచ్చినా రాకపోయినా సరే, ప్రయాణం సాగితే చాలు అన్న నిర్లిప్తత కనిపిస్తుంది,  అంతిమ లక్ష్యం వచ్చేలోపు అందుకోవలసిన తాత్కాలిక ఫలితాల వైపు వారి అంతరంగం  ప్రలోభపడుతూ ఉంటుంది. వీరి గొంతు పెద్దది కావచ్చు కానీ, సంఖ్య మాత్రం అతి  తక్కువ. సాధించి తీరాలని, సాధించి తీరతామని మేరమీరిన నమ్మకంతో వెలిగిపోయే  వాళ్లు, పై కథలో పిల్లవాని వంటి వారు, మాత్రం పెద్దసంఖ్యలో ఉంటారు. వీరికి  గొంతు చిన్నది కానీ, సంఖ్య పెద్దది.  వారికి వ్యూహాలు తెలియవు, ఎత్తుగడలు తెలియవు. ఆశయాన్ని గుండెలకు బలంగా  దట్టించుకోవడం ఒక్కటే తెలుసు. చిన్న విజయం దొరికినా సంబరపడడం, వైఫల్యం  ఎదురయితే గుండె పగలడం, ప్రయత్నలోపం లేకుండా కష్టపడడం - ఇవే వారికి  తెలుసును. కుట్రలు ఎదురయినా, అప్రియమైన మాట వినిపించినా, తామనుకున్న  న్యాయం నెగ్గదని అనిపించినా వారిని నిస్ప­ృహ కమ్మివేస్తుంది. వారికి  ధైర్యం ఇవ్వదగ్గ నైతికబలం వారి నేతలకే ఉండదు. &lt;br /&gt;&lt;br /&gt;ఆశను ఇవ్వగలిగిన శక్తి ఏ ఓదార్పుకూ ఉండదు. ఉద్యమ ఉద్విగ్నత నే స్వభావంగా  మలచుకున్న వారు, ఒక ఆశాభంగానికి అల్లలాడిపోతారు. కోట్లమంది నడిచే ఉద్యమ  పథంలో అనాథగా ఒంటరిగా కుమిలిపోతారు. దహించివేస్తున్న నైరాశ్యంలో  కాలిబూడిదవుతారు, ఉరిపోసుకుంటారు, కడివెడు దుఃఖాన్ని మిగులుస్తారు.  శ్రీకాంతాచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి.. ఇదే ఆ కోవ. వందలాదిమందితో  కిక్కిరిసిపోయిన ఆ తోవలో ఇప్పుడు యాదిరెడ్డి. ఏ పేరేతైనేం, అది ఒక  సర్వనామం మాత్రమే. &lt;br /&gt;&lt;br /&gt;అతను ఢిల్లీకి పోయి ఎల్లిపాయ తెచ్చే బాపతు మనిషి కాదు. ఢిల్లీసుల్తాన్  పట్టుకుపోతాన్ - అనే యుగంధరుడి బాపతు. మంచి కబురు తెస్తానని గొడుగు  పట్టుకుని దేశ రాజధానికి వెళ్లినవాడు. అతని ఉత్తరం పూర్తిగా చదవండి. అది  మరణవాంగ్మూలం కాదు. తన ఆశయానికి రాసుకున్న ప్రేమలేఖ. విషాదాంత మహాకావ్యం.  వర్తమాన రాజకీయాలకు నెత్తుటి వ్యాఖ్యానం. అతనే కోరుకున్నట్టు మరెవరూ ఆ  బాటలో నడవకూడదు. మరెవరూ అంతటి ఆశాభంగంలో మరణించకూడదు. తెలుగు సమాజం,  తెలంగాణ ఉద్యమం ఇకపై మరో యువదీపాన్ని పరాజితభావనలో ఆరిపోనివ్వకూడదు. &lt;br /&gt;&lt;br /&gt;ఒక్క తెలంగాణ అనేమిటి, దేశమంతా క్రొన్నెత్తురు నిండిన ఆశాదూతలు  అల్పాయుష్షులై పోతున్న మృత్యురుతువు ఏనాటినుంచో విస్తరించి ఉన్నది.  స్వప్నించగల, సాధించగల, నిర్మించగల, నిర్వహించగల యువశక్తిని వ్యవస్థ  చిదిమివేస్తూ వస్తున్నది. ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన రుజాగ్రస్తులను  పాలకులుగా, విధాన నిర్ణేతలుగా, సారధులుగా ప్రతిష్ఠిస్తూ వస్తున్నది. కడవళ్ల  కెత్తినా, గంగాళాలకెత్తినా సరిపోనంతటి నెత్తురు పారిపోయింది. కొందరు  సాయుధులై మరణించారు. కొందరు నిరాయుధులై నిర్మూలనకు బలయ్యారు.  ఇంకొందరు వ్యవస్థ పరుగుపందెంలో నెగ్గలేక జీవితం చాలించారు. అసంఖ్యాకులు,  ఆత్మబలినే ఆయుధంగా చేసుకుని శేషప్రశ్నలు వదిలి వెళ్లారు. తెలంగాణలో అయితే  అరవయ్యేళ్లనుంచి ఒకటే చావుల పంట. తెలంగాణ సాయుధపోరాటం, ఆ తరువాత ప్రత్యేక  తెలంగాణ ఉద్యమం, ఆపైన నక్సలైట్ పోరాటం, తిరిగి తెలంగాణ పోరాటం, మధ్యలో  వ్యవసాయ సంక్షోభం.. &lt;br /&gt;&lt;br /&gt;యాదిరెడ్డి వంటి యువకులకు ఉన్నంతగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం నాయకులకు  ఉన్నట్టు కనిపించదు. ప్రజాప్రతినిధులను తమకు బాధ్యత వహించేటట్టు చేయడానికి  యువకులు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. వైఖరులను చెప్పమని  నిలదీస్తున్నారు. తమకు ప్రాతినిధ్యం వహించే నేతల నడవడిని నిశితంగా  పరిశీలిస్తున్నారు. ఒకనాడు సకల సమస్యలకు వ్యవస్థను కూలదోయడమే  పరిష్కారమనుకున్న నేలలో, ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవడానికి సర్వశక్తులూ  ఒడ్డుతున్నారు. పార్లమెంటు భవనం సమీపంలో ఉరివేసుకున్న యాదిరెడ్డి, ప్రజాస్వామ్య  మహాసౌధంపైనే ప్రశ్న సంధించాడు. తెలంగాణ రానీ, రాకపోనీ కానీ - ఇక్కడి  ప్రజల్లో పురివిప్పిన ప్రజాస్వామిక స్ఫూర్తి కొత్త రాజకీయ సన్నివేశాలను  రచించి తీరుతుంది. బాహ్య ప్రత్యర్థుల సవాళ్లను, అంతర్గత వైరుధ్యాలను అర్థం  చేసుకోవడం, అందుబాటులో ఉన్న అవకాశాలలో ప్రాధాన్యాలను గుర్తించడం,  ఆవేశాన్ని సంయమనాన్ని మేళవించడం - ఇప్పటి ఉద్యమయువతలో కనిపిస్తున్న  సుగుణాలు. ప్రజాఉద్యమాలు సమాజాన్ని ఎంతగా ఉన్నతీకరిస్తాయో నిరూపణ అవుతున్న  సందర్భం ఇది. తమ శక్తి మీద, బాహ్య పరిస్థితుల మీద అవాస్తవికమైన అతి  విశ్వాసాన్ని పెంచుకుని, ఆశాభంగాన్ని భరించలేని సున్నితస్థితిలో  ఉండడమొక్కటే ఈ యువతరంలోని బలహీనత ఏమో? &lt;br /&gt;&lt;br /&gt;నాయకులారా, దయచేసి, మీ వెంట నడుస్తున్న యువకులకు చెప్పండి. ముఖ్యంగా  గొడుగులు పట్టుకుని వస్తున్న పిల్లవాండ్లకు, ఆశయాలను సీరియస్‌గా తీసుకుని  అడుగులు వేస్తున్న సాధకులకు చెప్పండి, గమ్యం ఎంత దూరమో చెప్పండి. దూరమైతే,  ఎట్లా సహనం చూపాలో, పట్టుదలను నమ్మకాన్ని ఎట్లా నిలుపుకోవాలో చెప్పండి.  పోరాటం ఎందుకో ఎక్కడిదాకానో చెప్పండి. రాజీలు అవసరమైతే ఎందుకు అవసరమో  నచ్చచెప్పండి. అంతే తప్ప, ఇదిగో విజయం అదిగో రాష్ట్రం అని ఆశలు పెట్టకండి. &lt;br /&gt;&lt;br /&gt;మీ వ్యూహాలూ ద్రోహాలూ కాసేపు పక్కన పెట్టండి. శ్మశానంలో ఓట్ల వేటను ఆపండి.  సకల సమస్యలకూ ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అన్న భ్రమలు పోషించకండి, అంతిమ  విజయంలోగా సాధించవలసిన వాటిని సాధించనివ్వండి. ఉద్యమాన్ని మీరు తేలిక  చేసుకోకండి, ఇతరులను తేలిక చేయనివ్వకండి. ఉత్తరకుమారుల వలె ప్రగల్భాలు  పలకకండి. పోరాటకారులమని నమ్మించడానికి కృత్రిమ ఆవేశాలను నటించకండి. &lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-574661790850870643?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/574661790850870643/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/07/blog-post_25.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/574661790850870643'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/574661790850870643'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/07/blog-post_25.html' title='ఇంకిన క్రొన్నెత్తురు.. తెగిపోయిన విపంచికలు..'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-5071261334402769597</id><published>2011-07-14T02:04:00.000-07:00</published><updated>2011-07-14T02:04:38.270-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 10 July 2011'/><title type='text'>అడుగే పడలేదు, అప్పుడే అధికార వాగ్దానాలు!!</title><content type='html'>&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; సాధారణంగా జరిగే సంగతి చూద్దాము. కొత్త రాజకీయపార్టీ అవసరమున్నదని, ఆ  అవసరాన్ని తాము తీర్చగలుగుతామని భావించిన కొందరు వ్యక్తులో, కొన్ని బృం  దాలో కలసి పార్టీ అవతరణకు కావలసిన సన్నాహాలను ప్రారంభిస్తారు. రాజకీయ  రంగంలో అప్పటికే ఉన్నవారిలోను, కొత్తగా రాజకీయాల్లోకి రాదలచుకున్న రాగలిగిన  వారిలోను తమ సన్నాహాల గురించి, ఆశయాల గురించి ప్రచారం చేస్తూ బలాన్ని  కూడగట్టుకుంటారు. పార్టీ స్థాయిని, పరిధిని బట్టి, తగిన సంఖ్య వచ్చిన  తరువాత అందరూ కలసి ఒక విధానచట్రాన్ని రూపొందించుకుంటారు.  ఒక అవతరణసభనో, మహాసభనో, ప్లీనరీయో పెట్టుకుని ఆ పార్టీ రూపురేఖలను,  విధివిధానాలను, వైఖరులను ఆవిష్కరిస్తారు. వాటి ఆధారంగా రాజకీయపార్టీ వివిధ  సందర్భాలలో తన స్పందనలను ప్రకటిస్తుంది. ఎన్నికలు సమీపించినప్పుడు, ఆ  విధివిధానాల ఆధారంగా రూపొందించుకునే లక్ష్యాలను, చేసే వాగ్దానాలను, ఇచ్చే  హామీలను ఓటర్ల ముందుకు తీసుకువెడతారు.&lt;br /&gt;&lt;br /&gt;వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ నాయకుడు  వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం చూస్తే, ఎన్నికలు రేపో ఎల్లుండో  వస్తున్నాయేమోనని భ్రమపడే అవకాశం ఉన్నది.  పార్టీ విధానాలు ఏమిటో చెబుతారని ఆసక్తిగా చూసినవారికి ఆయన ఎన్నికల  మేనిఫెస్టోను అందించారు. తెలంగాణ గురించి తన పార్టీ వైఖరిని స్పష్టతతో  చెప్పలేకపోయారు కానీ, తను అధికారంలోకి వస్తే ఎన్ని కిలోల సబ్సిడీ బియ్యం  ఇస్తారో, 108, 104లకు తోడు కొత్తగా ప్రారంభించే సంచార సేవావాహనాల  నెంబర్లేమిటో, వృద్ధాప్యపింఛన్లు ఎంత పెంచుతారో, &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;కనీసం 35 మంది ఎంపీలతో  పార్లమెంటుకు వెడితే కేంద్రంలో ఏ మంత్రిత్వశాఖను కోరబోయేదీ - అన్నీ  వివరాలతో సహా చెప్పగలిగారు. &lt;br /&gt;పార్టీ ప్లీనరీలో ఏమి చేయాలో, ఏఏ అంశాలపై విధానాలను ప్రకటించాలో జగన్‌కే కాదు, ఆయన సలహాదారులకు, అనుయాయులకు కూడా తెలిసినట్టు లేదు.  మతతత్వశక్తులకు దూరంగా ఉంటామని తప్ప స్థూలమైన సైద్ధాంతిక వైఖరి ఏ ఒక్క విషయంలోనూ జగన్ ప్రకటించలేకపోయారు.&lt;br /&gt;&lt;br /&gt;ఎందువల్లనంటే, జగన్ పార్టీ అనేక ఇతర పార్టీల వలె ఏర్పడినది కాదు. వైఎస్ఆర్  ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ దూరమైనందువల్ల తాము కొత్త పార్టీగా  అవతరిస్తున్నామని జగన్‌వర్గం చెబుతున్నప్పటికీ, సుమారు రెండు సంవత్సరాలుగా  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించినవారికి ఆ కారణం అర్ధసత్యమని  అర్థమవుతూనే ఉన్నది. రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత, రాష్ట్ర ముఖ్యమంత్రి  పీఠానికి తానే సహజమైన వారసుడినని భావించిన జగన్, అందుకోసం రకరకాల  ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత వేరుకుంపటి ప్రారంభించారు. &lt;br /&gt;ఆయన చుట్టూ సమీకృతులైనవారి వెనుక ఒక ప్రత్యేకమైన సైద్ధాంతిక ధోరణి ఏదీ  లేదు. వైఎస్ తమను రాజకీయంగా ఆదరించారు కాబట్టి, ఆయన మీద విధేయతరీత్యా,  వైఎస్ కుటుంబంతో ముడిపడిన వారి ప్రయోజనాల రీత్యా జగన్ వెంట నడుస్తున్నారు.  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తరతరాలుగా ప్రాంతీయ నాయకత్వం విషయంలో  అనుసరిస్తున్న వైఖరిని ధిక్కరిస్తూ స్వతంత్రమార్గాన్ని ఎంచుకుంటున్నాడనే  ఆరాధనాభావం కూడా కొందరు జగన్ అనుయాయులలో ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్ కంటె ఏ  రకంగా జగన్‌పార్టీ భిన్నమైనది అన్నప్రశ్నకు, విధానపరమైన సమాధానమేదీ  లభించదు. &lt;br /&gt;&lt;br /&gt;వైఎస్ ఆశయాల సాధనే తమ పార్టీ లక్ష్యమని జగన్ చెబుతున్నారు. పేదరిక  నిర్మూలన విషయంలో వైఎస్ మార్గమే తమకు శిరోధార్యమని ఆయన అంటున్నారు.  ప్రతిఇంటిలోనూ పెద్ద చదువులు చదివినవారు ఒకరైనా ఉంటే అది ఆ కుటుంబానికి  ఆర్థికసాధికారత ఇస్తుందని, ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం ఎకరం పొలం ఉంటే  అది కనీస జీవన భద్రత కల్పిస్తుందని వైఎస్ నమ్మారని, అదే తమ పార్టీ అవగాహన  అని జగన్ చెప్పారు. పేదరికం ఎందుకు ఇంత తీవ్రంగా ఉన్నది,  ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న అభివృద్ధి విధానం ఏ మేరకు సమంజసమైనది,  వ్యవసాయానికి ఆదరణ పెంచడానికి, పారిశ్రామికాభివృద్ధికి అనుసరించవలసిన  వ్యూహమేమిటి, అవినీతిపై వైఖరి ఏమిటి, కొన్ని కనీస అంతర్జాతీయ వ్యవహారాలపై  స్థూల దృక్పథమేమిటి - ఇటువంటి అంశాలను వివరించడానికి జగన్ ప్రయత్నమేదీ  చేయలేదు. &lt;br /&gt;&lt;br /&gt;జగన్‌కు సొంత సైద్ధాంతిక చట్రమేదీ లేకపోవడానికి కారణం - ఆయన తండ్రికి కూడా  సొంత రాజకీయార్థిక విధానమేదీ లేకపోవడమే. కాంగ్రెస్ విధానాలు కాక, వైఎస్‌కు  మరేవో విధానాలున్నాయని అనడానికి ఆధారమేదీ లేదు. తన సొంత నాయకత్వ లక్షణాల  వల్ల కానీ, కలసివచ్చిన కాలం వల్ల కానీ వైఎస్ కొన్ని ప్రత్యేకతలను  సాధించారు. 2004 ఎన్నికలకు ముందు కఠిన పరిశ్రమతో కూడిన రాజకీయ ప్రచార  కార్యక్రమాలను వైఎస్ చేపట్టారు. అప్పటికి తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో  ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకాంశాలను  ఆధారం చేసుకుని వైఎస్ రాజకీయవ్యూహం ఉండింది. కేంద్రంలో సైతం చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండిన కాంగ్రెస్, తన బలహీనత  వల్ల కానీ, ఎట్లాగైనా విజయం సాధించాలన్న తాపత్రయం వల్ల కానీ వైఎస్‌కు  స్వతంత్రం ఇచ్చింది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాటి ప్రతిపక్ష  రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి మించి వైఎస్ ముద్రే గాఢంగా కనిపించింది.  ఢిల్లీలో యుపిఎ అధికారం సాధించినప్పటికీ, అది సంకీర్ణ ప్రభుత్వమే కావడంతో,  వైఎస్ బలం కొనసాగుతూ వచ్చింది. ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం - అన్న రెండు  కార్యక్రమాలూ చంద్రబాబు పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి రూపొందినవే తప్ప ఏదో  ఒక సిద్ధాంతం నుంచి పుట్టినవి కావు. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని, పార్టీపై ప్రభుత్వంపై తన సొంత పట్టును  స్థిరపరచుకోవడానికి వైఎస్ విశ్వప్రయత్నం చేశారు. రెండో దఫా కూడా అధికారం  సాధించాలన్న దూరదృష్టితో మొదటి హయాం మధ్యనుంచి సంక్షేమ పథకాలను, ఓటర్లకు  లబ్ధిచేసే పథకాలను విరివిగా వైఎస్ ప్రారంభించారు. ఇవాళ జగన్  కొనసాగిస్తానని చెబుతున్న వైఎస్ పథకాలన్నీ 2009 ఎన్నికల కోసం రూపకల్పన  చేసిన జనాకర్షక పథకాలే. నూతన ఆర్థిక విధానాల ఉధృతిలో, వాటిని పవిత్ర సిద్ధాంతాలుగా విశ్వసించి,  ప్రజలకు అప్రియమైన మాటలు చెప్పడానికి, వారిపై కఠినంగా వ్యవహరించడానికి  కూడా సంకోచించని తరహా నాయకత్వం చంద్రబాబునాయుడిది అయితే, చంద్రబాబు వంటి  వారిపై వ్యక్తమయ్యే వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని కొత్త మార్గంలో  సంస్కరణలు అమలుజరిపే కోవ వైఎస్‌ది. జనాకర్షణ, రైతు బాంధవుడన్న ముద్ర ఆసరా  చేసుకుని వైఎస్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.  అన్ని రకాల ప్రత్యర్థులను అణచివేశారు. ప్రజారంగంలో పనిచేసే సంస్థలను  దిగ్బంధం చేశారు, లేదంటే తనవైపు తిప్పుకున్నారు. ఈ వ్యూహంలో సొంత రాజకీయ  ప్రయోజనాలతో పాటు, వర్తమాన సంస్కరణ విధానాల పరిరక్షణ కూడా ఇమిడి ఉన్నది.  వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల పందేరాలు భారీ ఎత్తున  జరిగాయి. సామాన్య ప్రజల ప్రయోజనాలకు భిన్నమైన రీతిలో పారిశ్రామికులకు  లబ్ధి జరిగింది. సంస్కరణ విధానాలను అనువుగా చేసుకుని వైఎస్ అస్మదీయులకు  పెద్ద ఎత్తున లాభం కలిగేరీతిలో వ్యవహరించారని, వారిలో జగన్ అతిపెద్ద  లబ్ధిదారుడని కాంగ్రెస్‌వారే విమర్శిస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమని చెబుతున్న పద్ధతిలో ఆర్థిక సామ్రాజ్యాన్ని  నిర్మించుకుని, దాని సహాయంతో రాజకీయాధికారం కోసం తీవ్రయత్నం చేస్తున్న జగన్  వంటి ఉదాహరణ గతంలో మరొకటి లేదు. అటువంటి మూలాలు కలిగిన పార్టీ తమ ఉనికికి  మూలకారణమైన విధానాలను విమర్శించగలుగుతుందా?  పేదలను మరింత పేదలుగా, నిర్వాసితులుగా చేసే విధానాలను అమలుచేస్తూ,  సాంప్రదాయికంగా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రజాసేవలను ప్రైవేటుపరం చేస్తూ,  కంటితుడుపుగా వ్యక్తిగత లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలను అనుసరించే విధానమే  జగన్‌ది. వైఎస్ నాడు ప్రారంభించిన అనేక పథకాలు అమలు చేయలేక రాష్ట్ర  ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యామ్నాయాలను, సవరణలను ఆశ్రయిస్తోంది. ఇప్పుడు  జగన్ ప్రకటించిన పథకాలు ఆచరణసాధ్యం కాకపోగా, దీర్ఘకాలికంగా ప్రజలకు  మేలుచేయగలిగేవి కూడా కాదు.&lt;br /&gt;&lt;br /&gt;ప్రపంచవ్యాప్తంగా ప్రపంచబ్యాంకు రుద్దుతున్న నగదు బదిలీ పథకాలు, తమిళనాడు  లాంటి రాష్ట్రాల్లో పోటీలుపడి పార్టీలు ప్రకటించిన వరాలు - వీటికీ జగన్  చెప్పినవాటికీ తేడాఏమీలేదు. పేదరికం పోవాలంటే ప్రభుత్వాల విధానాలు ఆ దిశగా  ఉండాలి. ప్రజల వాస్తవ ఆదాయాలు పెరగాలి, వనరులపై ప్రజలకు యాజమాన్యం ఉండాలి,  సమాజ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉత్పత్తులు, మార్కెటింగ్‌లు జరగాలి, విద్య  ఆరోగ్య రంగాలను సామాజిక పెట్టుబడులుగా భావించి ఉచితంగా అందించాలి. సామాజికంగా బాధితులుగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యవివక్ష ద్వారా అదనపు  సహాయాన్ని, ప్రోత్సాహాలను అందించాలి- అప్పుడు మాత్రమే ప్రజలు ఎవరి  భిక్షమీదా ఆధారపడకుండా ముందడుగు వేయగలుగుతారు.&lt;br /&gt;&lt;br /&gt;వైఎస్ కార్యక్రమాల్లోని ఒక పార్శ్వాన్ని మాత్రమే ప్రస్తావించి, వాటిని  అనుసరిస్తామని జగన్ చెప్పారు. రెండో పార్శ్వం సంగతి ఆయన చెప్పనేలేదు. తాను  నడచివచ్చిన మార్గాన్ని మరింత అభివృద్ధిపరచడానికే ఆయన ప్రయత్నమంతా.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-5071261334402769597?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/5071261334402769597/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/07/blog-post_14.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5071261334402769597'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/5071261334402769597'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/07/blog-post_14.html' title='అడుగే పడలేదు, అప్పుడే అధికార వాగ్దానాలు!!'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-1882646920500921082</id><published>2011-07-04T04:28:00.000-07:00</published><updated>2011-07-04T04:28:30.043-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Sandarbham 03 July  2011'/><title type='text'>అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు...</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h1 style="text-align: justify;"&gt; &lt;/h1&gt;&lt;div class="heading" style="text-align: justify;"&gt;&lt;b&gt;   &lt;/b&gt;&lt;/div&gt;&lt;div&gt;   &lt;/div&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt; డెజా వూ అన్న ఫ్రెంచి మాటకు అర్థం - ఇంతకు ముందే చూసినది - అని. ఒక దృశ్యం  కానీ, సన్నివేశం కానీ, పరిస్థితుల సంపుటి కానీ ఎదురయినప్పుడు - అది ఇంతకు  మునుపే అనుభవంలోకి వచ్చినట్టు అనిపించడమే డెజా వూ. మనోవైజ్ఞానిక శాస్త్ర  పరిభాషగా వాడుకలోకి వచ్చిన ఈ మాట, ఇప్పుడు ఇతర శాస్త్ర, కళారంగాల  రచనల్లోనూ, సాధారణ వ్యక్తీకరణల్లో కూడా భాగమైంది. రిజర్వేషన్ వ్యతిరేక  ఆందోళన జరిగిన 80ల చివర్లో వరవరరావు డెజావూ శీర్షికతో ఒక గొప్ప దీర్ఘ కవిత  రాశారు. &lt;br /&gt;&lt;br /&gt;చరిత్ర పునరావృత్తం అవుతుందంటారు. నిజమే, కానీ యథాతథంగా కాదంటారు మార్క్స్.  మొదటిసారి విషాదంగా జరిగినది రెండోసారి ఆభాసగా జరుగుతుందని ఆయన  వ్యాఖ్యానించారు. ప్రతి మనిషికి సొంత జ్ఞాపకశక్తి ఉంటుంది, అంతేకాదు,  సామూహిక జ్ఞాపకాలను చరిత్రగా, పురాణాలుగా భద్రపరచుకోవడం మనిషికి తెలుసు.  విజయమో అపజయమో, సంబరమో సంక్షోభమో తారసపడినప్పుడు, గతంలోని అటువంటి  సందర్భాలు గుర్తుకురావడం సహజం. అటువంటి అనేక పునరావృత్తాల నుంచి మనిషి  అనుభవమూ జ్ఞానమూ పదునెక్కుతూ వచ్చింది. &lt;br /&gt;&lt;br /&gt;తరచు ఎదురుపడే ఒకేరకమైన సందర్భాలను చూసి విసిగిపోయో, అర్థం చేసుకునే  శక్తిలేకో మనిషి వేదాంతంలో పడిపోయి, జీవితం రంగులరాట్నం అనీ, చరిత్ర అంటే  చర్విత చర్వణం అనీ, నిరంతరం ఒకే సంఘటనల క్రమం వలయాకారంలో జరుగుతుంటుందని  నిర్ధారణకు వచ్చాడు. కానీ, అది నైరాశ్యంతోనో చమత్కారంగానో చెప్పుకునేదే  తప్ప హేతువుకు నిలిచేది కాదని భౌతికవాదులు ఖండిస్తూనే వస్తున్నారు. 'చరిత్ర  పునరావృత్తమయ్యేదే నిజమైతే, మనిషి ఊహించని సంఘటనలు ఇన్ని ఎట్లా  జరుగుతాయి? జరిగేది ప్రతీదీ మునుపెప్పుడో జరిగినదే &lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;అయితే, మనిషి తరచు  ఎదురుదెబ్బలు ఎందుకు తింటున్నాడు? అనుభవం నుంచి నేర్చుకోవడంలో మనిషి ఉట్టి  శుంఠ అన్న మాట' - అంటాడు జార్జి బెర్నార్డ్ షా. &lt;br /&gt;&lt;br /&gt;గతంలో జరిగిన సంఘటనలు ఏదో ఒక రూపంలో స్ఫురించే అవకాశమే లేకపోతే చరిత్రకు  అర్థం లేదు. పోల్చుకునే సామర్థ్యమే లేకపోతే అనుభవానికి అర్థమే లేదు, చరిత్ర  నుంచి అనుభవం నుంచి నేర్చుకోకపోతే మనిషికి జ్ఞానమే లేదు. అయినప్పటికీ,  మనుషుల్లో కొందరు పోల్చుకోరు, నేర్చుకోరు, జ్ఞానాన్ని ఖాతరే చేయరు.  తమబోంట్లకు చరిత్రలో ఏ గతిపట్టిందో తెలిసినా, తామొక్కరే భిన్నమనుకుంటారు.  కాలం మునుముందుకే సాగుతుందని ఎన్ని సాక్ష్యాలున్నా, తిరోగమనం సాధ్యమేనని  నమ్ముతారు.  న్యాయపక్షంలో నిలబడి ఓడిన వీరుడు మరణిస్తూ పునరుత్థానాన్ని వాగ్దానం  చేస్తాడు. జనం చేతిలో చావు దెబ్బతిన్న వ్యవస్థ, ఆదమరిస్తే తాను మళ్లీ  తలెత్తుతానని హెచ్చరిస్తుంది. అవశేషమైన చెడు మళ్లీ మళ్లీ పుడుతుంది.  మిగిలిపోయిన మంచి కూడా మరోసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది. పునరావృత్తం  ఎందుకైనా సరే అది ఒక అసమగ్రతకు చిహ్నం, పట్టువదలని విక్రమార్కానికి  సంకేతం. ప్రపంచగమనం నిండా అడుగడుగునా డెజా వూ లే. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ ఉద్యమంలో మళ్లీ చెలరేగిన రాజీనామాల కలకలం మాత్రం ఆభాసా కాదు,  అనివార్య పునరావృత్తమూ కాదు. కేవలం ఒక చ ర్విత చర్వణం. ఇప్పటికి  ఎన్నిసార్లు రాజీనామాలు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు! ఇదే సన్నివేశం ఇంతకు  ముందు పదే పదే జరిగినట్టు తెలిసిపోతూనే ఉన్నది. జానారెడ్డి ఇంటికి కెసిఆర్ -  ఎప్పుడో విన్నట్టు లేదూ? డిసెంబర్ 9 వాగ్దానాన్ని నెరవేర్చనందుకే  రాజీనామాలు చేస్తున్నట్టు లేఖ - ఇదీ జరిగినట్టే లేదూ? ఒక నిమిషంలో తేలేది  కాదు తెలంగాణ - ఇదీ చిరపరిచితమే కదూ? రాజీనామాల వల్ల ఒరిగేదేమీ లేదు, ఎవరో  చెబితే మేం చేస్తామా, మా నేత వేరు - ఈ మాటలూ అలవాటయినవే కదా? తెలంగాణ కోసం  ప్రాణత్యాగమైనా చేస్తాం- తుప్పు పట్టిపోయినమాట.  శనివారం నాడే ఒక సీమాంధ్ర నేత కూడా ఈ మాట అందిపుచ్చుకున్నాడు- సమైక్యాంధ్ర  కోసం ప్రాణాలైనా ఇస్తాం- అట. ఒక్కటి మాత్రం కొంచెం తేడాగా వినిపించింది. ఈ  సారి తాము రాజీనామాలు చేయబోమని సీమాంధ్ర రాజకీయనేతలు చేసిన ప్రకటన.  అప్పుడంటే తెలంగాణ నిజంగా వస్తుందేమోనని భయపడి రాజీనామాలు చేశాము, ఇప్పుడు  అటువంటి పరిస్థితి లేదు కనుక అటువంటి తీవ్రచర్య అవసరం లేదని వారు వివరణ  కూడా ఇచ్చారు. అయినా అంతటి అవసరమే వస్తే, మళ్లీ అదే అస్త్రం తీయకుండా  ఉంటామా? అని మరో సీమాంధ్ర నేత సన్నాయి నొక్కులు.  తెలంగాణ నేతల దగ్గర కానీ, సీమాంధ్ర ప్రతినిధుల వద్ద కానీ కొత్త ఆయుధాలేమీ  లేవు. కొత్త ఆలోచనలు కూడా లేనట్టున్నాయి. రాజీనామాలు చేయండి, రాజకీయ  కల్లోలం సృష్టించండి, కానీ, మళ్లీ పోటీచేయడం ఎందుకు? దానివల్ల ఉపయోగమేమిటి?  ఇప్పుడున్న అంకగణితమే అప్పుడూ ఉంటుంది కదా? - అని ప్రశ్నించేవారి గొంతు  పీలగా మాత్రమే వినిపిస్తుంది. భావదారిద్య్రం వల్ల జరిగే పునరుక్తికి కూడా  చారిత్రక పునరావృత్తానికి ఇచ్చే గౌరవం ఇవ్వగలమా? &lt;br /&gt;&lt;br /&gt;వంటావార్పులూ కొవ్వొత్తుల ప్రదర్శనలూ రాస్తారోకోలూ ముట్టడులూ మానవహారాలూ -  అన్నీ అరిగిపోయాయి. లేస్తే మనిషిని కాననే భీషణ ప్రతిజ్ఞలకూ కాలం  చెల్లిపోయింది. 1952, 1969, 2009 తిరిగి తిరిగి వస్తూనే ఉన్నది తెలంగాణ  సందర్భం. పాలకుల దుర్మార్గం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో కాదు, ఉద్యమాలలోని  బలహీనతల వల్ల కూడా ఒకే సన్నివేశం పదే పదే ప్రత్యక్షమవుతున్నది. పరమపదసోపాన  పటంలో పాము మింగినప్పుడల్లా మళ్లీ మొదటినుంచి పావులు కదపవలసి వస్తుంది.  కేశవరావు మొహం చూడండి, జానారెడ్డి మాటలు వినండి, నాగం ఉద్ఘాటనలు ఆలకించండి,  ఎర్రబెల్లి అభిభాషణను గమనించండి- ఎక్కడో చూసినట్టే, విన్నట్టే, అన్నీ  తెలిసిపోయినట్టే ఉంటున్నాయి.  ఇక కెసిఆర్ అయితే, తనను తానే ప్రతిధ్వనిస్తూ వస్తున్నారు. అన్ని మొహాల్లో  మరేవో ముఖాలు తొంగిచూస్తున్నాయి. కంఠాలు ఖంగుమంటున్నా, చూపుడువేళ్లు  సవాళ్లు విసురుతున్నా, అందరి పాదాలూ వారి వారి పార్టీల గుంజలకు కట్టేసే  ఉన్నాయి. తెగింపు కనిపిస్తోందా, త్యాగనిరతి తెలుస్తోందా, దృఢసంకల్పం  వ్యక్తమవుతోందా, ఎవరిలోనైనా శ్రీకాంతాచారి కనిపిస్తున్నాడా? తప్పదేమో ఒక్కోసారి, మళ్లీ మళ్లీ మొదలుపెట్టవలసి రావచ్చు. దెబ్బతిన్నవాడు  కోలుకుని కత్తిపట్టడానికి సమయమూ పట్టవచ్చు. సుదీర్ఘ పోరాటంలో కొంత  కాలక్షేపమూ అవసరం కావచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;రాజకీయ వ్యూహాల్లో వెనుకబడితే రేపు ఫలితంలో వాటా దక్కకపోవచ్చు. కానీ, జనం  మాటేమిటి? ఇదిగో ఇక్కడిదాకే అని మభ్యపెట్టడం ఎందుకు? మూలమలుపులోనే  తుదిమజిలీ ఉన్నదని మాయ చేయడం ఎందుకు? ఆందోళనతో ఉత్కంఠతో ఆత్మహత్యలెందుకు,  ఊపిరి ఆగిపోవడం ఎందుకు? పదే పదే అదే జరగడంలో మా బాధ్యతేముందని ఎవరైనా  ప్రశ్నించవచ్చు. మొదటిసారి మోసపోతే మోసగాడి తప్పు. మళ్లీ మళ్లీ మోసపోతే  మోసపోయేవాడిదే తప్పు అంటారు. అనుభవం ఏమినేర్పింది నాయకుడా నీకు? కాంగ్రెస్  ఏమి చేస్తుందో నీకు తెలియదా? పదేపదే ఆశాభంగమైన విద్యార్థి ఏమి చేస్తాడో  నీకు అర్థం కాలేదా? యాంత్రికంగా జరిగే పునరావృత్తంలోకి ప్రవేశించి  దారిమరల్చాలని తెలియదా నీకు?&amp;nbsp; &lt;br /&gt;&lt;br /&gt;రాజీనామాల ప్రకటనతో గడువు గండం గట్టెక్కవచ్చు. ఢిల్లీ పిలుపువచ్చి లాలన  బుజ్జగింపు దొరికితే వీరులు మెత్తపడనూ వచ్చు. అడుగు ముందుకు పడినందుకు  ఆశావాదులు ఇప్పుడు ఆనందించవచ్చు. సహజమే. పునరావృత్తపు హింసలో ఆశ ఒకటే  ఉనికిని కాపాడుతుంది. కానీ, ఆస్కారం లేని చోట అత్యాశ మొదటికే మోసం  తెస్తుంది. ప్రాంతీయ మండలి పునరావృత్తమై ఉద్యమాన్ని వెక్కిరిస్తుంది. మరో  ఆరు సూత్రాలో, వేల కోట్ల ప్యాకేజీయో పరిష్కారమై పలకరిస్తాయి. ఉద్యమం మరో  తరం వాయిదా పడుతుంది. సిద్ధంగా ఉన్నావా తెలంగాణా? &lt;br /&gt;&lt;br /&gt;ఏదో ఒకటి తేల్చమని అక్కడా ఇక్కడా కోరుతున్నారు. నిష్క్రియలో నిండా మునిగిన  కేంద్రం ఏదీ తేల్చదు. గొంగడి వేసిన చోటనే ఉంటుంది. మూడోసారి నాలుగో సారి  కూడా చరిత్ర విషాదంగానే పునరావృత్తమవుతూ ఉంటుంది. &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6773585286935486845-1882646920500921082?l=sandarbham1.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://sandarbham1.blogspot.com/feeds/1882646920500921082/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/07/blog-post_04.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/1882646920500921082'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6773585286935486845/posts/default/1882646920500921082'/><link rel='alternate' type='text/html' href='http://sandarbham1.blogspot.com/2011/07/blog-post_04.html' title='అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు...'/><author><name>కె. శ్రీనివాస్</name><uri>http://www.blogger.com/profile/05464214884852289323</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='32' src='http://1.bp.blogspot.com/_y8FBnI6AyP0/S4jqfPzGkqI/AAAAAAAAABg/fw2jEJY-t9s/S220/eye.bmp'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6773585286935486845.post-7992322733034961140</id><published>2011-07-03T06:59:00.000-07:00</published><updated>2011-07-03T06:59:38.883-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='AJ Editorial 02 Jul 2011'/><title type='text'>మావో తప్పులు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div id="page1" style="text-align: justify;"&gt;&lt;div class="RunningText"&gt;      ఆర్థిక విధానాల విషయంలో మావో జెడాంగ్ చేసినవన్నీ తప్పులేనని చైనా  కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) తాజాగా నిర్ధారణకు వచ్చింది. మావో విధానాలలో  70 శాతం ఒప్పులని, 30 శాతం తప్పులని మూడు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న  సిపిసి ఇప్పుడు ఆర్థిక రంగంలో మాత్రం నూటికి నూరుశాతం తప్పులేనని లెక్క  మార్చింది. శుక్రవారం నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 90  సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ తాజా అవగాహనను పార్టీ చరిత్ర విభాగం  బాధ్యులొకరు వెల్లడించారు. డెంగ్ సియావో పెంగ్ సంస్కరణల వల్లనే చైనాలో  నేటి ప్రగతి సాధ్యపడిందని ఆయన ప్రకటించారు.&lt;br /&gt;&lt;br /&gt;సిపిసి 90వ వార్షికోత్సవాల సందర్భంగా చైనా అంతటా వెలసిన బ్యానర్లలో,  పోస్టర్లలో ఎక్కడో కానీ మావో చిత్రం కనిపించదు. ఎర్రజెండా, సుత్తీకొడవలి  ఉంటాయి కానీ, ఇంతకాలం చైనాకు సంకేతంగా ఉన్న తియనాన్మెన్ స్వ్కేర్ కానీ,  మావో సమాధిమందిరం కానీ ఏ ప్రచారసామగ్రిలోనూ లేవు. ఆకాశాన్నంటే భవనాలు,  ఒలెంపిక్స్ సందర్భంగా నిర్మించిన సముదాయాలు చైనా ప్రగతికి సంకేతాలుగా  చూపిస్తున్నారు. గంటకు రెండువందల మైళ్ల వేగంతో బీజింగ్-షాంఘై  నగరాల మధ్య నడిచే బులెట్ ట్రెయిన్ జూన్ 30 నాడు ప్రారంభమైంది. ఈ రైలు  గురించి ప్రపంచ మీడియా అంతా ముచ్చటగా రిపోర్టు చేసింది. ఈ మధ్యే చైనా  సముద్ర జలాల మధ్య ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనను నిర్మించి అమెరికా  రికార్డును తిరగరాసింది. త్రీగోర్జెస్ ఆనకట్ట కానీ, ఒలంపిక్స్ నిర్వహించిన  తీరు కానీ చైనా బృహత్ నిర్మాణశక్తిని, నిర్వహణాశక్తిని ప్రపంచానికి చాటే  చిహ్నాలే. మావోను నమ్ముకుని ఉంటే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని చైనా  ప్రస్తుత నాయకత్వం గట్టిగా నమ్ముతోంది.&lt;br /&gt;&lt;br /&gt;మావో 'భూతాన్ని' వదిలించుకోగలిగితే డెంగ్ ఎప్పుడో వదలించుకునేవారు. మావో  నామరూపాలు లేకుండా చేసేవారు. సాంస్క­ృతిక విప్లవం కాలంలో పెట్టుబడిదారీ  మార్గీయుడిగా ఆరోపితుడై శ్రమశిబిరాలలో కాలం&lt;/div&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; గడపవలసి వచ్చిన డెంగ్, మావో  చివరిరోజుల్లోనే తిరిగి పార్టీలో ప్రముఖస్థానంలోకి వచ్చారు. మావో చనిపోయిన  వెంటనే కొంతకాలం మధ్యేమార్గీయులకు అధికారం దక్కింది. నాలుగైదేళ్లలోనే  డెంగ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. సాంస్క­ృతిక విప్లవ రెడ్‌గార్డులు  ఆయన మీద చేసిన ఆరోపణ కేవలం ఆరోపణ కాదని, వాస్తవమని డెంగే స్వయంగా  నిరూపించారు. &lt;br /&gt;పార్టీని గుప్పిట్లో పెట్టుకుని, క్రమంగా పరిపాలనలో,  సామాజిక విలువల్లో కొత్త విలువలను ప్రవేశపెట్టారు. సోషలిజం జపాన్ని  విడవకుండానే, మావో ప్రవేశపెట్టిన సాముదాయికత, సమష్టి తత్వం, సామాజికీకరణ  విధానాలకు మంగళం పాడారు. పిల్లి తెల్లదైతేనేం, నల్లదైతేనేం, ఎలకలను  పట్టడడమే ముఖ్యం- అన్నది డెంగ్ సుప్రసిద్ధ సూక్తి. గమ్యంగా సోషలిజాన్ని  పేర్కొంటూనే, అందుకు పెట్టుబడిదారీ సాధనాలను వినియోగించడానికి ఆయన  పూనుకున్నారు. అయితే, మావో మీద చైనా సమాజంలో ముఖ్యంగా గ్రామీణసమాజంలో ఉన్న  ప్రేమాభిమానాలు అచంచలమైనవి కావడంతో, ఆయనను పూర్తిగా నిరాకరించే సాహసం  డెంగ్ చేయలేకపోయారు. &lt;br /&gt;&lt;br /&gt;1966లో సాంస్క­ృతిక విప్లవ కాలం దాకా ఆయనను  నూటికి నూరుపాళ్లు అంగీకరించవచ్చునని (1950ల చివరలో మావో అమలుజరిపిన పెద్ద  ముందంజ కార్యక్రమంపై కూడా కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ) చెబుతూ, ఫ్యూడల్  వ్యవస్థ నుంచి, విదేశీ ఆక్రమణనుంచి విముక్తి చేసిన మహానుభావుడిగా మావోను  పరిగణించాలని సిపిసి 1980ల ప్రారంభంలో ఒక అంచనా విడుదల చేసింది. వర్తమానం  నుంచి మావోను విముక్తం చేసి ఒక చారిత్రక వ్యక్తిగా, నవచైనా జాతిపితగా  గుర్తించే ధోరణి అప్పటినుంచి మొదలయింది.సాంస్క­ృతిక విప్లవ కాలంలో  మావో వ్యక్తి ఆరాధన పెరిగిపోయిందని, ఆ విప్లవ విమర్శకులు చెబుతారు. అం  దులో వాస్తవం లేకపోలేదు. మావో ఆలోచనలను అధ్యయనం చేయడంతో పాటు, ఆయనను  వ్యక్తిగా పూజించడం, దోషరహితుడిగా భావించడం చేసేవారు. ఆ ధోరణిని  విమర్శించిన డెం గ్, మావోను విగ్రహమాత్రుడిగా మార్చివేశారు. ఆయన ఆలోచనలతో  నిమిత్తం లేకుండా, మావోను ప్రేమించే తరాలను తయారుచేశారు. కరెన్సీ నోట్లమీద,  రోడ్ల పక్కన, కీచైన్లపై, సిగరెట్ లైటర్లపై- ఇందుగలడందులేడని సందేహం  లేకుండా మావో బొమ్మలను దేశమంతా నింపివేశారు. దీని వల్ల రెండు  ప్రయోజనాలున్నాయని డెంగ్‌కు, ఆయన వారసులకు తెలు సు.&lt;br /&gt;&lt;br /&gt;ఒకటి మావో  నుంచి ఆయన సిద్ధాంతాలను వేరుచేయవచ్చు. రెండు- ప్రపంచంలో ఒక ప్రాబల్య  ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనాకు ఒక జాతీయ చిహ్నం కావాలి,  ఉత్తేజపరిచే ప్రతీక కావాలి. ఎంత కష్టపడినా డెంగ్‌కు ఆ స్థాయి రాదు. మావోయే  గతి. మావో చనిపోయి, ఆయన విధానాలు పార్టీలో పరాజితం అయ్యాక- చైనాలో 
